ఇదేనా కెసిఆర్ మార్కు సామాజిక న్యాయం, సమ న్యాయం? అగ్ర కులాలవారికి బంగారు తెలంగాణా వచ్చేసింది, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత తెలంగాణలో సామాజిక విప్లవం వచ్చింది, వెనుకబడిన కులాలవారికి, షెడ్యూలు కులాల, తెగల వారికి రాజకీయరంగంలో సముచిత స్థానం లభించింది. మంత్రి పదవుల్లో, ఇతర అధికార పదవుల్లో సామాజిక న్యాయం జరిగింది. అప్పటి వరకు తెలంగాణలో నడచిన దొరతనానికి కళ్ళెం పడి, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికి పగ్గాలు దక్కాయి. అప్పటినుండి ఎన్టీఆర్ పై ద్వేషాన్ని అణచి పెట్టుకున్న అగ్ర వర్ణాల వారికి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రము ఏర్పడటం, తెరాస పార్టీ కెసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి రావటంతో మంచి అవకాశం మరల దక్కినట్లే భావించారు. వారు ఉహించినట్లుగానే కెసిఆర్ ఆ రెండు అగ్ర వర్ణాల వారికి మంత్రి పదవుల పందేరం చేశాడు.. వారు కోరుకున్న బంగారు తెలంగాణా వారికి వచ్చేసింది. కెసిఆర్ తన కుటుంబం, తన కులం, తను భయపడుతున్న కులం వారికి మాత్రమే కీలకమైన మంత్రి పదవులు కట్టబెట్టాడు. తన ఊహ ప్రకారం ఆ రెండు కులాల నాయకుల్లో తప్ప మిగిలిన కులాల నాయకుల్లో నాయకత్వ పటిమ, సామర్ధ్యం లేదనేనా? తెలంగాణా రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 90% మంది బిసిలు, దళితులే... వారెప్పుడు అగ్రకులాల వారెక్కిన పల్లకీలు మోసే బోయీలుగా మిగిలి పోవలసిందేనా?
తెలంగాణా ప్రస్తుతం నడుస్తున్న పాలన చూస్తే.... గతంలో 'తెలంగాణా రాష్ట్రంలో సామాజిక న్యాయం' కోసం దళితుల, పేదల పక్షాన పోరాడిన నక్సలైట్లు, గద్దర్, నారాయణమూర్తి, విమలక్క లాంటి ప్రజా ఉద్యమకారులు మరల చైతన్యమై, సామాజిక న్యాయం కోసం ఉద్యమించే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. 'పాయసం, కుడుములు మాకు... పప్పు, బెల్లాలు మీకు' అనే సామెతను నిజం చేస్తూ అగ్ర కులావారికి ప్రాధాన్యమున్న మంత్రి పదవులు కట్టబెట్టి , మిగిలిన కులాలవారికి పనికిరాని, అప్రధాన పదవులు పందేరం చేసి వారి నోరు బలవంతంగా నోక్కేస్తున్న కెసిఆర్ మరి కొంతకాలం తెలంగాణా రాష్ట్రంలో తన దొరతనం కొనసాగించవచ్చు.
Everyday is not Sunday.