ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడప్పుడే ప్రత్యెక ప్రతిపత్తి హోదా ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు డొంక తిరుగుడుగా శలవిచ్చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి హోదా కల్పించాలంటే మిగిలిన రాష్ట్రాలను కూడా ఒప్పించాలని, వారి ప్రమేయం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఇన్ని నెలల తరువాత తీరిగ్గా చెబుతున్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కాని, గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకాని ఈ విషయాలు వెంకయ్య నాయుడుకు గాని, మోడికి కాని తెలియవా! లేక తెలిసినా ఏవో అబద్ధపు వాగ్దానాలతో ఆంధ్ర ప్రజలను మభ్య పెట్టి పబ్బం గడుపుకోవాలనుకున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్లో రెవిన్యూ లోటు భర్తీ చేయటానికి కేంద్రం సహాయం చేస్తుందని వాగ్దానం చేశారు, కాని కనీసం ఈ వాగ్దానం కూడా నిలబెట్టుకో లెకపొయారు. గత ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రజలకిచ్చిన ఒక్క హామీని కూడా కనీసం నేరవేర్చలేకపోయారు. బిజెపి అధిష్టానం చిన్న రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయోజనాలే వారికి ముఖ్యంగా కనిపిస్తుంది. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకోసమే ఎక్కువ భాగం నిధులు కేటాయించి విభజనలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ధిక సహాయం విషయంలో మొండి చెయ్యి చూపిస్తున్నారు. భారత రత్న పురస్కారానికి తెలుగు వారు కాని, దక్షిణాది వారు కాని అనర్హులని బిజెపి ప్రభుత్వం తెల్చివేసింది. వాజపేయి లాంటి వ్యక్తిని భారత రత్న పురస్కారానికి ఎంపిక చేయటాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినా... అదే సమయంలో ఎన్టీఆర్ కు కాని, పివి నరసింహారావుకు కాని భారత రత్న పురస్కారం వస్తుందని ఆశించిన వారు ఎంతో నిరాశ చెందారు. బిజెపి ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే కాని చేతల ప్రభుత్వం కాదని ఆంధ్ర ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. చిన్నా, చితకా నాయకులు తమ పార్టీలో చేరుతున్నందుకు బిజెపి వారు సంబర పడవచ్చుకాని గత ఎన్నికల్లో బిజెపిని, మోడిని అభిమానించి ఓట్లేసిన ఆంధ్ర ప్రజానీకానికి ఈ పార్టీపై, పార్టీ నాయకులపై భ్రమలు తొలగిపోయాయి. త్వరలో ప్రకటించబోయే 'పద్మ' అవార్డుల విషయంలో కాని, వచ్చే సంవత్సరంలో ప్రకటించబోయే రైల్వే బడ్జెట్లో కాని, ప్రత్యెక ప్రతిపత్తి విషయంలో కాని ఆంధ్ర ప్రదేశ్ కు సరైన న్యాయం జరగని పక్షంలో తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర ప్రజలు బిజెపి ప్రభుత్వం పై తీవ్రమైన వత్తిడి తీసుకువచ్చి తిరుగుబాటు చెయాలి. బిజెపి పార్టీ, కేంద్ర ప్రభుత్వ పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ఉంటే 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే'! అనే సామెతను ఇకనుండి 'బిజెపి వారి మాటలకు అర్ధాలే వేరులే'! అని సవరించుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో గతంలో లాగే అగ్రవర్ణాలకు పెద్ద పీట వేశారు. మొత్తం ఆరుగురు మంత్రులలో అగ్ర వర్ణాలకు చెందిన ఇద్దరు రెడ్లు, ఒక వెలమ, ఒక కమ్మ వారికి మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గంలోని 18 మంది మంత్రులలో ఆరుగురు రెడ్డి, నలుగురు వెలమ సామాజిక వర్గాల వారే! ఈ రెండు వర్గాలవారికే పది మంత్రి పదవులు దక్కాయి. దొంగలు.. దొంగలు కలిపి ఊళ్లు పంచుకున్నట్లు తెలంగాణా జనాభాలో 14% ఉన్న ఈ రెండు కులాలవారికి 60% పైగా పదవులు దక్కించుకున్నారు.. 86% ఉన్న ఇతర కులాలవారికి దక్కింది కేవలం 40% మంత్రి పదవులు మాత్రమె! ఇదేనా కెసిఆర్ మార్కు సామాజిక న్యాయం, సమ న్యాయం? అగ్ర కులాలవారికి బంగారు తెలంగాణా వచ్చేసింది, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత తెలంగాణలో సామాజిక విప్లవం వచ్చింది, వెనుకబడిన కులాలవారికి, షెడ్యూలు కులాల, తెగల వారికి రాజకీయరంగంలో సముచిత స్థానం లభించింది. మంత్రి పదవుల్లో, ఇతర అధికార పదవుల్లో సామాజిక న్యాయం జరిగింది. అప్పటి వరకు తెలంగాణలో నడచిన దొరతనానికి కళ్ళెం పడి, వెనుకబడిన, అణగారిన వర్గాల వారికి పగ్గాలు దక్కాయి. అప్పటినుండి ఎన్టీఆర్ పై ద్వేషాన్ని అణచి పెట్టుకున్న అగ్ర వర్ణాల వారికి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రము ఏర్పడటం, తెరాస పార్టీ కెసిఆర్ నాయకత్వంలో అధికారంలోకి రావటంతో మంచి అవకాశం మరల దక్కినట్లే భావించారు. వారు ఉహించినట్లుగానే కెసిఆర్ ఆ రెండు అగ్ర వర్ణాల వారికి మంత్రి పదవుల పందేరం చేశాడు.. వారు కోరుకున్న బంగారు తెలంగాణా వారికి వచ్చేసింది. కెసిఆర్ తన కుటుంబం, తన కులం, తను భయపడుతున్న కులం వారికి మాత్రమే కీలకమైన మంత్రి పదవులు కట్టబెట్టాడు. తన ఊహ ప్రకారం ఆ రెండు కులాల నాయకుల్లో తప్ప మిగిలిన కులాల నాయకుల్లో నాయకత్వ పటిమ, సామర్ధ్యం లేదనేనా? తెలంగాణా రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 90% మంది బిసిలు, దళితులే... వారెప్పుడు అగ్రకులాల వారెక్కిన పల్లకీలు మోసే బోయీలుగా మిగిలి పోవలసిందేనా? తెలంగాణా ప్రస్తుతం నడుస్తున్న పాలన చూస్తే.... గతంలో 'తెలంగాణా రాష్ట్రంలో సామాజిక న్యాయం' కోసం దళితుల, పేదల పక్షాన పోరాడిన నక్సలైట్లు, గద్దర్, నారాయణమూర్తి, విమలక్క లాంటి ప్రజా ఉద్యమకారులు మరల చైతన్యమై, సామాజిక న్యాయం కోసం ఉద్యమించే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. 'పాయసం, కుడుములు మాకు... పప్పు, బెల్లాలు మీకు' అనే సామెతను నిజం చేస్తూ అగ్ర కులావారికి ప్రాధాన్యమున్న మంత్రి పదవులు కట్టబెట్టి , మిగిలిన కులాలవారికి పనికిరాని, అప్రధాన పదవులు పందేరం చేసి వారి నోరు బలవంతంగా నోక్కేస్తున్న కెసిఆర్ మరి కొంతకాలం తెలంగాణా రాష్ట్రంలో తన దొరతనం కొనసాగించవచ్చు. Everyday is not Sunday. ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి బాగా బలం పుంజుకుంటున్నదని ఈ మధ్య ప్రసార మాధ్యమాల్లో కధనాలు వస్తున్నాయి. గత శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా పోటి చేసిన భాజపా గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించింది. కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని భావించిన చంద్రబాబు నాయుడు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో భాగంగా తమ రాజ్యసభ సీటును కూడా భాజపాకు త్యాగం చేశాడు.
గత ఎన్నికలముందు కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదని భావించిన చాలా మంది నాయకులు భాజపాలొ చేరారు. వీరిలో పురందేశ్వరి లాంటి ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన వారంతా ప్రజా బలం లేనివారే! ఎన్నికల తరువాత పెద్దగా చేరికలు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ, వైకాపా నుండి కొంతమంది నాయకులు ఆ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ సమయం చూసుకొని భాజపా లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తమ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతోనే మొదలుపెట్టి, ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీతో వైరం నెరపిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపానే చూస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండటం, ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్డటం వంటి కారణాలతో వీరు తప్పనిసరి పరిస్థితుల్లో భాజపా గూటికే చేరాలని చూస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారం లభించక పోయినా రుణమాఫీ వంటి భారీ ఖర్చుతో కూడుకున్న పధకాల అమలుకు కృషి చేస్తున్నాడు, కొత్త రాజధాని నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి వంటి విషయాల్లో ఒంటరిగానే శ్రమిస్తున్నాడు. అప్పులు, లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కొద్ది కాలంలోనే ప్రగతి పధం వైపు మళ్లిస్తాడనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు ఈ ఐదేళ్లలో చంద్రబాబు పూర్తిగా అమలు చేస్తాడని ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని... తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తామని, రెవిన్యూ లోటును పూరించటానికి సహాయం చేస్తామని, 10 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి 'ప్రత్యెక రాష్ట్ర' హోదాను అమలు చేస్తామని వెంకయ్య నాయుడు, మోడీ మొదలైన వారు పార్లమెంట్లో ప్రకటించారు.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే పదాలు వల్లె వేశారు. హామీలే తప్ప ఈ ఆరు నెలల్లో ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం... ఈ హామీలు అమలైతే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కు బోలెడన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవి. బిజెపి పార్టీపై, మోడీ వాగ్దానాలపై కోటి ఆశలతో ఓటేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గత ఎన్నికల ముందు బిజెపికి ఉన్న ప్రజాదరణ ప్రస్తుతం కొంత తగ్గిందే తప్ప ఏమాత్రం పెరగలెదు. జాతీయ పార్టీగా బిజెపి ని బలపరిచేవారు సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపికి ఏమాత్రం మద్దతివ్వరు, పైగా రాష్ట్రంలో వెంకయ్య నాయుడు తప్ప ఆ పార్టీకి ప్రజాదరణ, పలుకుబడి కలిగిన నాయకుడు ఎవరూ లేరు. పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలనుండి అవినీతి ముద్ర పడిన కన్నా లక్ష్మీనారాయణ వంటి చౌకబారు నాయకులను చేరదీస్తే ఆ పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం లాభం కలుగదు. కాంగ్రెస్, వైకాపా నుండి వచ్చి చేరే నాయకుల వలన బిజెపికి నాయకుల కొరత తీరవచ్చు, ఓట్ల శాతం కొంత పెరగవచ్చు కాని అవేమీ తెలుగు దేశం పార్టీకి నష్టం కలుగ చేయలేవు. ఆ పార్టీల నాయకుల చేరికతో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తెలుగుదేశం పార్టీకే ప్రయోజనం అవుతుందే తప్ప నష్టం జరుగదు. బిజెపి నాయకులు వాపును చూసుకుని బలుపు అని భ్రమపడితే వారికే నష్టం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు.. కాంగ్రెస్ పార్టీ లేదా వైకాపా బలహీన పడితే ప్రయోజనం పొందేది కేవలం తెలుగుదేశం పార్టీనే! మత రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి హిందువుల ఆదరణ, మద్దతు లభించవచ్చేమో కాని, ఆ ప్రభావం తక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో బిజెపికి ప్రజాదరణ లభిస్తుందనుకోవటం భ్రమే! బిజెపి గత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుకొని పక్షంలో ఇప్పుడున్న బలం కూడా పడిపోయే అవకాశముంది. ఆంధ్ర ప్రదేశ్ లో కమలం పార్టీకి సైకిల్ ప్రయాణమే దిక్కు.. సైకిల్ దిగిన మరుక్షణం మళ్లీ బురదలో కూరుకు పోయినట్లే! Remember me when I am gone away,
Gone far away into the silent land; When you can no more hold me by the hand, Nor I half turn to go, yet turning stay. Remember me when no more day by day You tell me of our future that you plann’d: Only remember me; you understand It will be late to counsel then or pray. Yet if you should forget me for a while And afterwards remember, do not grieve: For if the darkness and corruption leave A vestige of the thoughts that once I had, Better by far you should forget and smile Than that you should remember and be sad. By Christina Rossetti గత మూడు సంవత్సరాలుగా నందమూరి కుటుంబానికి కొంచెం దూరం పాటిస్తూ, తెలుగుదేశం పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యహరిస్తూ వచ్చిన నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మారిన పరిస్థితులలో కుటుంబ సభ్యుల, శ్రేయోభిలాషుల సలహా మేరకు మరల చంద్రబాబు నాయుడు, బాలకృష్ణకు దగ్గరయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు.
2009 సంవత్సరం శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున సుడిగాలి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ సభలకు విశేషమైన స్పందన లభించింది.. చంద్రబాబు నాయుడు తరువాత పార్టీ సారధ్యం వహించే సామర్ధ్యం ఉన్నవాడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తరువాత వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ ప్రచార ప్రభావం ఏమాత్రం కనిపించలేదు, జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా చోట్ల ఓడిపాయింది. తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైన స్థానాన్ని ఆశించిన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ భంగపడి తమ వర్గంతో సహా పార్టీకి దూరంగా ఉండి పోవటమే కాకుండా తన మామ ద్వారా సంక్రమించిన స్టూడియో N ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించాడు. అదే సమయంలో తన అనుచర వర్గాన్ని జగన్ శిబిరానికి దగ్గర చేసి తన ఛానల్లో జగన్ కు అనుకూల ప్రచారం మొదలుపెట్టాడు... అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తో, చంద్రబాబు నాయుడుతో అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమయ్యాడు. చాలామంది ఊహించినట్లుగానే జగన్ బలాన్ని అతిగా ఉహించుకున్న హరికృష్ణ వర్గం లోపాయకారీగా జగన్ తో చేతులుకలిపి తెలుగుదేశం పార్టీలో శల్యసారధ్యం చేశారు. జగన్ కు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్యవర్తులుగా హరికృష్ణ, కొడాలి నాని వ్యహరించారు... ఈ విషయంలో హరికృష్ణకు జగన్ నుండి బాగానే డబ్బులు ముట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ కు, హరికృష్ణ కు అత్యంత సన్నిహితుడు వాళ్ళు పట్టుబట్టి గుడివాడ నుండి సీటు ఇప్పించుకున్న... కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కి ద్రోహం చేసి జగన్ పార్టీలో చేరటమే కాకుండా పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన అతి తీవ్రమైన విమర్శలు చేసిన సమయంలో తండ్రి, కొడుకులు ఏమాత్రం స్పందించలేదు సరికదా! తమ ఛానల్ లో అతిగా ప్రచారం కల్పించారు. అప్పటివరకు లోపాయకారిగా నడచిన వ్యవహారం అప్పటితో బట్ట బయలైంది.. పార్టీలో ఇక హరికృష్ణ ను కాని జూనియర్ ఎన్టీఆర్ ను కాని నమ్మే పరిస్థితి పోయింది. నందమూరి అభిమానులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ కు దూరంగా జరిగారు. ఆ తరువాత నుండే జూనియర్ ఎన్టీఆర్ కు కష్ట కాలం దాపురించింది... అభిమానులు, పార్టీ వర్గాలు దూరమయ్యారు.. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి... ఆ సమయంలో తన స్వలాభం కోసం అభిమానులను దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నంలో భాగంగా తను బ్రతికున్నంత కాలం 'తెలుగుదేశం' పార్టీలోనే ఉంటానన్న ప్రకటనలు చేశాడే తప్ప ఆచరణలో మాత్రం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వ్యవహరించాడు. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చంద్రబాబాబు నాయుడిని బెదిరించి తమ పబ్బం గడుపుకోవాలనుకున్న తండ్రి, కొడుకుల ఆటలు ఇతర కుటుంబ సభ్యుల, పార్టీ అభిమానుల మద్దతు లేకపోవటం వలన సాగలేదు. తెలంగాణా విషయంలో చంద్రబాబు నాయుడు విధానాన్ని వ్యతిరేకించిన హరికృష్ణ తన పదవీకాలం ముగిసే కొన్ని నెలల ముందు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ విధానాలపైన విమర్శలు చేశాడు, ఆ తరువాత సిగ్గు లేకుండా తనకు మరోసారి రాజ్యసభ సభ్యతం కావాలని కోరుకున్నా కాని ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. 2014 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు గుంటూరు జిల్లా నుండి జగన్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించటం అందరికి తెలిసిన విషయమే. హరికృష్ణ హిందూపూర్ లేదా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం చంద్రబాబు ను దేబిరించి భంగపడ్డాడు.. నిజంగా అతనికి, కొడాలి నానికి ఏ విధమైన సంబంధం లేకపోతె గుడివాడ నుండే పోటి చేయటానికి పార్టీ టికెట్ అడిగి ఉండేవాడు. ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ వర్గం తెలుగుదేశం పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటమే కాకుండా వైకాపాకు మద్దతివ్వటం బహిరంగ సత్యమే! 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, బాలకృష్ణ శాసనసభ్యుడిగా ఎన్నిక కావటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంతో... వైకాపా అధికారంలోకి రావటం, జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అనుకున్న హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయ్యారు. తదనంతరం కొంతకాలం మౌనం వహించిన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్... గత కొన్ని సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సరిగా ఆడక పోవటం, హరికృష్ణ రాజకీయ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవటం, జూనియర్ పర్యవేక్షణలో ఉన్న స్టూడియో N చానల్ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉండటం వంటి కారణాలతో తమ భవిష్యత్తుపై కలత చెందిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మధ్య వర్తుల ద్వారా బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు వద్దకు రాయబారాలు సాగించి.. తమ తప్పులను ఒప్పుకుని ఇకమీదట తమవైపు నుండి ఎటువంటి ఎటువంటి తప్పులు జరగవని హామీ ఇచ్చి దాదాపుగా వాళ్ళ కాళ్ళమీద పడినంత పనిచేసినట్లు తెలియవచ్చింది. బాలకృష్ణ కొంత పట్టుదలతో ఉన్నాకాని.. క్షమా గుణం ఎక్కువగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పంతాలు, పట్టింపులకు పోకుండా వారిరువురిని క్షమించినట్లు, మొత్తానికి హరికృష్ణ కుటుంబ కథా చిత్రం సుఖాంతంగా ముగిసినట్లే తెలియవచ్చింది. 1) “Don't cry because it's over, smile because it happened.”
2) “You only live once, but if you do it right, once is enough.” 3) “It is better to be hated for what you are than to be loved for what you are not.” 4) “There are only two ways to live your life. One is as though nothing is a miracle. The other is as though everything is a miracle.” 5) “Good friends, good books, and a sleepy conscience: this is the ideal life.” 6) “Sometimes the questions are complicated and the answers are simple.” 7) “Life is like riding a bicycle. To keep your balance, you must keep moving.” 8) “Life isn't about finding yourself. Life is about creating yourself.” 9) “Things change. And friends leave. Life doesn't stop for anybody.” 10) “The fear of death follows from the fear of life. A man who lives fully is prepared to die at any time.” 11) “Anyone who lives within their means suffers from a lack of imagination.” 12) “The most important thing is to enjoy your life—to be happy—it's all that matters.” 13) “Life is to be enjoyed, not endured” 14) “If you love somebody, let them go, for if they return, they were always yours. If they don't, they never were.” 15) “No persons are more frequently wrong, than those who will not admit they are wrong.” 16) “Life shrinks or expands in proportion to one's courage.” 17) “The more you know who you are, and what you want, the less you let things upset you.” 18) “Wisdom comes from experience. Experience is often a result of lack of wisdom.” 19) “Be thankful for what you have; you'll end up having more. If you concentrate on what you don't have, you will never, ever have enough” 20) “It is' better to live your own life imperfectly than to imitate someone else's perfectly.” 21) “Don't waste your time with explanations: people only hear what they want to hear.” 22) “Death is Peaceful, Life is Harder” 23) “Appear weak when you are strong, and strong when you are weak.” 24) “Nothing in life is to be feared, it is only to be understood. Now is the time to understand more, so that we may fear less.” 25) “Death is so terribly final, while life is full of possibilities.” 26) “How people treat you is their karma; how you react is yours.” నిన్నటి నుండి రాజకీయ వర్గాల్లో ఒక పుకారు షికారు చేస్తుంది. వైద్యం కోసం అమెరికా వెళ్లనున్న కెసిఆర్ ముందు జాగ్రత్తగా హరీష్ రావు జాతకం జ్యోతిష్యులకు చూపించారని, అందులో ప్రస్తుతానికి కెసిఆర్ ముఖ్యమంత్రి పదవికి హరీష్ రావు నుండి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారట.. కానీ అదే సమయంలో జాతక రీత్యా హరీష్ రావుకు 2016 ఏప్రిల్, మే నెలల మధ్య కాలం అద్భుతంగా ఉంటుందని, మహా యోగం తప్పదని శలవిచ్చారట. కెసిఆర్ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరమని, అనవసరంగా అయిన వాళ్ళను దూరం చేసుకోవద్దని, ఏకపక్ష ధోరణి అవలంబించి అందరిని కలుపుకొని వెళ్ళని పక్షంలో రాను రాను ప్రతిపక్షాలే కాకుండా, స్వంత పార్టీ నుండి కూడా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారట.
ఈ విషయంతో కొంత ఆందోళన చెందిన కెసిఆర్ తన జాతకం విషయమై ప్రఖ్యాత మళయాళ జ్యోతిష్యులను సంప్రదిస్తే.. ఫిబ్రవరి 2016 నుండి ఆయనకు కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలు, ఎదురవుతాయని, మే 2016 గడిస్తే కాని ఆయన భవిష్యత్తుపై ఒక అంచనాకు రాలేమని గట్టిగా తేల్చి చెప్పారట.... ఈ విషయం తెలిసిన కొంతమంది తెరాస నాయకులు, హరీష్ రావు సన్నిహితులు 2016లో కాబోయే ముఖ్యమంత్రి హరీష్ రావే అనుకుంటూ .. అప్పుడే హరీష్ రావుకు ముందస్తు అభినందనలు తెలియచేస్తున్నారట ... కెసిఆర్ అనారోగ్య రీత్యా హరీష్ ముఖ్యమంత్రి అవుతాడా! లేక మామపై అసమ్మతితో వర్గాన్ని కూడగట్టుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అవుతాడా అనేది తెలియాలంటే మనం ఇంకో 16 నెలలు వేచియుండక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో దట్టమైన అరణ్యప్రాంతంలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 49 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున ఈ పర్వత ప్రాంతాన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్య నుండి జాలువారే జలపాతం పర్యాటకులకు అందమైన అనుభూతి కలిగిస్తుంది. తలకోన చేరుకోగానే మనకు దర్శనమిచ్చేవి సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. పర్యాటకులు తీసుకువెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆపై జలపాతం వద్దకు చేరుకోవాలంటే నడకబాట పట్టాల్సిందే. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. తలకోన ప్రకృతి శోభాయమానంతో అలరింపజేయడమే కాకుండా ఇదో పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా మారుతోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ జరిగే ఉత్సవా లలో రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుండటంతో పాటు ప్రతి నిత్యం వందలాది సంఖ్యలో పర్యాటకులు తలకోనకు చేరుకుంటుంటారు. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతాన్ని మనం సందర్శించవచ్చు. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాత దృశ్యం బహు అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడ్డ ఓ పెద్ద గుంటలాంటి ప్రదేశంలోని నీటిలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు. ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా వున్నాయి. అడవి కోళ్లు, నెమళ్లు, , దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం వున్నది. ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడ వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు. తిరుపతి నుండి 49 కిలోమీటర్ల దూరంలో తలకొనకు బస్టాండ్ నుండి.ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. జాతీయ రహదారిపైన ఉన్న భాకరాపేట గ్రామం నుండి 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వ్యాన్, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు. తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు లేదా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యాటకశాఖ కేంద్రాలు, అటవీశాఖ అధికారుల వద్ద గదులు బుక్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాఖాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది 6 సంవత్సరాల పైబడిన తరువాత సత్యం కుంభకోణం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు కేసులను ఎస్ఎఫ్ఐవో నమోదు చేయగా ఐదు కేసులకు సంబంధించి తీర్పు వెలువరించి ఒక కేసును కోర్టు కొట్టివేసింది. రామలింగరాజు, రామరాజులకు నాలుగు కేసుల్లో ఒక్కో దానికి ఆరునెలల చొప్పున జైలు శిక్ష విధించగా, ఐదు కేసుల్లో రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. అలాగే తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువిచ్చింది.
సత్యం కుంభకోణంలో 2,000 కోట్లు దోచిన పెద్దమనుషులకు కేవలం 10 లక్షల జరిమానా, 6 నెలల కారాగార శిక్ష విధించిన కోర్టు తీర్పు నిజంగా ఈ దేశ యావత్ ప్రజానీకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. వేయి రూపాయలు లంచం తీసుకున్న ఉద్యోగికి, పది వేలు దొంగతనం చేసిన దొంగకి, లక్ష రూపాయలు మోసం చేసిన మోసగాడికి, వందల కోట్లు అక్రమంగా దోచుకుని, కంపెనీ నష్టాలకు భాద్యుడై, తన కంపెనీలో లక్షల మంది వాటాదారుల (షేర్ హోల్డర్ల) వేలకోట్ల రూపాయల సంపదను దారుణంగా నష్ట పరచిన రామలింగ రాజు అండ్ బ్రదర్స్ కు ఒకే రకమైన శిక్ష విధించటం ఏమి న్యాయం? ఈ తీర్పు కార్పొరేట్ మోసగాళ్ళ మోసాలకు మరింత ఊతమిచ్చేదిగా ఉంది.. ఈ దేశంలో పేద వాడికి ఒక న్యాయం, పెద్దోడికి ఇంకో రకమైన న్యాయమని మరో సారి నిరూపితమైంది.. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకెళ్ళిన వారి కుటుంబాలు, సంపాదించే వ్యక్తిని కోల్పోయి ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సత్యం స్కాంలో సర్వం కోల్పోయిన మదుపరుల కష్టాలు తీర్చే నాధుడు లేడు... కానీ సత్యం రాజుగారి కుటుంబం ఇంకా రాజ భోగాలు బాగానే అనుభవిస్తున్నారు. రేపు రామలింగరాజు కోర్టులో అప్పీలు చేసుకుంటే.. ఈ పేద రాజు గారికి ఇంత పెద్ద శిక్షా! అని కేసును కొట్టేసినా కొట్టేయోచ్చు. గతంలో ఒక సందర్భంలో ఆర్ధిక నేరాలు హత్యా నేరం కంటే తీవ్రమైనవని తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్టు రాజుగారి విషయంలో మినహాయింపులు ఇవ్వవచ్చు... ఈ తీర్పు మరొక ఆర్ధిక నేరస్తుడు 'జగన్'కు ఎంతో సంతోషం కలిగించి ఉండవచ్చు. నిజంగా! చట్టానికి కళ్లులేవు తమ్ముడూ!! |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|