మనాలి భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ యొక్క పర్వతాలలో ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ, కులు లోయలో సముద్ర మట్టానికి 6,398 అడుగులు ఎత్తులో ఉన్న పర్వత ప్రాంత విడిది. మనాలి పరిపాలనాపరంగా కులు జిల్లాలో భాగంగా ఉంది, జనాభా సుమారు 30,000. ఈ చిన్న పట్టణం లడఖ్ కు ప్రాచీన వర్తక మార్గ ప్రారంభంగా ఉండేది. మనాలి మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశం సప్తర్షి, లేదా ఏడుగురు ఋషుల నివాసంగా పేర్కొనబడటం వలన భారతీయ సంస్కృతి మరియు వారసత్వంలో అమిత ప్రాముఖ్యతను కలిగి ఉంది. మనాలి బాగా చల్లని శీతాకాలాలు, మరియు మితమైన చల్లదనాన్ని కలిగిన వేసవికాల శీతోష్ణస్థితిని కలిగిఉంది. ఉష్ణోగ్రతలు సంవత్సరంలో 4సెంటీగ్రేడ్ నుండి 30సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వేసవికాలంలో సగటు ఉష్ణోగ్రతలు 14సెంటీగ్రేడ్ నుండి 20సెంటీగ్రేడ్ వరకు, మరియు శీతాకాలంలో -7సెంటీగ్రేడ్ నుండి 10సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. ఒక మాసంలో ఉండే అవపాతం నవంబర్ నెలలో 24మిల్లీమీటర్ల నుండి జూలైలో 415మిల్లీమీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. శీతాకాలం మరియు వసంత ఋతువులలో సగటు అవపాతం 45మిల్లీమీటర్లగా ఉండి, ఋతుపవనాలు సమీపించడం వలన వేసవిలో 115మిల్లీమీటర్లకు పెరుగుతుంది. సగటు సాంవత్సరిక అవపాత మొత్తం 1520 మిల్లిమిటర్లు. ఈ ప్రాంతంలో సాధారణంగా మంచు డిసెంబర్ నెలలో కురుస్తుంది కాని, గత పదిహేను సంవత్సరాలుగా ఆలస్యమై జనవరి లేదా ఫిబ్రవరి నెల ప్రారంభంలో కురుస్తోంది. మనాలి జాతీయ రహదారి 21 మరియు జాతీయరహదారి 1 ద్వారా ఢిల్లీతో కలుపబడింది, లే కు వెళ్ళే ఈ రహదారి ప్రపంచంలో అంత్యంత ఎత్తైన వాహనంలో ప్రయాణించగల రహదారిగా ప్రసిద్ధి చెందింది. న్యూ ఢిల్లీ నుండి మనాలి వెళ్ళే మార్గంలో ఉన్న పట్టణాలలో హర్యానాలోని పానిపట్ మరియు అంబాలా, చండీగర్, పంజాబ్ లోని రోపార్, మరియు బిలాస్పూర్, సుందర్ నగర్, మరియు హిమాచల్ లోని మండి ఉన్నాయి. మనాలి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్యాటక మజిలీ, హిమాచల్ పర్యటించే మొత్తం పర్యాటకులలో నాల్గవవంతు మనాలి సందర్శిస్తున్నారు. మనాలి సాహాస క్రీడలైన స్కీయింగ్, హైకింగ్, పర్వతారోహణం, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్, ట్రెక్కింగ్, కయకింగ్, మరియు మౌంటైన్ బైకింగ్ వంటి వాటికి పేరు పొందింది. యాక్ స్కీయింగ్ ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడ. మనాలిలో వేడి నీటిబుగ్గలు, మత పరమైన పుణ్య స్థానాలు మరియు టిబెట్ మరియు బుద్ధిస్ట్ ఆలయాలు ఉన్నాయి. మనాలి దాని కాంతులీనే గోమ్పాస్ లేదా బుద్ధిస్ట్ ఆశ్రమాలకు పేరు పొందింది. కులు లోయ మొత్తంలో టిబెటన్ శరణార్ధుల సాంద్రత ఎక్కువ. మనాలికి దక్షిణంగా ఉన్న నగ్గర్ కోట , పాల సామ్రాజ్యం యొక్క చిహ్నం. శిలలు, రాళ్ళు, మరియు విశాల దారు శిల్పములతో కూడిన ఈ భవనం హిమాచల్ యొక్క మహోన్నత మరియు మనోహర కళా నైపుణ్యానికి తార్కాణంగా ఉంది. ఈ కోట తరువాత కాలంలో హోటల్ గా మార్చబడి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆధీనంలో ఉంది. రహ్లా జలపాతములు మనాలి నుండి 27కిలోమీటర్ల దూరంలో రోహతంగ్ కనుమ ఎక్కడానికి ప్రారంభంలో, సుందరమైన రహ్లా జలపాతాలు 2501మీటర్ల ఎత్తులో ఉన్నాయి. సోలంగ్ లోయ , స్నో పాయింట్ గా ప్రసిద్ధి చెందింది, మనాలికి వాయవ్యంగా 13 కిమీ దూరంలో ఉంది. మనికరణ్ , కులు నుండి 45 కిమీ. దూరంలో మనాలి మార్గంలో పార్వతి నది సమీపంలో ఉన్న ఈ ప్రదేశం వేడి నీటిబుగ్గకు ప్రసిద్ధి చెందింది. రోహతంగ్ , మనాలి నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందిన మంచు పడే ప్రాంతం, కానీ శీతాకాలంలో మంచు వలన మూయబడి ఉంటుంది. పాండవ యువరాజు భీముని భార్య, స్థానిక దేవత హడింబ యొక్క ఆలయమైన హిడింబా దేవి ఆలయం 1553లో స్థాపించబడింది. ఈ ఆలయం దాని నాలుగు-అంతస్తుల గోపురం మరియు సున్నితమైన దారు చెక్కడాలకి ప్రసిద్ధి చెందింది. పురాతనమైన జగన్నాధ దేవి ఆలయాన్ని 1500 ఏళ్ళ నాడు నిర్మించారని అంటారు. ఈ గుడి గోడల మీద శక్తి స్వరూపిణి దుర్గా దేవి చిత్రాలు చూడవచ్చు. ఈ గుడిని చేరుకోవాలంటే 90 నిమిషాల పాటు పర్వతారోహణ మార్గం గుండా ప్రయాణించాలి. శివుడి కోసం నిర్మించిన ఇక్కడి బసవేశ్వర దేవాలయం 9 వ శతాబ్దం లో నిర్మించారు. ఇక్కడి గుడి నిర్మాణం సంక్లిష్టమైన శిల్ప శైలికి పేరుపొందింది. కులు పర్యటించే వారు 180 జాతుల వన్య ప్రాణులున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ చూడవచ్చు. వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా పర్యాటకులు కులు చేరుకోవచ్చు. కులు మనాలి విమానాశ్రయంగా పిలువబడే భుంటార్ ఇక్కడికి దగ్గరలోనే వుంది. కులు నగరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ విమానాశ్రయం నుంచి డిల్లీ, షిమ్లా, చండీఘర్, పఠాన్ కోట్, ధర్మశాల లాంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విదేశాలకు విమానాలు నడిపే డిల్లీ ఇక్కడికి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం. నగరం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ ఇక్కడికి దగ్గరలోని రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి చండీఘర్ గుండా అనేక ప్రాంతాలకు రైళ్ళు నడుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ ద్వారా (హెచ్.పి.టి.సి) బస్సులు కులు నుంచి ఇతర సమీప నగరాలకు బస్సులు నడుపుతుండగా, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది శాఖ (హెచ్.పి.టి.డి.సి) చండీఘర్, షిమ్లా, డిల్లీ, పఠాన్ కోట్ లాంటి నగరాలకు కులు నుంచి డీలక్స్ బస్సులు నడుపుతుంది. వేసవిలో కులులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల ఇది ఒక వేసవి విడిదిగా ప్రసిద్ది చెందింది. అయితే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలలో ఇక్కడ విపరీతంగా మంచు కురవడం వల్ల శీతాకాలంలో గడ్డకట్టే చలి ఉంటుంది, కానీ స్నో స్కీఇంగ్ కు ఈ సమయం అనువుగా ఉంటుంది.
మార్చ్ నుండి అక్టోబర్ వరకు ఈ పర్వత కేంద్రాన్ని సందర్శించడానికి అనువైన సమయం. బహిరంగ కార్యకలాపాలకు, స్థల సందర్శనకు మార్చ్ నుండి జూన్ నెలలు అనుకూలమైనవి కాగా జూన్ నుండి అక్టోబర్ వరకు రివర్ రాఫ్టింగ్, పర్వతారోహణ, హైకింగ్, ట్రెక్కింగ్ లాంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగము (2015-2016) ప్రకారం మన్మథ నామ సంవత్సర అధికాషాఢ బహుళ త్రయోదశీ మంగళవారం అనగా 14 జూలై 2015 ఉదయం 6.26 ని.లకు బృహస్పతికి సింహరాశి ప్రవేశము సంభవించినది. కావున ఈ దినము లగాయితు గోదావరి నదికి పుష్కర ప్రారంభముగా ఆచరింపదగును. పుష్కరవ్రతము ద్వాదశ దిన సాధ్యమగుటచే 14-7-2015 నుండి 25-7-2015 వరకు ఆధి పుష్కరములుగా ఆచరింపవలెను. ఈ గోదావరి నదికి మాత్రము అంత్యమందు 12 రోజులు కూడా, అనగా 31-7-2016 నుండి 11-8-2016 వరకు అనగా బృహస్పతి కన్యారాశి యందు ప్రవేశ పూర్వము వరకు పుష్కర కార్యక్రములను యధావిధిగా ఆచరింపవలెను.
భారతదేశం లో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్ నది యొక్క రాశి సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయం లో పుణ్యనగరి రాజమండ్రి కి దేశ విదేశాల నుండి భక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది భక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు. ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక శోభతో విరాజిల్లుతుంది. పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి. నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది.దాహార్తిని తీర్చడం,శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,యజ్ఞనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే యాజ్ఞనం అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రంహాండ పురాణం వర్ణిస్తుంది. పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక్కసారి కోనసీమ, పట్టిసీమ అందాలను తిలకించటం మర్చిపోకండే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో దట్టమైన అరణ్యప్రాంతంలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 49 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున ఈ పర్వత ప్రాంతాన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్య నుండి జాలువారే జలపాతం పర్యాటకులకు అందమైన అనుభూతి కలిగిస్తుంది. తలకోన చేరుకోగానే మనకు దర్శనమిచ్చేవి సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. పర్యాటకులు తీసుకువెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆపై జలపాతం వద్దకు చేరుకోవాలంటే నడకబాట పట్టాల్సిందే. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. తలకోన ప్రకృతి శోభాయమానంతో అలరింపజేయడమే కాకుండా ఇదో పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా మారుతోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ జరిగే ఉత్సవా లలో రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుండటంతో పాటు ప్రతి నిత్యం వందలాది సంఖ్యలో పర్యాటకులు తలకోనకు చేరుకుంటుంటారు. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతాన్ని మనం సందర్శించవచ్చు. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాత దృశ్యం బహు అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడ్డ ఓ పెద్ద గుంటలాంటి ప్రదేశంలోని నీటిలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు. ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా వున్నాయి. అడవి కోళ్లు, నెమళ్లు, , దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం వున్నది. ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడ వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు. తిరుపతి నుండి 49 కిలోమీటర్ల దూరంలో తలకొనకు బస్టాండ్ నుండి.ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. జాతీయ రహదారిపైన ఉన్న భాకరాపేట గ్రామం నుండి 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వ్యాన్, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు. తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు లేదా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యాటకశాఖ కేంద్రాలు, అటవీశాఖ అధికారుల వద్ద గదులు బుక్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాఖాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది ఊటీ తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం మరియు పట్టణం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు.
ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగ వంశ రాజుల ఆధీనంలోకి మారాయి. తరువాత 12వ శతాబ్దంలో హోయసాల వంశ రాజైన విష్ణువర్థనుడి స్వాధీనంలో ఉన్నాయి. చివరకు టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చి, 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు అప్పగించబడ్డాయి. పక్కనే ఉన్న కోయంబత్తూర్ ప్రావిన్సు కు గవర్నరుగా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, మరియు అడవులను చూసి ముచ్చటపడి, అక్కడ నివసిస్తున్న కోయజాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొన్నాడు. నెమ్మదిగా ఈ స్థలాలు ఆంగ్ల ప్రైవేటు వ్యక్తుల పరం కావడంతో త్వరత్వరగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా మారింది. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికలు తిరిగే రహదారులు, సంక్లిష్టమైన రైలు మార్గాల్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి ముగ్ధులైన ఆంగ్లేయులు దీన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వారు. ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం.ఉష్ణవాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణభారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా,చల్లగా ఉంటుంది.జనవరి,ఫిబ్రవరి నెలల రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.సాధారణంగా వసంతకాలంలో అక్కడి వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5–12 °C (41–54 °F) మరియు సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17–20 °C (63–68 °F) నమోదవుతాయి.దక్షిణ ఆసియా ప్రమాణాల ప్రకారం 25 °C (77 °F) ఉష్ణోగ్రత అక్కడ నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రత.ఊటీలో వర్షాకాలం సాధరణంగా చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడి ఉంటుంది.ఏడాది పొడవునా గాలులు అధికంగా వీస్తుంటాయి. −2 °C (28 °F) అక్కడ నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత.నగరం డిసెంబరు నుంచి మార్చి వరకు పొడివాతావరణంతో 1250మి.మీటర్ల అవపాతంతో చవిచూస్తుంది. ఊటీలో దర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బొటానికల్ గార్డెన్, లేక్, గవర్నమెంట్ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్హౌస్, కాఫీ తోటలు హిందూ దేవాలయాలైన మురుగన్ కోయిల్, వెంకటేశ్వర స్వామి, మరియమ్మ, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ముఖ్యమైనవి. ఊటీ సమ్మర్ ఫెస్టివల్కు పెట్టింది పేరు. అలాగే మే నెలలో ఫ్లవర్ షో, ఫ్రూట్ షో పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఊటీ పరిసర ప్రాంతాలలో కెట్టివాలి వ్యూ, పైకరా, అప్పర్ భవాని, అవలంచి, జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దొడ్డబెట్ట, కల్హట్టి ఫాల్స్, వెన్బాక్ డాన్స్, వెక్ హిల్స్, స్నోడెన్ పీక్, కూనూరు, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్, లాన్ ఫాల్స్, సెయింట్ కేధరిన్ ఫాల్స్, సిమ్స్ పార్క్, సిమ్స్ పార్క్, కోటగిరి, కొడనాడ్ పాయింట్ తదితరాలు మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు. ఊటీ లేక్ , ఊటీ దర్శించే పర్యాటకులకు ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. దీనిని 1824 లో జాన్ సుల్లివాన్ సుమారు 65 ఎకరాల లో నిర్మించారు. వర్షాకాలం లో కొండలపై నుండి పడే నీటిని ఈ సరస్సు పొందుతుంది. అది నిండిన వెంటనే సుమారు మూడు సార్లు ఖాళీ చేస్తారు. స్థానిక మత్స్యకారులు ఇక్కడ చేపలు వేతాడతారు. ప్రస్తుతం బోటు విహారాల కారణంగా నే ప్రసిద్ధి చెందినది. బోటు విహారం చేస్తూ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. మే నెలలో ప్రభుత్వం రెండు రోజులపాటు బోటు రేస్ లు నిర్వహిస్తుంది. "బొటానికల్ గార్డెన్" గురించి చెప్పుకోవాలంటే.. ఇది ఊటీ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 1847లో మార్క్విస్ చేత ప్రారంభించబడింది. అద్భుతమైన పూల మొక్కలు, అరుదైన పుష్ప జాతులను ఇక్కడ చూడవచ్చు. మే నెలలో ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బొటానికల్ గార్డెన్లో 20 మిలియన్ల సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా దర్శించాల్సిందే. అలాగే ఊటీకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉండే "లేక్" చూడదగ్గది. ఇది 1824లో కోయంబత్తూర్ కలెక్టర్ జాన్ సిలివాస్ చేత నిర్మించబడింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా ఈ లేక్లో ఎంచక్కా బోటింగ్ చేయవచ్చు. ఇక్కడ చిన్నారుల కోసం చిల్డ్రన్స్ కార్నర్ కూడా ఉంది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ మ్యూజియం. మైసూర్ రోడ్డులో ఉన్న ఈ మ్యూజియంలో పాతకాలంనాటి అనేక వస్తువులను చూడవచ్చు. ఊటీ పరిసర ప్రాంతంలో ఉన్న "కెట్టివ్యాలి వ్యూ" తప్పకుండా చూడాల్సిందే. ఇది కూనూరు వెళ్లే దారిలో ఉంది. కోయంబత్తూర్, మైసూర్ మైదానాలలో ఉండే చిన్న గ్రామాలన్నింటినీ చూడవచ్చు. ఆ తరువాత ఊటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న "పైకరా" చూడాల్సిన మరో ప్రదేశం. ఇది మైసూర్ రోడ్లో ఉంది. ఇక్కడ రిజర్వాయర్, డ్యామ్ చూడదగ్గవి. లాగే "అప్పర్ భవాని" అనే ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇది కోరాకుందా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, అవలంచి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నిశ్శబ్దలోయ చూడదగ్గది. ఊటికి 28 కిలోమీటర్ల దూరంలోని "అవలంచి" చూడదగ్గ మరో ప్రదేశం. ఇక్కడ సుందరమైన సరస్సు, చుట్టూ అడవితో పర్యాటకులకు స్వర్గాన్ని తలపిస్తుంది. అలాగే నీలగిరిలో ఉన్న ఎత్తైన శిఖరం దొడ్డబెట్ట, అక్కడ నెలవైన టెలిస్కోపుతో నీలగిరి అందాల వీక్షణ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఇంకా జయలలిత వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏనుగులు, పులులు, జింకలు, నీటి పక్షులు, కొండ చిలువలను చూడవచ్చు. టేకు చెట్లు అధికంగా ఉండే ఈ శాంక్చురీకి దగ్గర్లోని మోయర్ జలపాతం, ముఖ్యమంత్రి గడియార స్తంభం చూడదగ్గవి. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ నెలలు ఊటీ సందర్శనకు అనుకూలమైన నెలలు. కోయంబత్తూరు నుంచి రైల్లో ఊటికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి కూడా ఊటీకి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రదేశాల నుంచి పలు రోడ్డు మార్గాలలో ఊటీ చేరుకోవచ్చు. మద్రాసు నుండి ప్రతి రోజు రాత్రి మెట్టపాళయం రైలు 9గంటలకు ఉంటుంది. మరుసటిరోజు ఉదయం 6.15కు అదే రైలు మెట్టుపాళయం చేరుతుంది. అక్కడి నుండి ఊటీకి ఇంకో ట్రైన్ ఉదయం 7.45కి ఉంది. అది ఊటీకి మధ్యాహ్నం 12.10కి చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.10కి బయలుదేరి 6.30కి మెట్టుపాళయం చేరుతుంది. అలాగే ఊటీ నుండి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నూరు నుండి ఉదయం 9.30కి, మధ్యాహ్నం 2.55కి, సాయంత్రం 6 గంటలకు మూడుసార్లు ఊటీ ట్రైన్ ఉంది. అదే ట్రైన్ తిరిగి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, 3 గంటలకు కన్నూరు వస్తుంది. ఈ రైలు ప్రత్యేకంగా పర్యాటకుల కోసం నడుస్తుంది. నీలగిరి పర్వతాలలోని ప్రకృతి అందాలకు, పచ్చని ప్రకృతికి ఆలవాలమైన ఈ పర్యాటక ప్రాంతాన్ని రైలులో ప్రయాణంలో చూసి తీరవలసిందే. ఊటీ మద్రాసుకు 535, బెంగుళూరుకు 290, మైసూరుకు 160, కోయంబత్తూరుకు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కవ మంది కోయంబత్తూర్, మైసూర్ నుండి వస్తుంటారు. కోయంబత్తూరు నుండి ఊటీకి ప్రతి 20 నిమిషాలకొక బస్సు ఉంది. ఈ బస్సులు వయా మెట్టుపాళయం మీదుగా వెళతాయి. పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, మరియుతెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా లను ఆనుకొని ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విజయవాడ నుండి 157 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 192 కిలోమీటర్లు, రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను పాపికొండల ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది.
రాజమండ్రి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టిసీమ లేదా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురుషోత్తమ పట్నం వరకు ట్రావెల్ ఏజెన్సీ లేదా APSRTC బస్సులు లేదా మినీ వ్యానుల్లొ ప్రయాణం చేస్తే అక్కడ నుండి గోదావరి నదిలో లాంచిలో పాపికొండలు యాత్ర మొదలౌతుంది. వీలైనంతవరకు ఉదయం 9:00 గంటల లోపుగా అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంచీ లోనే లభ్యమౌతుంది. గోదావరి నది మధ్యలో ఉండే పట్టిసం వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది. ఇక్కడ ఎన్నో తెలుగు సినిమాలు చిత్రీకరణ చేశారు. పురుషోత్తం పట్నం దాటినా తరువాత కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్సనం తరువాత మరల యాత్ర సాగుతుంది. ఆ తరువాత వచ్చే దేవీ పట్నం గ్రామంలో అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే పోలీసు స్టేషన్లు కనిపిస్తాయి. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను. యాత్ర ప్రారంభమైన ఐదు గంటలకు పాపికొండలు చేరుకుంటాము. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. వేసవి కాలంలోలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో పెద్ద పులులు, చిరుతపులులు, నల్లపులులు, అడవిదున్నలు (గొర్ర గేదెలు), జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండచిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగుబంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, ఛీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం వద్ద కట్టబోతున్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు వలన ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు అవబోతున్నది. నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండి రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది. రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపొతాయి. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది. అంతేకాక త్వరలోనే పాపికొండలు, ఆ కొండలమధ్యలో ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అందాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ కారణంగా కనుమరుగు కాబోతున్నాయి. పాపికొండలు దాటిన తరువాత సుమారుగా ఒక గంట ప్రయాణం తరువాత వచ్చే ప్రదేశం పేరంటాలపల్లి గ్రామం, ఇది గతంలో ఖమ్మం జిల్లాలో ఉంది కాని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చారు. భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎత్తయిన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, ఇసుక తిన్నెలు, పిల్లలు, పెద్దలను కేరింతలు కొట్టిస్తాయి. పేరంటాలపల్లి చేరుకోవటంతో యాత్ర ముగిసి తిరుగు ప్రయాణం మొదలౌతుంది. పట్టిసం నుండి పాపికొండలు యాత్ర, తిరుగు ప్రయాణం సమయం సుమారుగా 9:30 నుండి 10:00 గంటలు ఉంటుంది. చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యో దయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్ఫైర్... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది. తెలంగాణా రాష్ట్రం వైపు ఖమ్మం జిల్లా కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్టల్రోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు. AP Tourism one day package tour for Adults: Rs.600/- and Children: Rs.400/- http://aptourismrajahmundry.com/papihills_oneday.html Cont: +91 9397912351, 9397912411, 9494909399, 9290364666 3, 4 private tour operators are also conducting daily tours to Papikondalu from Rajahmundry. A hots pot of Andhra Pradesh that is becoming the first demand especially for hill station lovers. A small town of AP with full greenery everywhere is definitely going to attract voyagers. Surrounding is covered with hills and dense forest so you are going to enjoy the nature as well as best hospitality of India at this special destination. This Indian tourist place is all time favorite spot for nature lovers.
Lambasingi also called as Lammasingi is a small village in the Chintaplli Mandal of Vishakapatnam district of Andhra Pradesh, India, perched at an altitude of 1025 meters above sea level. Another name for this Lambasingi village is Korra Bayalu. Korra means ´stick´, Bayalu means ‘outside’, in the local language this means “if some one stays outside the house in the open they will freeze like a stick”. Lambasingi is the only place in Southern India, where you can experience snowfall sometimes in winter. Even in seasons other than winter, sunlight falls only after 10 AM in the morning. The most important part of this town is the temperature goes below 0 °C in winter. December and January are two most difficult months in this region due to chilled air flow. However, snow fall rarely occurs in this place, but the temperature is always low than 10 degree throughout the year. The town is having different climate than other cities of the state. Sun rises at regular time but the sunlight reach the town after 10 am every day except winter season. In winter the sun gets little bright after 12 noon. However, the light become shorter after 3 pm every day because the place get blank with thick fog after 3 pm. There were instances where the temperature had touched below one degree. The last time sub-zero temperature was recorded at Lammasingi during December 2008 and January 2011 The nearby forest hill station Chintapalli is one more tourist attraction. Tajangi valley is best attraction in Chintapalli. The major source of income of Lambasingi is coffee and pepper plantations. However, tourism is also increasing here so future is bright of this town. This Indian tourist place is popular for producing best coffee and pepper ever. All these plantations are being cultivated since the British Regime in India. Coffee grown here is exported to the USA and UK Nations Talking about attraction in this place the greenery and valleys are important areas that you can cover. Some spots are famous for trekking and adventure events like camping. However, walking the area will give you more enjoyment as you will be able to watch the natural beauty closer. The tourist department of Andhra Pradesh is having travel packages for Lambasingi. You can contact the office through online for booking of your favorite accommodation in this town. APSRTC is providing service related to tourism in this area like you can enjoy the forest safari and can watch the real jungle closer than ever. Lambasingi is properly connected through road and direct buses for the town are available from Visakhapatnam, Narsipatnam, Chintapalle and some more cities. It is 101 KMs from Visakhapatnam, 19 KMs from Chintapalle and 32 KMs from Narsipatnam via NH5.
|
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|