2009 సంవత్సరం శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున సుడిగాలి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ సభలకు విశేషమైన స్పందన లభించింది.. చంద్రబాబు నాయుడు తరువాత పార్టీ సారధ్యం వహించే సామర్ధ్యం ఉన్నవాడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తరువాత వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ ప్రచార ప్రభావం ఏమాత్రం కనిపించలేదు, జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపాయింది. తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైన స్థానాన్ని ఆశించిన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ భంగపడి తమ వర్గంతో సహా పార్టీకి దూరంగా ఉండి పోవటమే కాకుండా తన మామ ద్వారా సంక్రమించిన స్టూడియో N ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాడు. అదే సమయంలో తన అనుచర వర్గాన్ని జగన్ శిబిరానికి దగ్గర చేసి తన ఛానల్లో జగన్ కు అనుకూల ప్రచారం మొదలుపెట్టాడు... అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తో, చంద్రబాబు నాయుడుతో అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమయ్యాడు.
చాలామంది ఊహించినట్లుగానే జగన్ బలాన్ని అతిగా ఉహించుకున్న హరికృష్ణ వర్గం లోపాయకారీగా జగన్ తో చేతులుకలిపి తెలుగుదేశం పార్టీలో శల్యసారధ్యం చేశారు. జగన్ కు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్యవర్తులుగా హరికృష్ణ, కొడాలి నాని వ్యహరించారు... ఈ విషయంలో హరికృష్ణకు జగన్ నుండి బాగానే డబ్బులు ముట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ కు, హరికృష్ణ కు అత్యంత సన్నిహితుడు వాళ్ళు పట్టుబట్టి గుడివాడ నుండి సీటు ఇప్పించుకున్న... కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కి ద్రోహం చేసి జగన్ పార్టీలో చేరటమే కాకుండా పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన అతి తీవ్రమైన విమర్శలు చేసిన సమయంలో తండ్రి, కొడుకులు ఏమాత్రం స్పందించలేదు సరికదా! తమ ఛానల్ లో అతిగా ప్రచారం కల్పించారు.
అప్పటివరకు లోపాయకారిగా నడచిన వ్యవహారం అప్పటితో బట్ట బయలైంది.. పార్టీలో ఇక హరికృష్ణ ను కాని జూనియర్ ఎన్టీఆర్ ను కాని నమ్మే పరిస్థితి పోయింది. నందమూరి అభిమానులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ కు దూరంగా జరిగారు. ఆ తరువాత నుండే జూనియర్ ఎన్టీఆర్ కు కష్ట కాలం దాపురించింది... అభిమానులు, పార్టీ వర్గాలు దూరమయ్యారు.. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి... ఆ సమయంలో తన స్వలాభం కోసం అభిమానులను దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నంలో భాగంగా తను బ్రతికున్నంత కాలం 'తెలుగుదేశం' పార్టీలోనే ఉంటానన్న ప్రకటనలు చేశాడే తప్ప ఆచరణలో మాత్రం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వ్యవహరించాడు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చంద్రబాబాబు నాయుడిని బెదిరించి తమ పబ్బం గడుపుకోవాలనుకున్న తండ్రి, కొడుకుల ఆటలు ఇతర కుటుంబ సభ్యుల, పార్టీ అభిమానుల మద్దతు లేకపోవటం వలన సాగలేదు.
తెలంగాణా విషయంలో చంద్రబాబు నాయుడు విధానాన్ని వ్యతిరేకించిన హరికృష్ణ తన పదవీకాలం ముగిసే కొన్ని నెలల ముందు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ విధానాలపైన విమర్శలు చేశాడు, ఆ తరువాత సిగ్గు లేకుండా తనకు మరోసారి రాజ్యసభ సభ్యతం కావాలని కోరుకున్నా కాని ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.
2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు గుంటూరు జిల్లా నుండి జగన్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించటం అందరికి తెలిసిన విషయమే. హరికృష్ణ హిందూపూర్ లేదా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం చంద్రబాబు ను దేబిరించి భంగపడ్డాడు.. నిజంగా అతనికి, కొడాలి నానికి ఏ విధమైన సంబంధం లేకపోతె గుడివాడ నుండే పోటి చేయటానికి పార్టీ టికెట్ అడిగి ఉండేవాడు. ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వర్గం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా వైకాపాకు మద్దతివ్వటం బహిరంగ సత్యమే!
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, బాలకృష్ణ శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంతో... వైకాపా అధికారంలోకి రావటం, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అనుకున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు.
తదనంతరం కొంతకాలం మౌనం వహించిన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్... గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సరిగా ఆడక పోవటం, హరికృష్ణ రాజకీయ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటం, జూనియర్ పర్యవేక్షణలో ఉన్న స్టూడియో N చానల్ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉండటం వంటి కారణాలతో తమ భవిష్యత్తుపై కలత చెందిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మధ్య వర్తుల ద్వారా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు వద్దకు రాయబారాలు సాగించి.. తమ తప్పులను ఒప్పుకుని ఇకమీదట తమవైపు నుండి ఎటువంటి ఎటువంటి తప్పులు జరగవని హామీ ఇచ్చి దాదాపుగా వాళ్ళ కాళ్ళమీద పడినంత పనిచేసినట్లు తెలియవచ్చింది. బాలకృష్ణ కొంత పట్టుదలతో ఉన్నాకాని.. క్షమా గుణం ఎక్కువగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పంతాలు, పట్టింపులకు పోకుండా వారిరువురిని క్షమించినట్లు, మొత్తానికి హరికృష్ణ కుటుంబ కథా చిత్రం సుఖాంతంగా ముగిసినట్లే తెలియవచ్చింది.