తనకు తాను గొప్ప మేధావిగా, సంస్కర్తగా చెప్పుకునే లోక్ సత్తా 'జయప్రకాశ్ నారాయణ్' ఈ మధ్య వార్తల్లో పూర్తిగా కనుమరుగైపోయాడు, ప్రజలు కూడా ఆయన్ను మరచిపోయే పరిస్థితి వచ్చింది. పోయిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా లోక్ సత్తా అభ్యర్ధులు డిపాజిట్ దక్కించుకొలెకపొయారు. ప్రజలు జెపిని, అతని పార్టీని ఛీ కొట్టినా అతనికి ఇంకా సిగ్గు రాలేదు.
రాజశేఖర రెడ్డి టైములో బాగా కుమ్మేసిన జెపికి ప్రస్తుతం సరైన బేరాలు లేని సమయంలో 'జగన్' తో మంచి డీల్ కుదిరిందంటున్నారు.. అందుకే ఈ మధ్య మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమై చంద్రబాబు నాయుడు పై, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పై, ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' నిర్మాణం పై... 'జగన్' రాసిన స్క్రిప్ట్ చదివి, జగన్ సూచించిన పద్ధతిలో అర్ధం పర్ధం లేని, చవుకబారు విమర్శలు చేస్తున్నాడు. రాజధాని నిర్మాణంపై ఆయన చేస్తున్న విమర్శలు చూస్తే వీడెంత పనికిమాలిన మేదావో.. చదువు రాని నాలాంటి సామాన్యుడికి కూడా సులువుగా అర్ధమైపోతుంది. రాజధాని నిర్మాణం పేరుతో 'అమరావతిని' మరో హైదరాబాద్ చేస్తారా అంటూ విరుచుకు పడ్డాడు... ఏం! హైదరాబాద్ వంటి గొప్ప రాజధాని నగరం ఆంధ్ర ప్రదేశ్ కు అవసరం లేదని వీడి భావనా!! హైదరాబాద్ తలదన్నే విధంగా 'అమరావతి' నిర్మాణం జరుగుతున్నందుకు వీడికి ఎందుకంత కడుపు మంట! ఆంధ్రులంటే ఎందుకంత చులకన? హైదరాబాద్ లో, బెంగుళూరులో ఆస్థులు ఏర్పాటు చేసుకున్న ఈ కృష్ణా జిల్లా అపర మేధావికి విజయవాడ ప్రాంతంలో ఆస్థులు లేనంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? 'తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే' ఇలాంటి వెధవలను ఏ పేరుతొ పిలవాలి. అధికార కేంద్రీకరణ అంతా ఒకే ప్రాంతంలో జరిగితే అసమానతలు తలెత్తి ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని శలవిచ్చారు ఈ అపర మేధావి.. పచ్చటి సీమాంధ్ర లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టటం వీడి లక్ష్యమా? ఎక్కడైనా సరే అధికార కేంద్రీకరణ జరిగినప్పుడే పరిపాలన సులభతరం అవుతుంది, ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అసెంబ్లీ అమరావతిలో, సేక్రటేరియేట్ ఇడుపులపాయలో, మంత్రుల కార్యాలయాలు శ్రీకాకుళంలో, మంత్రుల, ఎమ్మెల్యేల నివాసాలు కర్నూలులో, అధికారుల నివాసాలు రాజమండ్రిలో, హై కోర్ట్ అనంతపురంలో ఉండాలని ఈ అపర మేధావి అభిప్రాయమా? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక వికేంద్రీకరణ వీడి కంటికి కనిపించటం లేదా! విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా రూపు దిద్దుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట, సత్యవీడు.. అనంతపురం జిల్లా హిందూపురం లో వేల కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వేల కోట్ల విలువైన పరిశ్రమలు వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరంలో భారీ పరిశ్రమలు, విశాఖపట్నంలో ఐటి సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రాజమండ్రి, కాకినాడలో చమురు, వ్యసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన ఐ ఐ టి, ఐ ఐ యమ్, యన్ ఐ టి, యన్ ఐ డి, పెట్రో యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం వీడి దృష్టికి రాలేదా! అభివృద్ధి నిరోధకులతో చేతులు కలిపిన జెపి ప్యాకేజీలకు అమ్ముడు పోయి కేవలం అసూయ, అసహనంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాడు. హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై కపట ప్రేమ కురిపించే ఈ అపర దృతరాష్ట్రుడు జయప్రకాశ్ నారాయణ్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆంధ్ర ప్రభుత్వం పై, చంద్రబాబు నాయుడు పై చవుకబారు విమర్శలు మానుకోకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే తగిన గుణపాటం చెప్పటం ఖాయం! నోట్: మేధావిలా చెప్పుకునే జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడే భాష అంత సంస్కార హీనంగా ఉంటే.. నాబోటి సామాన్యుడి భాష ఇంతకంటే సొంపుగా ఎలా ఉంటుంది! దసరా పండుగకు రిలీజ్ కావలసిన 'అఖిల్ అక్కినేని నటించిన మొదటి చిత్రం 'అఖిల్' విడుదల వాయిదా పడింది. దానికి నాగార్జున్, నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు వినాయక్ చెబుతున్న కారణాలు ఏవైనప్పటికీ తెలుగు చలన చిత్రవర్గాల్లో కొంతమంది ఒక విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చారు. ఈ సంవత్సరంలో యేవో కొన్ని అవాంతరాలతో విడుదల తేదిని వాయిదా వేసుకున్న చిత్రాలు సన్నాఫ్ సత్యమూర్తి, 'బాహుబలి', 'శ్రీమంతుడు', భలే భలే మగాడివోయ్', 'రుద్రమదేవి' మొదలైన పెద్ద చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించాయి. అనుకున్న తేదీకే విడుదలైన రామ్ చరణ్ చిత్రం 'బ్రూస్ లీ' తో పాటు ఇంతకూ ముందు విడుదలైన చిత్రాలకు కూడా ఒక మాదిరి టాక్ వచ్చింది.
తెలుగు సిని రంగం సెంటిమెంటు లకు పెట్టింది పేరు... కొంతమంది సన్నిహితులు.. హితులు చేసిన సూచనల ప్రకారం 'అఖిల్ ' సినిమా విడుదల తెదీ వాయిదా వేస్తే మంచి హిట్ అవుతుందన్న సలహాతోనే నిర్మాత, హీరో తండ్రి, దర్శకుడు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అసలు కారణం ఏదైనా.. సెంటిమెంటు కన్నా సినిమాలో సత్తా ఉంటె తప్పకుండా హిట్ అవుతుందని ప్రేక్షకులు గతంలో ఎన్నో సార్లు నిరూపించారు. త్వరలోనే విడుదల కానున్న 'అఖిల్ అక్కినేని' తోలి చిత్రం 'అఖిల్' గొప్ప హిట్ కావాలని ఆశిద్దాం. ఎవడి చూపు సోకితే పచ్చటి చెట్లు మోడువారి పోతాయో, ఎవడిని చూస్తే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయో, ఎవడి మాట వింటే ఏడ్చే పిల్లలు కూడా చటుక్కున ఏడుపు మానివేస్తారో వాడే జగన్! కొంతమంది ఏడుపుగొట్టు, కుళ్లు మోతు వెధవలు ఎదుటివాడు,పచ్చగా ఉన్నా, బాగుపడి పోయినా, మంచి పేరు తెచ్చుకున్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. వీళ్ళు మంచి మాట్లాడలేరు, మంచి వినలేరు, మంచి చూడలేరు.. ఇటువంటి కోవలోకి మొదటగా వచ్చే వ్యక్తి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగు వాడు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న 'ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి' శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమానికి ఒక భాద్యతగల ప్రతిపక్ష నాయకుడిగానే కాక, ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా కూడా హాజరు కాలేనని చెప్పటం, తనకు ఆహ్వానం కూడా పంపవద్దని చెప్పటం వెనుక తనకు అంత అర్హతలేదని భావించాడని ఆంద్ర ప్రజలు అనుకోవచ్చా!
ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుండి కూడా మహా మహులు అతిధులుగా విచ్చేస్తున్నారు, కొత్తగా ఏర్పడ బోతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించబోతుంది. ఇటువంటి అద్భుత కార్యక్రమానికి విచ్చేసినందుకు అతిధులకు గౌరవం లభిస్తుందే తప్ప వారివలన అమరావతికి గౌరవం రాదు. ఎంతో మంది విశిష్ట అతిదిలు విచ్చేస్తున్న ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి 42 కేసుల్లో A1 ముద్దాయి, ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే పేరొందిన ఆర్ధిక నేరస్థుడు జగన్ కూడా అతిధిగా హాజరైతే ఆ వేదిక గౌరవం తగ్గటమే కాకుండా, జగన్ లాంటి 420 గాళ్ళతో వేదిక పంచుకున్నందుకు అతిధులు కూడా చిన్నబుచ్చుకోవచ్చు. కారణం ఏదైనా జగన్ లాంటి దిష్టి పిడత గాళ్ళ నీచ దృష్టి 'అమరావతి' పై పడనందుకు మనం సంతోషించాలి. జగన్ తో పాటు మరి కొంత మంది దిష్టి పిడతగాళ్ళు రఘువీరారెడ్డి, రాఘవులు, జయప్రకాశ్ నారాయణ్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉంటే వాళ్ళు నిజంగా 'అమరావతికి' ఎంతో మేలుచేసిన వారౌతారు. ప్రతి రోజు సిగ్గు ఎగ్గు లేని తెలంగాణా ముఖ్యమంత్రి, మంత్రులు, తెరాస నాయకులు చేసే పనికిరాని వాదన ఈ విధంగా ఉంది.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాలో వర్షాలు కురవక పోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాలో నదుల్లో, కాలవల్లో చుక్క నీరు లేకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పరిశ్రమలు మూతబడటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాలో నిరుద్యోగుల సంఖ్య పెరగటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాలో జరిగిన ఎన్ కౌంటర్ కు కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాకు ప్రపంచ బ్యాంకు రేటింగ్ రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాకు పరిశ్రమలు రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణాకు చైనా, అమెరికా నుండి పెట్టుబడులు రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రతి సమస్యకు కారణం: చంద్రబాబు నాయుడు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు హైదరాబాదులో మెట్రో రైల్ పనులు ఆలస్యం కావటానికి కారణం: చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మురికి నగరంగా మారటానికి కారణం: చంద్రబాబు నాయుడు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు జరపలేకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కెసిఆర్, తెరాస నాయకులు.. ప్రజలు ఇంకా వీళ్ళు చెప్పేవన్నీ నమ్ముతున్నారని, నమ్మేస్తారని పిచ్చి భ్రమల్లో బ్రతికేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 17 నెలలు దాటింది. ప్రజలను బంగారు తెలంగాణా భ్రమల్లో ఉంచి కెసిఆర్ కుటుంబం తెలంగాణా సంపదను దోచేస్తూ, తన అస్మదీయులకు కూడా దోచిపెడుతూ ఈ రాష్ట్రాన్ని స్మశాన తెలంగాణాగా మార్చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో తెరాస నాయకులు 'తెలంగాణా రాబందుల సమితి''లా అందినకాడికి మేసేస్తున్నారు. పక్వానికి వచ్చినప్పుడే పండు పగులుతుంది, సమయం వచ్చినప్పుడే కెసిఆర్ బండారం బయటపడి తెలంగాణా ప్రజలు తగిన తీర్పు చెబుతారు. ఒక్కటి మాత్రం నిజం.. "దుబాయ్ శేఖర్" అనబడే కెసిఆర్ ను గల్లీ లీడర్ స్థాయినుండి పెంచి పెద్ద చేసి మంత్రిని చేసి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి తుగ్లక్ ముఖ్యమంత్రి స్థాయికి చేర్చిన పాపం మాత్రం చంద్రబాబు నాయుడిదే... తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి. రైతుల రుణ మాఫీ పై సరైన సమాధానం చెప్పలేక ప్రతిపక్షాలను సభ నుండి బహిష్కరించి కెసిఆర్ భజనతో తెరాస మంత్రులు, శాసనసభ్యులు పునీతులౌతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో "ఓటుకు నోటు" విషయాన్ని నానా యాగీ చేసిన తెరాస ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంపై శాసనసభలో చర్చించి అందులో ప్రమేయం ఉన్న తెదేపా శాసనసభ్యుడు "రేవంత్ రెడ్డి", "సంద్ర వెంకట వీరయ్య, చంద్రబాబు నాయుడు పై చర్యలకు తీర్మానం చేస్తామని అంతేకాకుండా "రేవంత్ రెడ్డి" ని అసెంబ్లీ లోకి కూడా అడుగు పెట్టనీయమని, అతని శాసనసభ్యత్వం రద్దుకు సిఫార్సు చేస్తామని ఉత్తర కుమార ప్రఘల్బాలెన్నో పలికారు.
తెరాస మంత్రుల, నాయకుల దూకుడు చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీ, వేడిగా ఉండి ఎన్నో సంచలనాలు జరుగబోతున్నాయి అని అందరూ ఊహించారు. కానీ కెసిఆర్ బృందం ఈ విషయంపై అనూహ్యంగా తోక ముడిచారు, రేవంత్ రెడ్డి వెంట్రుక పీకే సాహసం కూడా చేయలేక పోయారు. దీనికి తెర వెనుక కారణాలు సవా లక్ష ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రేవంత్ రెడ్డి పై చర్యకు సిఫార్సు చేసి ఒకవేళ అతను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నారాయణఖేడ్ ఉపఎన్నికతో పాటు కోడంగల్ ఉపఎన్నిక కూడా అనివార్యం అయిన పక్షంలో అక్కడ తెరాస విజయావకాశాలు ఎలా ఉండవచ్చో సర్వే చేయించిన కెసిఆర్ కు దిమ్మతిరిగే రిపోర్ట్ వచ్చిందట. గతంలో వచ్చిన మెజారిటీ కంటే రెండింతలు మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలుస్తాడని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయట. రేవంత్ పై చర్యలకు ఉపక్రమిస్తే కొరివితో తల గోక్కున్నట్లే అని భావించిన తెరాస ప్రభుత్వం ఈ విషయంలో తోక ముడిచి గమ్మున ఉండిపోయిందట. రెండో కారణం... ఇప్పటికే "ఫోన్ టాపింగ్" వ్యహారంలో పీకల్లోతు ఇరుకున్న తెరాస ప్రభుత్వం రేవంత్ విషయంలో అతిగా ప్రవర్తించి విషయం పెద్దది చేసుకుంటే చివరకు ఆ వ్యహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమకే చుట్టుకుంటుందనే భయంతో ఆ వ్యహారాన్ని అంతటితో ముగించిందని అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో గెలిచింది తెదేపా, రేవంత్ రెడ్డి.. ఓడింది మాత్రం తెరాస ప్రభుత్వం, కెసిఆర్. జఫ్ఫా జగన్ ఈమధ్య రామోజీరావు తో, హరీష్ రావుతో, గవర్నర్ నరసింహన్ తో భేటి అయ్యాడని, త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కూడా భేటి కాబోతున్నదని ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. జగన్ ఎవ్వరితో భేటి అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గాని, తెలుగు దేశం పార్టీకి కాని వచ్చే నష్టం ఏమీ లేదు.
రామోజీరావు అపర చాణుక్యుడు, జగన్ మాటలకో, పొగడ్తలకో పడిపోయే రకం కాదు... కీలెరిగి వాత పెట్టటంలో ఆయన దిట్ట. ఇక జగన్ హరీష్ రావుతో భేటి అయినా, కేటిఆర్ తో భేటి అయినా వీళ్లేమీ చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో కుట్రపన్ని చంద్రబాబు నాయుడును ఇరికించి రేపో మాపో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంటూ విపరీతమైన ప్రచారం చేసి, ఫోన్ టాపింగ్ వ్యహారంలో తెలంగాణా ప్రభుత్వం చిక్కుకుని అసలుకే మోసం రావటంతో చివరకు మూసుకుని మూల కూర్చున్న ఈ ముండమోపి వెధవలు కలిస్తే రాలేది బూడిదే ..... ఇక ద్రుతరాష్ట్ర గవర్నర్ మొదటి నుండి చంద్రబాబు నాయుడుకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యహరిస్తున్నాడు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగినపుడు కాని మరే ఇతర సందర్భంలో కాని అతని ప్రవర్తన తెలంగాణాకు అనుకూలంగానే ఉంది. చంద్రబాబు నాయుడు, ఆంధ్ర మంత్రుల ఫోన్ టాపింగ్ జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి అబద్ధపు నివేదిక ఇచ్చిన ఘనుడు. చివరకు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని తన గవర్నర్ పదవిని మరికొంత కాలం కాపాడుకోగలిగాడు. "రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు" జగన్... గవర్నర్ నరసింహన్ కలిస్తే చెయ్యగలిగింది చెక్క భజనే! పవన్ కళ్యాణ్ ను వైసిపి వాళ్ళు ముద్దుగా "పావలా కళ్యాణ్" అని పిలుచుకుంటారు... ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుతో మంచి సంభందాలే ఉన్నాయి. జగన్.. పవన్ భేటి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ భేటి అయినా పవన్ కళ్యాణ్ లాంటి తిక్కోడు జగన్ బాటలోకి వెళ్ళే పరిస్థితి ఎంతమాత్రం లేదు. రాజధాని నిర్మాణం ఊపందుకోవటం, ప్రపంచ బ్యాంకు రేటింగ్, దేశ, విదేశ పారిశ్రామిక వర్గాల్లో ఆంధ్ర ప్రదేశ్ కు, చంద్రబాబుకు పెరుగుతున్న పరపతి, ఆంధ్ర కు వరుసబెట్టి వస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్న అనుకూలతలతో దిక్కుతోచని జగన్ ఈ విధంగా ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం చందంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకులతో పాటు కొందరు చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషులను కలవటం వెనుక ఏదో జరుగుతుంది... ఇంకేదో జరగబోతుంది అనే చౌకబారు ప్రచారం కోసం తప్ప మరేమీ కాదని తెలుగుదేశం పార్టీ వర్గాలు.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భోగాపురం (వైజాగ్) విమానాశ్రయానికి అన్ని ఎకరాల స్థలం ఎందుకు! దిల్లి, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలు అంతకంటే తక్కువ స్థలం లోనే ఏర్పాటయ్యాయి అంటూ తప్పుడు ప్రచారంతో రైతులను రెచ్చగొడుతున్న జఫ్ఫా జగన్ ను చూస్తే "తన ముడ్డి కింద నలుపు తాను చూసుకోలేని గురివింద గింజ" సామెత గుర్తుకు వస్తుంది. జగన్ కు లోటస్ పాండ్ లో 32 ఎకరాల స్థలంలో 42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 75 గదుల రాజ సౌధం లాంటి భవనం ఎందుకు? వీడి కుటుంబానికి 500 గజాల స్థలంలో 4 పడక గదుల ఇల్లు సరిపోతుంది కదా? వీడి మొహానికి బెంగుళూరులో 22 ఎకరాల్లో 60 గదుల విలాసవంతమైన భవంతి ఎందుకు? వీడి గెస్ట్ హౌస్ కు రెండొందల గజాల స్థలంలో రెండు పడక గదుల ఇల్లు సరిపోతుంది కదా! 2004 సంవత్సరానికి ముందు హైదరాబాద్, బెంగుళూరులో లో కనీసం సొంత ఇల్లు కూడా లేని వీడికి ఎకరాల కొద్ది స్థలంలో టాటా, బిర్లాలు, ఆగర్భ శ్రీమంతులు, జమీందారుల నివాసాలను తలదన్నే భవంతులు ఎలా వచ్చాయి? పులివెందులలో ఆరు గదుల ఇంటిలో ఉండే వీడికి మరి అన్నేసి ఎకరాల్లో రాజ భవనాలను తలదన్నే భవంతులు కావాలి కానీ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ అధ్వర్యంలో నిర్మితమౌతున్న విమానాశ్రయానికి అన్ని ఎకరాలు సమీకరిస్తే తప్పేమిటో జ్జాకొ జగన్, వాడి పార్టీ వాళ్ళు జవాబు చెప్పాలి. వీడి అబ్బ "మహామేత" రాజశేఖర రెడ్డి.. గాలి జనార్ధన రెడ్డి ఉక్కు కర్మాగారానికి, ప్రైవేటు విమానాశ్రయానికి 5,666 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టిన విషయం వీడికి కాని, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు వైకాపా లో ఉన్న కేడి వెధవలకు తెలీదా?
వీడి తొక్కలో సిమెంట్ ఫ్యాక్టరీ కి వేలాది ఎకరాల స్థలం ఎందుకు, మరి మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీ లకి అన్నేసి వందల ఎకరాల స్థలాలు ఉన్నాయా! ఆ పొలాలన్నీ పాతిక వేలు, యాభైవేలు రైతుల చేతిలో పెట్టి దొబ్బేసినవేగా! గతంలో వీడి అబ్బ ప్రైవేటు వ్యక్తుల ప్రాజెక్ట్ VANPIC కోసం రైతులను బెదిరించి లక్షకో, రెండు లక్షలకో ఎకరం దొబ్బినట్లు ఈ ప్రభుత్వం చేయటం లేదు. తగినంత నష్ట పరిహారం చెల్లించి లేదా వారికి అభివృద్ధి చేసిన భూములిచ్చి తగిన న్యాయం చేయాలనుకుంటుంది. ఈ 420 వెధవ జగన్ వాలకం చూస్తుంటే వీడికి తానూ, తన కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో వేరెవరు బాగుపడటం ఇష్టం లేదనిపిస్తుంది. వీడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పెద్ద శని, నవ్యాంధ్ర రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవటమే వీడి ధ్యేయంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా, అభివృద్ధి జరిగినా వీడు సహించలేక పోతున్నాడు. నాయనా ఏడుకొండలవాడా... ఈ సైకో జగన్ ను కూడా ఒక చూపు చూడు స్వామీ! దివంగత కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ట్యాంక్బండ్పై ఆవిష్కరించారు. కాకా తెలంగాణ సాధన కోసం చివరిదాకా పరితపించారన్నారు, కాకాను పొగుడుతూ ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కు ఇంత హఠాత్తుగా కాకా పై ఇంత ప్రేమ పుట్టుకు రావటం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు.
గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలో చేరి మరల 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చి ఆ ఎన్నికల్లో తెరాస పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకటస్వామి కొడుకులు మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ సోదరులు తెలంగాణా రాష్ట్రంలో పేరొందిన పారిశ్రామికవేత్తలు, V6 వార్తా ఛానల్ ఈ సోదరులకు సంభందించినదే. తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల్లో, నిరుద్యోగుల్లో అశాంతి వంటి సంఘటనలు తక్కువ చేసి చూపిస్తూ, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా బాకాలు ఊదుతూ తెలంగాణా చానల్స్ అన్ని ప్రస్తుతం కెసిఆర్ భజన చేస్తున్నాయి, కెసిఆర్ పోకడలను వ్యతిరేకించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి చానళ్లను తెలంగాణలో బాన్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా ఉన్న V6 చానల్ ను కూడా తన వైపు తిప్పుకోగలిగితే తమకు తిరుగుండదని తలచిన కెసిఆర్ అందుకు ముహూర్తం పెట్టి "ఒక దెబ్బకు రెండు పిట్టలు" అనే చందంగా మాల సామాజిక వర్గంలో పట్టున్న కాకా కుటుంబాన్ని బుట్టలో వేసుకుని రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కులం ఓట్లతో లబ్ది పొందే కార్యక్రమంలో భాగంగానే ట్యాంక్ బండ్ పై కాకా విగ్రాహాన్ని ఏర్పాటు చేశారని తెరాస, కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ పధకం ఫలించినట్లే కనిపిస్తుంది V6 చానల్ లో గత కొన్ని నెలలుగా కెసిఆర్, తెరాస భజన కార్యక్రమాలు, వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈ పరిణామాలు తెరాస ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలకు తీవ్ర నిరాశను కలిగించాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ పెద్దలెవరు హాజరు కాలేదు. తెలంగాణా ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహానికి ట్యాంక్ బ్యాండ్ పై స్థానం కల్పించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే కాకా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటుగా, యమ్మార్పిఎస్ వర్గాల వారు, తెలంగాణా ప్రజలు, మేధావులు కూడా అంటున్నారు. ఎంతైనా కెసిఆర్... కేసీయారే! తనకు లాభం లేకుండా ఏపనీ చేయడు అంటున్నారు తెలంగాణా ప్రజలు. వార్త: తెలంగాణను ‘ఎ’ కేటగిరీ ఆర్థికశక్తిగా ఇండియన్ క్రెడిట్ ఏజెన్పీ (ఇక్రా) గుర్తించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఈ సంస్థ ‘ఎ మైనస్’ కేటగిరీలో చేర్చినట్లు సీఎంవో ఆదివారం తెలిపింది. ఈ గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే స్థోమత పెరుగుతుందని తెలిపింది. ఇక్రా నివేదిక ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది.
వాస్తవం: క్రెడిట్ రేటింగ్ పరంగా తెలంగాణా 10వ స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నాయి కానీ ఈ విషయం తెలంగాణా ప్రభుత్వం ఎక్కడా తెలియ చేయకుండా ప్రకటన విడుదల చేసింది. భారతదేశం లో క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థల్లో ఇక్రా మరియు క్రిసిల్ ముఖ్యమైనవి, ఈ సంస్థలు కేవలం స్వతంత్రంగా వ్యాహరించే ప్రైవేటు సంస్థలు మాత్రమే. వీరు ప్రైవేటు, ప్రభుత్వ వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో విడుదల చేసే రుణ పత్రాలకు రేటింగ్ ఇస్తుంటారు. ఈ రేటింగులు ఆయా సంస్థల యొక్క ఆర్ధిక పరిస్థితి, రుణాల తిరిగి చెల్లింపు మొదలైన వాటిలో సంస్థకున్న పరపతిని తెలియచేస్తాయి. ఈ రేటింగులు పెట్టుబడుబడి దారులనుండి, ప్రజలనుండి, బ్యాంకుల నుండి ఇతర ఆర్ధిక సంస్థల నుండి డిపాజిట్లు స్వీకరించటానికి, రుణాలు పొందటానికి తప్ప మరెందుకు పనికిరావు. ఇక్రా రేటింగ్ ప్రకారం A- కు A కు పెద్ద తేడా ఏమి ఉండదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు, ఐటి రంగం తెలంగాణా ప్రాంతంలోనే ఏర్పాటు చేయటం వలన అక్కడ ప్రభుత్వానికి పన్నుల రూపంలో అత్యధిక ఆదాయం లభించేది అందువలన రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రం ఆదాయ పరంగా మిగులు రాష్ట్రంగా నిలిచింది, అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెవిన్యూ లోటు రాష్ట్రంగా లెక్క తేలింది. ఇక్రా రేటింగ్ గొప్ప విషయంగా తెలంగాణా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ క్రెడిట్ రేటింగ్ పరంగా తెలంగాణా 10వ స్థానంలో, ఆంధ్ర ప్రదేశ్ 13వ స్థానంలో ఉన్నాయి, ఈ పట్టికలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రం మొదటి స్థానంలో, గుజరాత్ రెండవ స్థానంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ లోటు పూడుతుండగా అదే సమయంలో తెలంగాణా రెవిన్యూ మిగులు తగ్గుతుండటం తెలంగాణా ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. ఒకరకంగా చూసుకుంటే ఇక్రా రేటింగ్ ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్టి చెందిన రాష్ట్రంగా తేలినందున కేంద్ర ప్రభుత్వ నిధులు ఆ రాష్ట్రం కంటే వెనుక బడిన ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువగా దక్కాల్సి ఉంది. ఇక్రా క్రెడిట్ రేటింగ్ తెలంగాణా రాష్ట్రం పెట్టుబడుల అనుకూలమైనదిగా ఎక్కడా తెలియచేయలేదు. అది కేవలం తెలంగాణా ప్రభుత్వ అసత్య ప్రచారం మాత్రమె. ప్రపంచ బ్యాంకు వంటి స్వంత్ర సంస్థల నివేదిక ప్రకారం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే, ఈ విషయంలో తెలంగాణా ఎక్కడో అట్టడుగున ఉంది. కెసిఆర్.. ఇకనైనా నీ సొల్లు కబుర్లు కట్టిపెట్టి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడటానికి ప్రయత్నించు. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|