గతంలో సోనియా గాంధీకి, జగన్ కు మధ్య కిరణ్ కుమార్ రెడ్డి మధ్యవర్తిత్వం తో కుదిరిన ఒప్పందం ప్రకారం జగన్ అక్రమార్జన కేసులో క్రియాశీలకంగా వ్యహరిస్తూ నిజానిజాలను నిర్భయంగా వెలికితీస్తూ నేరస్థుల పాలిట సింహస్వప్నంగా మారిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ను అకస్మాత్తుగా ఆ పదవి నుండి తప్పించి కొంత కాలం పోస్టింగ్ ఇవ్వకుండా వేధించి ఆ తరువాత ఒక అప్రధాన శాఖకు బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు.
గత యుపియే ప్రభుత్వం నిజాయితీ కలిగిన అధికారుల విషయంలో ఇటువంటి తప్పిదాలెన్నో చేసింది. తాము అధికారంలోకి వస్తే జగన్ అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించి అతని వేల కోట్ల అక్రమాస్తులను జప్తు చేసి, జైలుకు పంపిస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన కెసిఆర్, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ ఆతరువాత మిన్నకుండి పోవటం వెనుక కారణాలేమిటో, వారి మౌనం వెనుక మర్మమేమిటో తెలుగు ప్రజలకు అర్ధం కావటం లేదు. 16 కేసుల్లో A1 ముద్దాయి జగన్ అతని మిత్రబృందం నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తూ రాజాల్లాగా దర్జాగా తిరుగుతున్నారు. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నా కానీ, వీరి కేసుల విచారణ పూర్తయ్యి శిక్షలు పడాలంటే ఇంకెన్ని దశాబ్దాలు పడుతుంది.?
ఇప్పటికైనా సమర్ధుడైన పోలీస్ అధికారి లక్ష్మి నారాయణకు మరల ఆ భాద్యత తిరిగి అప్పగించి 'జగన్' అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేస్తేనే వీరిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేని పక్షంలో దొంగలు , దొంగలు ఊళ్లు పంచుకున్నారని అనుకోవలసి వస్తుంది. వేల కోట్ల ప్రజా ధనంతో ముడిపడి ఉన్న జగన్ అక్రమాస్తుల వ్యహారంలో జగన్, అతని డర్టీ గ్యాంగ్ విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, గాలి జనార్ధన రెడ్డి మొదలైన వారిని త్వరిత గతిన విచారించి, శిక్షలు విధించాలంటే లక్ష్మినారాయణ వంటి నిజాయితీపరుడు తిరిగి ఆ కేసుల విచారణాధికారి పగ్గాలు చేపట్టాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు... ఎదురు చూస్తున్నారు.