కానీ చంద్రబాబు నాయుడు పెద్ద శ్రమ పడకుండానే 'స్వర్ణాంద్ర ప్రదేశ్' కల కొంత వరకు సాకారం చేసాడు కెసిఆర్. ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు విద్య, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ తరలి వెళ్ళేవారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గత 58 సంవత్సరాలు గా పరిపాలించిన ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మిగిలిన పట్టణాలను పక్కన పెట్టి హైదరాబాద్ పట్టణాన్ని మాత్రమె అభివృద్ధి చేయటం వలన ఈ పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో వసూలైన పన్నులలో ఎక్కువ భాగం హైదరాబాద్ లో ఖర్చు చేయటం వలన ఆ ఒక్క పట్టణం మాత్రమే ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఆభివృద్ధి చెందింది.
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు పక్కనే ఉన్నా కాని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ప్రజలను ఇబ్బంది పెట్టి హైదరాబాద్ కు ఎటువంటి కరెంట్ ఇబ్బంది లేకుండా చూసే వారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పధకంలో ఎక్కువగా లబ్ది పొందింది కూడా ఎక్కువ శాతం బోరుల పైన వ్యవసాయంపై ఆధార పడిన తెలంగాణా రైతులే!
తెలంగాణా ప్రాంతం విడిపోయిన తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ మొదలైంది. ఈ ప్రాంత ప్రజలు కలలో కూడా ఉహించని పరిశ్రమలు, IIT, IIM, AIMS లాంటి సంస్థలు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు త్వరలో వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు గతంలో కంటే బాగా మెరుగయ్యాయి.
పరిశ్రమలకు, గృహావసరాలకు నిరంతర విద్యుత్తు, రైతులకు గతంలో కంటే నాణ్యమైన విద్యుత్ 9 గంటలు లభిస్తుంది. భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ రెండు, మూడు రెట్లు అన్ని ప్రాంతాలలో పెరిగింది. ఈ ప్రాంత ప్రజల సంపద విలువ రెట్టింపయ్యింది.
తెలంగాణా ప్రాంతంలో గత పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. విద్యుత్ కొరత కారణం గా పొలాలకు నీరందక, పంటలు ఎండిపోయి, పంట నష్టంతో గతంలో ఎన్నడు లేని విధంగా గత ఆరు నెలల కాలంలో 260 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కారణాల వలన ఈ ప్రాంతంలో అమ్మే వారు తప్ప కొనే వారు లేకపోవటంతో భూముల విలువ గతంలో కంటే బాగా పడిపోయింది.
ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవడం, హైదరాబాద్ లో పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలు మందగించటం వంటి కారణాలతో హైదరాబాద్ కు ఆంధ్ర ప్రాంతం వారి వలసలు ఆగిపోయి, తిరుగు వలసలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో స్థలాలు, ఇళ్ళు, అపార్టుమెంటుల విలువ బాగా పడిపోయింది, ఇక్కడి ప్రజల సంపద విలువ ఎంతో కొంత క్షీణించింది.
"కర్ణుడి చావుకు కారణాలు అనేకం" కాని, తెలంగాణాకు పట్టిన ఈ దౌర్భాగ్యానికి కారణం మాత్రం కెసిఆర్ మాత్రమే! తెలంగాణా సాధించటం ద్వారా కెసిఆర్ కుటుంబానికి మూడు మంత్రి పదవులు, ఒక MP పదవి దక్కింది. తెలంగాణా ఏర్పాటుతో నిజంగా లబ్ది పొందింది తెరాస నాయకులూ, కెసిఆర్ కుటుంబం, తెలంగాణా ఉద్యోగులు మాత్రమే అని, ప్రస్తుతం ఉన్న తెలంగాణా "బంగారు తెలంగాణా కాదు "నిర్జీవ తెలంగాణా" అని తెలంగాణా ప్రాంతంలో యావత్తు ప్రజానీకం భావిస్తున్నారు.
నిజంగా కెసిఆర్ ప్రత్యెక తెలంగాణా ఉద్యమమే లేకపోతె! తెలంగాణా రాష్ట్రము ఏర్పడకపోతే! తమ ప్రాంతం ఇంతగా అభివృద్ధి చెందకపోయి ఉండేదని. "స్వర్ణాంధ్ర" సాధనలో కెసిఆర్ భాగస్వామ్యమే ఎక్కువని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా తలపోస్తున్నారు.