పనిలో పనిగా ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న పవన్, రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, బిజెపి ప్రభుత్వం తన హామీలు విస్మరించటం పై రాష్ట్ర యంపిలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. తను మాత్రం ఇక్కడ రాజధాని ప్రాంతంలోని ఆ మూడు గ్రామాల రైతుల తరుపున జగన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పై పోరాడతానన్నారు
"కొత్త బిచ్చగాడు పొద్దెరగడు" అన్నట్లుగా జగన్ వ్యవహారం ఉంది. రాష్ట్ర రాజధాని హద్దులు ప్రకటించి నాలుగు నెలలైంది, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొదలు పెట్టి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు నిద్రపోయిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నిద్ర లేచి మొత్తం భూసేకరణ జరిగి రైతులు భూములిచ్చిన తరువాత ఇప్పుడు కొత్తగా జగన్ పాటకు వంత పాడుతున్నదంటే ఏదో అనుమానించవలసిన విషయమే ఉందనిపిస్తుంది.
రాజధానికి కోసం, రాజధానిలో రైతులకు భాగస్వామ్యం కలిగించి, వారికి లబ్ధి చేకూరే విధంగా 33,000 ఎకరాలు రైతులనుండి స్వచ్చందంగా సేకరించిన చంద్రబాబు నాయుడుని విమర్శించే అర్హత అసలు పవన్ కళ్యాణ్ కు ఉందా?
గతంలో వీళ్ళ అన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకు కోసం కోట్ల ఖరీదు చేసే ఎకరాల స్థలం ఇదే చంద్రబాబు నాయుడు నుండి హైదరాబాద్ నగరం నడిబొడ్డు 'జూబిలీ హిల్స్' లో అప్పనంగా దొబ్బేసినప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదా? బ్లడ్ బ్యాంకు కు సిటి నడిబోడ్డులో ఎకరాల స్థలం ఎందుకు? ముందు ఆ బ్లడ్ బ్యాంకు స్థలం మొత్తం ప్రభుత్వానికి తిరిగిచ్చి నగరం శివార్లలో ఒక పది సెంట్ల స్థలం తీసుకుంటే సరిపోతుంది కదా!
VANPIC పేరుతొ 47,000 ఎకరాల బంగారం పండే తీర ప్రాంత భూములు తన అన్న చిరంజీవి గారి వ్యాపార భాగస్వామి 'నిమ్మగడ్డ ప్రసాద్ ' కు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అప్పనంగా దోచి పెట్టినప్పుడో, తన పుత్ర రత్నం జగన్ 'భారతి సిమెంట్ కు', సరస్వతి పవర్ కు, వేల ఎకరాలు రైతులనుండి కారు చౌకగా కేవలం లక్ష, రెండు లక్షల్లోపే ఇచ్చి అప్పనంగా దొబ్బెసినప్పుడు నువ్వు కుంభకర్ణుడి నిద్ర పోతున్నావా?
మోజు తీరిపోయిన తరువాత భార్యలని చొక్కా మార్చినంత తేలిగ్గా మార్చేసే నువ్వు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తావో, ఏ స్టేట్మెంట్ ఇస్తావో నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ దేవుడిక్కూడా అర్ధం కాదు. గతంలో నీ అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పడు ఎన్నికల సభల్లో ఎన్నో వాగ్దానాలు చేసావు, సామాజిక న్యాయం అంటూ సొల్లు కబుర్లెన్నో చెప్పావు, నీ అన్న పార్టీ ఎన్నికల్లో బొక్క బోర్ల పడి, హోల్ సేల్ గా బేరం పెట్టి కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకుని కేంద్రం లో మంత్రి పదవి దొబ్బేసినప్పుడు నువ్వు ఏమి పీకుతూ కూర్చున్నావు?
పొట్లూరి వెంకట ప్రసాద్ తన యంపి సీట్లు కోసం నీకు 100 కోట్లు ఖర్చుపెట్టి 'జనసేన' పార్టీని పెట్టించినప్పుడు మొదటి సారి నువ్వు అమ్ముడు పోయావు. మళ్లీ ఇప్పుడు నీకు మంచి బేరం తగిలిందని అందుకే జగన్ చూపిన బాటలో నడుస్తున్నావని, జగన్ పలికిన పలుకులనే వల్లె వేస్తున్నవని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. భాజపా కు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మిత్రులను దగ్గరకు చేర్చే చర్యల్లో భాగం గానే జగన్ కు అనుకూలంగా, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ, వెంకయ్య గేమ్ ప్లాన్లో భాగంగా నీ చర్యలున్నాయని అనుమానించవలసి వస్తుంది. రాజకీయాలంటే మీ కుటుంబం దృష్టిలో వ్యాపారమా?
నీలో నిజంగా స్వార్ధం, కపటం లేనిదే జగన్ అక్రమ ఆస్థులపై, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ముందుగా నీ పోరాటం ప్రారంభించు. లేకుంటే ప్రజలు నిన్ను నమ్మరు, క్షమించరు.