బిజెపి ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేసి, ఆ రాష్ట్రంలో కొంత బలపడ్డాక చేరదీసిన ప్రాంతీయ పార్టీలనే కబళించే వ్యూహాన్ని అమలు చేసి గతంలో మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బిజూ జనతాదళ్, జనతాదళ్ (ఎస్) వంటి పార్టీలను దూరం చేసుకుంది. ఇప్పుడు ఈ వ్యూహాన్నే ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేసి టిడిపి ని కూడా దెబ్బ కొట్టాలని చూస్తుంది.
పొరుగున ఉన్న తమిళనాడులో జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీని కబళించి, బీజేపీలో కలుపుకుని తమిళనాడులో బలపడాలని చూసింది కానీ, పాచికలు పారక, సిద్ధాంతరీత్యా తమకు బద్ద శత్రువైన డీఎంకే కు స్నేహ హస్తం చాచింది, ఐనా కానీ వారితో పొత్తు కుదిరే సూచనలు కనిపించటం లేదు. తమిళనాడు ఆర్కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బిజెపి ని ఆ రాష్ట్ర ప్రజలు కాండ్రించి ఛీకొట్టిన తరువాత బిజెపి తో పొత్తు పెట్టుకోటానికి ఆ రాష్ట్రంలో మరే పార్టీ కూడా ముందుకొచ్చే పరిస్థితి కనిపించటం లేదు.
ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే.. చంద్రబాబు నాయుడుకు అన్ని బిజెపి, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో సత్సంబంధాలే ఉన్నాయి. భవిష్యత్తులో బాబు తమకు బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతాడని భావించి, ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుని బలహీన పరిచి, జగన్ లాంటి అనామకుడిని అక్కున చేర్చుకుంటే తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని ఆశించిన బిజెపి, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు తమ వ్యూహాలు రచిస్తున్నారు.
ఆరెస్సెస్ అడుగుజాడల్లో నడిచే భాజపా ఇప్పుడు విలువలకు, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి తాత్కాలిక ప్రయోజనాలే ధ్యేయంగా చంద్రబాబు నాయుడును బలహీనపరచాలనే ఏకైక లక్ష్యంతో జగన్ నాయకత్వంలోని సిలువ పార్టీ వైసిపి కి స్నేహ హస్తం చాస్తోంది. మతాన్ని రెచ్చగొట్టగలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకు బిజెపి బలంగా ఉండటమో, లేక అధికారంలోకి రావటమో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడులో ఆ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా అధికారంలోకి రావటంతో, లేక బలపడటమో కల్ల.
వైసిపి తో పొత్తుతో ఆంధ్ర ప్రదేశ్ లో ఏదోరకంగా బలపడాలని బిజెపి, బిజెపి తో చెలిమి చేసి ఏదో రకంగా తనపై ఉన్న కేసుల నుండి బయటపడితే చాలనుకుంటున్న జగన్ కొత్త పొత్తులకు అర్రులు చాస్తున్నారు... విజ్ఞులైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారు. వైసిపి, బిజెపి పార్టీలకు ఇక 'ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్' ...