ఆంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధుల మాటలకు విలువివ్వకుండా, ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్ళు, ఆదాయ వనరుల విషయంలో లెక్కలు తేల్చకుండా ఏకపక్ష నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ ను ముక్కలు చేసి, ఆంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు గుండు కొట్టించారు.
తన సీటు కూడా గెలవలేని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 'మేఘమదనం రఘువీరా రెడ్డి' ఉత్తర కుమార ప్రఘల్బాలు పలకటంలో దిట్ట. ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీకొట్టి, చితక్కొట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాని, రఘువీరా రెడ్డికి కానీ బుద్ధి రాలేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కాకముందే పనికిమాలిన ఆరోపణలు చేస్తూ, తెలుగుదేశం పార్టీపై ప్రజలకు అసంతృప్తి కలిగి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బతుకుతున్నారు. ప్రజలు వీళ్ళ పార్టీని పాతాళంలోకి తోక్కివేశారు, ఆ పార్టీ మళ్లీ బ్రతికి బట్టకట్టాలంటే కనీసం పది సంవత్సరాలు పడుతుంది. ఈ విషయం గ్రహించి నీచ రాజకీయాలను పక్కనపెట్టి నిజమైన సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, అధికార పక్షానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తుంటే ప్రజలు ఆ పార్టీని కొంతైనా గౌరవిస్తారు.
ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యుడు మరణించి వారి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికల్లో పోటి చేస్తే వారిపై పోటికి నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించటం సంప్రదాయం. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ సంప్రదాయాన్ని పాటించినా కాని, కాంగ్రెస్ పార్టీ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీచేసిన 'ఆళ్లగడ్డ' ఉప ఎన్నికల్లో పోటి చేయకుండా తెలుగుదేశం పార్టీ పోటీచేసిన 'నందిగామ', 'తిరుపతి' నియోజవర్గాల్లో పోటీచేసి ద్వంద నీతి ప్రదర్శించి తన కుటిలత్వాన్ని చాటుకుంది.
నందిగామలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి ఓట్లు వేయటంతో డిపాజిట్ దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, 'వాపును బలంగా' భావించుకుని 'శవంపై చిల్లర ఏరుకొనే చందంగా' తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటిచేసింది. ఈ ఎన్నికల్లో తమదే విజయం అని రఘువీరారెడ్డి 'ఉత్తర కుమార ప్రఘల్బాలు' పలికాడు.
గతంలో ముక్కోణపు పోటిలో చతికిలపడిన వెధవలు ఈసారి ముఖాముఖి పోటిలో కూడా ఏమాత్రం ఉనికిని ప్రదర్శించలేక పోయారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటి చేయకపోతే కనీస గౌరవం దక్కేది, ఈ సారి తన తప్పుడు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు 'రఘువీరా రెడ్డే' బొంద పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చల్లగా ఉండాలంటే 'రఘువీరా రెడ్డే' ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండాలి.