కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస రాజకీయ క్రీడలో బలైపోయిన కమ్మ, కాపు కులాల మధ్య వైరుధ్యం ఆ తరువాత రెండు దశాబ్దాలపాటు కొనసాగింది. ఆ రెండు కులాల మధ్య కుల విద్వేషాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన కాపులను ఏదో విధంగా రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న కోస్తా జిల్లాల్లో కులాల కుంపట్లు రగిలించి, విధ్వంసకాండ సృష్టించి తన పబ్బం గడుపుకోటానికి జగన్ కుట్ర పన్నాడు. ఎన్నికల హామీలో భాగంగా కాపుల కోసం కార్పోరేషన్ ఏర్పాటుచేసి, బిసిల్లో చేర్చటానికి కమిషన్ నియమించిన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొంతమంది కాపు నాయకులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయంచటంలో జగన్ రెడ్డి కొంతవరకు సఫలమయ్యాడు.
జగన్ కూడా తన పార్టీ ఎన్నిక మానిఫెస్టోలో తానూ అధికారంలోకి వస్తే కాపులను బిసిల్లో చేర్చటానికి కమిషన్ వేస్తానని చెప్పాడే తప్ప జీవో తో బిసిల్లో చేరుస్తానని చెప్పలేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ జీవో జారీ చేసి, ఆ తరువాత ఆ జీవోను కోర్టులు కొట్టివేస్తే కాపులను బిసిల్లో చేర్చే విషయంలో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రచారం చెయ్యవచ్చు అనేది జగన్ ఆలొచన... తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాపులను బిసిల్లో చేర్చటానికి ఎందుకు ప్రయత్నించలేదో ఈ 420 చెప్పగలడా? ఇంత నిక్రుస్థపు ఆలోచనలు కలిగిన జగన్ తన అధికారం కోసం ఏమైనా చెస్తాడు.. చేయిస్తాడు.. కాపులారా కళ్ళు తెరవండి...
2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆ తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణం ఏమిటి? 2004 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక పవనాల్లో రాధాకృష్ణ గెలిచాడు. తదనంతర పరిణామాల్లో రాజశేఖర రెడ్డి తన బద్ధ శత్రువు నెహ్రూ ను దగ్గరకు తీయటం నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేసి రంగా అనుంగు శిష్యుడు 'మల్లాది విష్ణు' చేతిలో పరాజయం పాలయ్యాడు, ఆ తరువాత 2014 ఎన్నికల్లో వైకాపా తరుపున విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి రెండో సారి మరల పరాజయం పాలయ్యాడు.. రాధాకృష్ణకు అన్ని కులాల్లో అభిమానులున్నారు కానీ కాపులు అతనికి వేసిన కులం రంగు అతని విజయావకాశాలను దెబ్బతీసింది అనేది ఒప్పుకోవలసిన నిజం.
అదే విధంగా గతంలో కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం 1994, 2009 ఎన్నికల్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచినా ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోవటానికి కులం రంగే కారణం అని ఒప్పుకుంటారా? రంగా హత్యకు తెలుగుదేశం పార్టీనే కారణమని చెప్పి ఉద్యమం చేసిన ఈ నాయకుడు మరి 1999 లో అదే తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి కాకినాడ పార్లమెంటుకు ఎన్నికైన విషయం కాపులు అప్పుడే మర్చిపోయారా? తమ స్వప్రయోజనాలకోసం పార్టీలు మార్చే వీళ్లా మనకు నాయకులు? 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన తరువాతే ఈయనకు కాపులు మళ్లీ గుర్తుకు వచ్చారా? అమాయక కాపు యువతను కాపులను రెచ్చగొట్టి.విద్వేషాలు, విధ్వంసాలు సృష్టిస్తే ఆయనకు ఏమి ప్రయోజనం, కాపు జాతి ప్రయోజనాలు దెబ్బతినటం తప్ప!
ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి కూడా కేవలం అతను మావాడంటూ మనం పూసిన కులం రంగే 'చిరంజీవి' కాపులకు బలమైన నియోజకవర్గం 'పాలకొల్లు' లో ఓడిపోవటం నూటికి నూరుపాళ్ళు కారణం కాదంటారా?? కేవలం ఒక కులం వాళ్ళు ఓటు వేస్తేనే నాయకులు గెలవరు, ఒకే కులాన్ని నమ్ముకుంటే మిగిలిన కులాల వారు దూరమౌతారు అనేందుకు పై మూడు ఉదాహరణలు సరిపోతాయి. కులం వ్యక్తి గతం.. రాజకీయం కుల మతాలకు అతీతమైనది.
కులాన్ని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు... కులం వేరు రాజకీయం వేరు అనే విషయం గుర్తుంచుకుని అన్ని పార్టీలతో, అన్ని కులాల వారితో సామరస్యంగా ఉండి మన హక్కులు సాధించుకోవాలి. నిజం ఎప్పడూ చేదుగానే ఉంటుంది... జీర్ణించుకోవటం కష్టమే!