అధికారాన్ని అడ్డం పెట్టుకును స్నేహితులకు, బంధువులకు, కులపోళ్ళకి దోచిపెట్టటం, పనికిరాని వాళ్ళని, 420 గాళ్ళని అందలాలు ఎక్కించటం, వాళ్లకు పదవులు పంచి పెట్టటం.... ఇదేనా విశ్వసనీయత? రాజశేఖర రెడ్డి జమానాలో జరిగిందేమిటి! తన సోదరుడు వివేకానంద రెడ్డి ని శాసన సభ్యుడిని, బావమరిది రవీంద్రనాథ్ రెడ్డిని కడప మేయర్, తోడల్లుడు సుబ్బారెడ్డి అల్లుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు శాసనసభ్యుని చేశాడు.. తమ్ముడు సుదీకర రెడ్డికి, తోడల్లుడు వై.వి సుబ్బారెడ్డికి, అల్లుడు అనిల్ శాస్త్రికి గనులు పంచిపెట్టాడు. స్నేహితులు రామచంద్రరావును బ్రోకర్ గా , విజయసాయి రెడ్డిని అవినీతికి కన్సల్టెంట్ గా నియమించుకుని వారికి ప్రభుత్వ పదవులు కట్టబెట్టి వందల కోట్లు ముడుపులు వారి ద్వారా దిగ మింగాడు. కులపోళ్ళు గాలి జనార్ధనరెడ్డి లాంటి లంగా గాళ్ళకు, పెన్నా ప్రతాప రెడ్డికి అక్రమంగా గనులు దోచిపెట్టాడు, ఇందు గ్రూప్ శ్యాంప్రసాద్ రెడ్డికి, రాంకీ అయోధ్య రామిరెడ్డికి భూములు దోచిపెట్టాడు... ఇవే కాకుండా తమ చెంచా గాళ్ళకు, నయా పైసాకు కూడా చెల్లని వెధవలకు, గూండా గాళ్ళకు మంత్రి పదవులు, కార్పోరేషన్ పదవులు ఇతర ముఖ్యమైన పదవులు కట్టబెట్టాడు... అన్నిటికంటే ముఖ్యంగా తన పుత్ర రత్నం జగన్ కు ఒకరకంగా 'రాష్ట్రాన్ని' రాసి ఇచ్చేసాడు.... ప్రభుత్వానికి చెందిన ప్రతి పనిలో, ప్రతి ప్రాజెక్టులో జగన్ కు ముడుపులు అందే విధంగా ఏర్పాటు చేశాడు. చెల్లని రూపాయి లాంటి జగన్ ను తను గద్దెనెక్కిన కొద్ది కాలంలోనే దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్తను చేశాడు.
ఒక రకంగా రాజశేఖర రెడ్డి విశ్వసనీయత అనే పదానికి అర్ధాన్ని ఖూనీ చేశాడు... వ్యక్తిగత విశ్వసనీయత, రాజకీయాల్లో విశ్వసనీయత... ఈ రెండిటికి వేరు వేరు అర్ధాలున్నాయి. వ్యక్తిగత విశ్వసనీయత అంటే తనకు సహాయం చేసిన, తనను నమ్ముకున్న వారిని మర్చిపోకుండా అవకాశం వచ్చినప్పుడు వారికి మేలు చేయటం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం కానీ.. రాజకీయాల్లో విశ్వసనీయత అంటే.... రాజకీయాల్లో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు విశ్వసనీయత చూపించవలసింది తమ బంధువులు, స్నేహితులు, కులపోళ్ళు, చెంచాగాళ్ళకు కాదు... తమపై ఆశలు పెట్టుకున్న ప్రజానీకానికి మాత్రమె! ... ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరిగేలా, ప్రభుత్వ పధకాలు అందరికి అందేలా చూడటమే విశ్వసనీయత.... ప్రజలు కోరుకొనేది, వారికి కావలసింది కూడా అటువంటి విశ్వసనీయత కలిగిన నాయకులే!
ఇప్పటికైనా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్... రాజశేఖర రెడ్డి గురించి కాని, ఆయన విలువలు, విశ్వసనీయత గురించి కాని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది... చంద్రబాబు నాయుడి నుండి ప్రజలు కోరుకొనేది 'రాజశేఖర రెడ్డి' మార్కు విశ్వసనీయత మాత్రం కాదు... ప్రజలకిచ్చిన హామీలకు, ప్రజా ధనానికి, ప్రజా సమస్యల పరిష్కారంలో మాత్రమె విశ్వసనీయుడిగా ఉండాలని కోరుకుంటున్నారు...