గతంలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో "వెంకయ్యనాయుడు" తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన సంతానానికి అడ్డగోలుగా వ్యాపార లబ్ది చేకుర్చాడనే విషయం అందరికి తెలిసిందే! వ్యాపార రంగంలో ఆయనకు ఎందరో బినామీలున్నారనే విషయం బహిరంగ సత్యమే! ఈ బినామీల్లో ఒకరిద్దరు ఇప్పుడు బిజెపిలో MLA, MP గా ఉన్నారని, ఈయనకు బినామీ పేర్లపై ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని బిజెపి వర్గాలవారే అంటుంటారు.
మరల ఇప్పుడు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వెంకయ్యనాయుడు హవా మొదలైంది.. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. ఆయన పైరవీతో కాంట్రాక్టులు, పదవులు కొట్టేస్తున్నారు. ఆయన "స్వర్ణ భారతి" ట్రస్ట్ నిజంగానే బంగారం పులుముకుంటుంది.. పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలోనే ఈ ట్రస్టుకు వచ్చిన విరాళాలు 50 కోట్లు దాటాయి.. అంతకు రెండు, మూడు రెట్లకు పైగా "Quid pro quo" ఆదాయం ఉంటుందని అంచనా!
సంపాదనలో వై.యస్.ఆర్ తనయుడు జగన్ ను ఆదర్శంగా తీసుకున్న వెంకయ్యనాయుడు ఆయన చూపిన బాటలోనే నడుస్తూ ఇదే రకంగా కలక్షన్ల పర్వం కొనసాగిస్తే ఈ నాలుగైదేళ్లలో ఆస్థుల విషయంలో "జగన్" ను దాటేసీ అవకాశం ఉంది.
కొసమెరుపు: ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు "ముఖ్యమంత్రి" కావాలనే కోరిక వెంకయ్యనాయుడుకు ఎప్పటినుండో ఉందట.. అందుకు అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడట. "Let us wait and see"