వికారుద్దిన్, మద్దెల చెర్వు సూరి, గంగిరెడ్డి లాంటి కరడుకట్టిన నేరస్థులు నేరం చేసి జైల్లో ఉంటె వీళ్ళు, వీళ్ళ అనుచరులు వారిని జైళ్ళల్లో పరామర్శించి వస్తారు, వారి అరెస్ట్ అక్రమమంటూ గోల పెడతారు, పోలీస్ రక్షణ లేనిదే ఇటువంటి నాయకులు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళలేరు, నిజంగా వీళ్ళు మంచివాళ్ళు, ప్రజా సేవకులు ఐతే అందరిలాగే రక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్ళవచ్చు కదా! కాని అలా వెళ్ళలేరు, ఎందుకంటె వీళ్ళ బాధితులే వీళ్ళను హతమార్చవచ్చు, విశేషమేమిటంటే పోలీసులనుండి రక్షణ పొంది తమ ప్రాణాలను కాపాడుకొనే వీళ్ళు అదే పోలీస్ వ్యవస్థను, పోలీసులను విమర్శిస్తారు, నేరస్తులకు కొమ్ముకాసే విధంగా వ్యాఖ్యలు చెస్తారు. టెర్రరిస్టుల చేతిలోనో, నక్సలైట్ల చేతిలోనో, కిరాయి ముఠాల చేతిలోనో పోలీసులు చనిపోయినప్పుడు వీళ్ళకు కనీసం చీమ కుట్టినట్లైనా ఉండదు.
ఈ దేశం లో చట్టం, న్యాయం చాలా సందర్బాలలో నేరస్తుల పట్ల ఉదాసీనంగా, విశాలంగా వ్యహరించటం వల్లే పార్లమెంట్లో కాల్పుల నిందితులు, ముంబై కాల్పుల నిందితులు, అక్షరధాం పేలుళ్ళ నిందితులు, హైదరాబాద్ పేలుళ్ళ నిందితులపై విచారణ ఏళ్ళ తరబడి కొనసాగింది, కొందరు తప్పించుకున్నారు, కొందరికి నామ మాత్రపు శిక్ష పడింది, కొందరికి శిక్ష పడినా వివిధ కారణాల వలన ఇప్పటికి అమలుకు నోచుకోలేదు.
కరడు గట్టిన నేరస్తులు నేరం చేసి జైలు కెళ్ళి బెయిలుపై బయటకు వచ్చి మళ్లీ నేరాలు చేస్తారు, వీరికి చట్టాలన్నా, శిక్షలన్నా భయం లేదు, ఇంకొందరు జగన్ లాంటి వ్యక్తులు జైల్లోంచే తమ అనుచరులకు ఆజ్ఞలు జారి చేసి నేరాలు చేయిస్తారు. మద్దెలచెరువు సూరి, మొద్దు శీను, భాను, మంగలి కృష్ణ వంటి కరడు గట్టిన హంతకులకు, స్మగ్లర్ గంగిరెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి నేరస్థులకు గురువు, పెద్ద దిక్కు జగన్ అనే విషయం అందరికి తెలిసిందే!
కిరాయి హంతకులపై, కిరాయి హంతక కూలీలపై ఈగ వాలినా వీళ్ళు సహించ లేరు, పోలీసులు వారి అరెస్ట్ చేసినా, ఆత్మ రక్షణార్ధం వారిపై కాల్పులు జరిపినా వీళ్ళు తట్టుకోలేరు. పోలిసులదైనా, సామాన్య మానవులదైనా, హంతకులదైనా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే! ప్రజల, పోలిసుల ప్రాణం తీసే వాళ్ల ప్రాణం తీసే హక్కు పొలిసు వ్యవస్థకున్నప్పుదె నేరాలు తగ్గుతాయి, నేరస్థుల సంఖ్య తగ్గుతుంది. నేరస్థుల కంటే ముందుగా వారికి కొమ్ము కాసి, వారి నేరాలకు మద్దతు పలికే వారిని (పౌర హక్కుల సంఘం నాయకులు గా చెప్పుకునే వారిని) సమాజం నుండి నిర్మూలిస్తే కాని ఈ దేశంలో ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణ దొరుకుతుంది.
పోలీసులు ముందుగా ఎన్ కౌంటర్ చేయాల్సింది నేర సామ్రాజ్యానికి, నేరస్థులకు కొమ్ము కాసే వారిని, వారికి మద్దతిచ్చే వారిని. అందుకు తగ్గట్టుగా మన చట్టాలను సవరించాలి, న్యాయ వ్యవస్థ కూడా చొరవ చూపాలి.