1994 లో శాసనసభకు పోటీచేసి ఓడిపోయినా, ఈవిడకు పెద్దల మద్దతుతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి దక్కింది, కొంతకాలం ఈ పదవిలో ఉన్న ఈవిడ ఆ సమయంలో తెలుగుదేశాన్ని, ఎన్టీఆర్ ను , ఆ తరువాత చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించేది. కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి తగ్గటం, మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా ఊడిపోవటంతో, కనీసం కార్యకర్త కూడా లెక్కచేయని పరిస్థితుల్లో మరల తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది.
2009 లో అసెంబ్లీ సీటు కూడా దక్కించుకోలేక పోయిన రాజకుమారి ఆత్మహత్య చేసుకుంటానని బహిరంగంగా బెదిరించి, ఏడ్చి తెలుగుదేశం పార్టీ MLC సీటు తెచ్చుకుంది, అంతే కాకుండా కౌన్సిల్లో చీఫ్ విప్ పదవి కూడా కొట్టేసింది.
2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తాడని బలంగా భావించిన రాజకుమారి YSR కాంగ్రెస్ పార్టీలో కర్చీఫ్ వేసుకుని తన కూతురు సుధ ను ( w/o లతీష్ రెడ్డి) YSRCP అభ్యర్ధిగా వినుకొండ అసెంబ్లీ నుండి పోటి చేయించింది. ఆ ఎన్నికల్లో పొరపాటున కూడా రాజకుమారి జగన్ ను విమర్శించలేదు సరికదా! వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తన కూతురుకు అనుకూలంగా వ్యహరించటమే కాకుండా, జగన్ పార్టీకి, తన కూతురుకు తెలుగుదేశం సానుభూతి పరులనుండి నిధులు సైతం సేకరించి ఇచ్చింది. ప్రైవేటు సంభాషణల్లో జగన్ పార్టీ గెలవటం, జగన్ ముఖ్యమంత్రి ఖాయమంటూ, తన కూతురు కమ్మ, రెడ్డి కోటాలో మంత్రి ఇపోతుందని సంబరపడి పోయింది. ఈ విషయం తెలుగుదేశం అధిష్టానానికి, చంద్రబాబు నాయుడికి కూడా బాగా తెలుసు.
విధి బలీయమైంది.. రాజకుమారి కూతురు ఘోరంగా ఓడిపోయింది, జగన్ ను జనం ఛీ కొట్టారు. హా! హతవిధీ!! అంటూ వగచిన నన్నపనేని రాజకుమారి రాబోయే MLC ఎన్నికల్లో సీటు కోసం మళ్లీ చంద్రబాబు నాయుడు భజన మొదలు పెట్టింది. ఈ మధ్య ఈవిడగారు ప్రైవేటు పంచాయితీలు చేస్తూ, భూ దందాల్లో కూడా తలదూరుస్తూ బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి, దాడి వీరభద్ర రావు లాంటి నమ్మక ద్రోహులను నమ్మి వారికి వరుసగా మూడు, నాలుగు సార్లు పదవులను కట్టబెట్టి దారుణంగా మోసపోయిన చంద్రబాబు నాయుడు ఇకనైనా కళ్ళు తెరచి నన్నపనేని రాజకుమారి లాంటి ద్విపాత్రాభినయం చేసే రాజకీయ నటీ మణులను, నంగనాచిలను, దూరంగా ఉంచితే పార్టీకి, ఆయనకు మంచిది. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి, పార్టీనే నమ్ముకుని, పార్టీలు మారకుండా గత మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ ఆస్థులు పోగొట్టుకున్న కార్యకర్తలు లేదా నాయకుల్లో ఒకరికి ఆ సీటు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు విన్నవించుకుంటున్నారు. .