రాజధాని కోసరం భూములు సమీకరిస్తున్న ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో సారవంతమైన భూములు, కొన్ని గ్రామాల్లో సాగులోలేని మెట్ట భూములు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 7,000 నుండి 40,000 వరకు ఏడాదికి కౌలు ఇచే భూములున్నాయి. రాజధాని ఏర్పాటు ప్రచారానికి ముందు ఆ గ్రామాల్లో 10 లక్షలనుండి 40 లక్షల వరకు భూముల ధరలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పరిహారం ప్రకారం ఒక్కో ఎకరానికి రైతుకు 2 కోట్ల వరకు గిట్టుబాటు అవుతుంది, అంటే 5 నుండి 20 రెట్ల వరకు ప్రయోజనం పొందుతున్నారు. భూములు కోల్పోయి పరిహారం పొందిన రైతులు రాజధానికి 30, 40 కిలోమీటర్ల దూరంలో సారవంతమైన భూములు ఎకరానికి 20 నుండి 25 లక్షల రేటుకు కొన్నాకానీ ఎకరానికి ఎనిమిది నుండి 10 ఎకరాలు వస్తుంది. రాజధాని ప్రాంతంలో వారి నివాస స్థలాలకు మంచి ధర వస్తుంది. అక్కడ భవిష్యత్తులో వచ్చే నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అన్ స్కిల్ల్ద్, సెమి స్కిల్ల్ద్ లేబర్ కు ఉపాధి దొరుకుతుంది.
కాని, ప్రతిపక్షాలు, ముఖ్యంగా సాక్షి మీడియా, జగన్ అండ్ కో భూములు కోల్పోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా, మోసం చేస్తున్నట్లు, తమ భూములకు ఎంత అధిక ధర వచ్చినా రైతులు కన్న తల్లి లాంటి తమ భూములను అమ్ముకోవటానికి ఇష్టపడరని, అధిక లాభం చూపి రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ రైతుల ప్రయోజనాలను కాలరాసే విధంగా వారిని అసత్య ప్రచారంతో మభ్యపెడుతున్నారు.
ఇలా అసత్య ప్రచారం చేస్తున్న జగన్ డర్టీ గ్యాంగ్ సరస్వతి పవర్ సిమెంట్ ఫాక్టరీ నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఆశపెట్టి వేల ఎకరాల పొలం అతి తక్కువ ధరతో దొబ్బి ఆ తరువాత మొండి చెయ్యి చూపించలేదా? ఖాళీగా ఉన్న భూములను సాగుచేయటానికి ప్రయత్నించిన రైతులపై గూండాలతో దాడి చేయించాడు. భారతి సిమెంట్ పరిశ్రమకు కూడా రైతుల వద్దనుండి భూములు కారు చౌక ధరలకే కొనుగోలు చేయలేదా? రైతుల దగ్గర కన్న తల్లి లాంటి భూములను అబద్ధాలు చెప్పి, మోసం చేసి స్వాధీనం చేసుకొన్న జగన్ అండ్ కో దీనికి ఏమని సమాధానం చెబుతారు? మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారమా?
అబద్ధాలు, అవినీతి, మోసం తప్ప నీతి, నిజాయితీ, సంస్కారం అనే మాటలకు అర్ధమే తెలియని జగన్ రైతుల గురించి మొసలి కన్నీళ్లు కార్చటం 'దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా' ఉంది.