గత GHMC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 45, బిజెపి కేవలం 5 సీట్లు గెలుచుకున్నాయి. ఆ ప్రకారం చూస్తే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ కి కనీసం 120 స్థానాలు దక్కాలి. కానీ కొందరు బిజెపి నాయకుల కుట్రలు, కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి లాంటి కొందరు తెదేపా నేతల శల్య సారధ్యం, కుళ్ళు రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ కొన్ని బలమైన స్థానాలు వదులుకుని, మరికొన్ని బలహీనమైన స్థానాల్లో పోటి చేయటానికి ఒప్పుకుని కేవలం 87 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది ఈ మధ్య కాలంలో బిజెపి సంప్రాదాయ ఓట్లు కొంతవరకు తెరాస పార్టీకి మళ్ళాయి, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు పెద్దగా చెదిరి పోలేదు. కానీ బిజెపి నాయకులూ, ముఖ్యంగా కిషన్ రెడ్డి మంకుపట్టు పట్టి ఎక్కువ స్థానాలు తీసుకోవటం, అదీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాలు, తెదేపా సిట్టింగ్ స్థానాలు, బిజెపి బలంగా లేని స్థానాలు పట్టుబట్టి తీసుకోవటం వెనుక పెద్ద కథే నడిచిందేమోననే అనుమానం కలుగక మానదు.
గ్రేటర్ హైదారాబాద్ లో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవటం బిజెపి లో కిషన్ రెడ్డి, చెన్నమనేని విద్యాసాగర రావు వంటి కొందరు బ్రోకర్ గాళ్ళకు ఏ మాత్రం ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి అవకాశం దొరికినప్పుడల్లా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీసి, తెరాస పార్టీకి లాభం చేకూర్చే విధంగా బిజెపి వారి చర్యలు ఉన్నాయని ఈ రెండు పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటు చూసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరంగల్ పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బలం లేని బిజెపి ఆ స్థానంలో పట్టుబట్టి పోటి చేసి ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో బిజెపి తో స్నేహం చేసి, ఆ పార్టీని నెత్తిన ఎక్కించుకున్న తెదేపా ఇప్పటికే నడుం లోతు బురదలో కూరుకు పోయింది, ఇంకా ఇదే విధంగా మోస్తూ పొతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్రంలో భూస్థాపితం కాక తప్పదని తెదేపా వర్గాలు తమ బాధను వెళ్లగక్కుతున్నారు.
ఏదేమైనా... బిజెపి లో కిషన్ రెడ్డి, తెదేపా లో సుజనా చౌదరి వంటి మ్యాచ్ ఫిక్సింగ్ గాళ్ళు ఉన్నంత వరకు తెలంగాణాలో, గ్రేటర్ హైదరాబాద్ లో తెరాస కారు జోరు... నల్లేరుపై నడకే!