గాంధీ మహాత్ముడు దక్షిణ ఆఫ్రికా లో అక్కడి వారెవ్వరితోనూ గొడవ పడలేదు, వారి మతాన్ని గురించి కానీ వారి వర్ణాన్ని గురించి కానీ ఎటువంటి అహంకార పూరిత వ్యాఖ్యలు చేసి వారిని రెచ్చ కొట్టలేదు. గాంధీ మహాత్ముడు అగ్ర వర్ణంలో జన్మించినా కానీ, సమాజంలో వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీ మహాత్ముడు ప్రభుత్వం ఇచ్చిన ఉపకార వేతనాన్ని అనుభవిస్తూ, హాస్టల్లో ఉచితంగా దొబ్బి తింటూ కుల సంఘాలు స్థాపించి తోటి విద్యార్ధులతో గొడవ పడలేదు. గాంధీ మహాత్ముడు తుచ్చమైన ప్రయోజనాలకోసం తన పుట్టుకతో సంక్రమించిన కులం, మతం మార్చుకుని దొంగ సర్టిఫికేట్ తో సమాజాన్ని మోసం చేయలేదు. గాంధీ మహాత్ముడు సత్యం.. అహింస... అని ప్రపంచానికి చాటి చెప్పాడు అలాంటిది ఒక అసత్యవాది, తీవ్రవాద భావాలు కల వ్యక్తితో గాంధీ మహాత్ముని పోల్చటమా! రాహుల్ వ్యాఖ్యలతో గాంధీ ఆత్మ ఏలోకంలో ఉన్నా కానీ తప్పకుండా క్షోబిస్తుంది....
గాంధీ మహాత్ముడు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు.. ఎందరో మహానుభావుల త్యాగ ఫలంతో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ దేశంలో మతం పేరుతొ మారణ హోమం సృష్టించి, దేశ మైక్యతను విచ్చిన్నం చేసి ఎందరో అమాయక భారతీయులను, దేశ రక్షణ కోసం అహర్నిశం శ్రమిస్తున్న సైన్యాన్ని బలిగొన్న ఉగ్ర వాదులతో చేతులు కలిపిన 'యాకుబ్ మెమన్' వంటి దేశ ద్రోహులకు అనుకూలంగా, అతనికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం విధించిన ఉరి శిక్షకు వ్యతిరేకంగా సభలు నిర్వహించి యాకుబ్ మెమన్ లాంటి దేశ ద్రోహి ఒకరు మరణిస్తే ఇంటికో యాకుబ్ మెమన్ పుడతాడని నినాదాలు చేసిన సంఘ, దేశ విద్రోహ శక్తులకు వత్తాసుగా మాట్లాడటమే కాకుండా ఒక తీవ్ర వాద భావాలు, మత, కుల విద్వేష భావాలు కల వ్యక్తిని గాంధీ మహాత్ముడితో పోల్చి రాజకీయం పిచ్చి పట్టిన రాహుల్ గాంధీ ఈ దేశం పరువు, 90 కోట్ల మంది భారతీయుల పరువు బజారు పాలు చేశాడు... రాజకీయాల కోసం ఈ దేశాన్ని, దేశం పరువును అమ్మివేసే ఇటువంటి కుహనా లౌకిక వాదులకు ఈ జన్మలో బుద్ధి రాదు.
అరేయ్ పిచ్చి వెధవా! పటాన్ కోట్ వెళ్లి పాకిస్తాన్ ISIS తీవ్రవాదులు సృష్టించిన విధ్వంసంలో మరణించిన వీర జవానుల కోసం రెండు చుక్కల కన్నీళ్లు కార్చరా! ఎవడో ఒక తీవ్రవాది కోసం, మత విద్వేషి కోసం రెండు సార్లు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నువ్వు పీకేదేమిటిరా? దేశమంటే దళితులు ఒక్కరే కాదురా! దేశమంటే 90 కోట్లమంది ప్రజలు, దేశాన్ని రక్షించే సైన్యం రా!!