ఏ పార్టీ కైనా నాయకుల కంటే ప్రజా బలం ముఖ్యం. సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల బలం లేకుండా ఏ పార్టీ అధికారం లోకి రాలేదు. బిజెపి ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉందంటే, దానికి ఆ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం, ప్రజాకర్షణ ముఖ్య కారణం. గతంలో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి నాయకులు అనేకమంది ఆ పార్టీలోకి చేరారు, కాని ఆ తరువాత కథ అందరికి తెలిసిందే! వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే!!
బిజెపి కానీ, ఆ పార్టీ కాని తలక్రిందులుగా తపస్సు చేసినా ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వెంట్రుక కూడా పీకలేరు. అంతే కాదు, కనీసం ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా కూడా ఎదగలేరు. తెలంగాణా ఏర్పాటుకు మద్దతిచ్చిన ఆ పార్టీ గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏమి ప్రభావం చూపలేక పోయింది, పైగా తెలుగుదేశం పార్టీ కంటే ఫలితాల్లో కూడా వెనుకబడింది. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది, వచ్చే ఎన్నికల నాటికి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కాల గర్భంలో కలిసిపోక తప్పదు.. హిందూత్వ నినాదంతో ఉత్తరాది రాష్ట్రాల్లో బలపడిన బిజెపికి ఆంధ్ర ప్రదేశ్ లో ఆ విధమైన అనుకూలత ఏమాత్రం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలు చేసినవారు ఇంకా దొరల్లానే తిరుగుతున్నారు, విదేశీ బ్యాంకుల్లో బడా బాబులు దాచుకున్న నల్ల ధనం అలాగే నిక్షేపంగా ఉంది. 'ఆర్ధిక నేరస్థుడు' జగన్ ఇంకా దర్జాగానే తిరుగుతున్నాడు. సొల్లు కబుర్లు, పనికిరాని ప్రజాకర్షక నినాదాలతో ప్రజల్ని మభ్య పెట్టకుండా గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసినప్పుడే ఈ పార్టీని, మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారు.
చెత్తంతా ఒక చోట పోగైతే అది కుళ్ళి కంపు కొడుతుంది, ఆఖరుకు మట్టిలో కలిసిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో చెత్త పోగేసుకుంటున్న బిజెపి పరిస్థితి కూడా భవిష్యత్తులో అదే విధంగా తయారవుతుందేమో మోడీ ఆలోచించాలి, లేదంటే ఆ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో అదే గతి తప్పదు.