గతంలో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి, లోక్ సత్తా పార్టీకి కుదిరిన చీకటి ఒప్పందం లాంటిదే ఇదీ అంటున్నారు. 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డికి అమ్ముడుపోయిన జయప్రకాశ్ నారాయణ్ ఆంధ్ర ప్రాంతం లో, హైదరాబాద్ సిటిలో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఓటర్లలో చీలిక తెచ్చే విధంగా తన పార్టీ తరుపున అభ్యర్ధులను నిలబెట్టి కనీసం 21 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు అతి తక్కువ తేడాతో ఓడిపోవటానికి, కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలుపుకోవటానికి కారణభూతుడైన విషయం అందరికి తెలిసిందే!
వారం రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైకాపా తెరాస పార్టీకి అమ్ముడుపోయి తాము గెలిచే బలం లేదని తెలిసి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధికి మద్దతిచ్చి తెరాస పార్టీని ఓడించకుండా, తమ అభ్యర్ధిని నిలబెట్టి ప్రతిపక్షాల ఓట్ల చీలికతో తెరాస అభ్యర్ధి అతి తక్కువ ఓట్లతో గెలుపొండటానికి కారణమైంది.
ఖమ్మం ఎమ్మెల్సి ఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పరేషన్ ఎన్నికల్లో తెరాస, వైకాపా పార్టీల మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం జగన్ ఆర్ధికంగా బాగానే లబ్ది పొందాడట. నిధుల లేమితో సతతమౌతున్న వైకాపా ఈ చీకటి ఒప్పందాలతో చేకూరిన సొమ్ముతో ఆంధ్ర ప్రదేశ్ లో మరల ఉద్యమాలకు సిద్ధమౌతుందట.
మొత్తానికి.. ప్రజారాజ్యం పార్టీని అమ్ముకుని చిరంజీవి, లోక్ సత్తా పార్టీని అడ్డం పెట్టుకుని జయప్రకాష్ నారాయణ్, వైకాపా పార్టీని తెలంగాణాలో తాకట్టు పెట్టి జగన్.. రాజకీయాలని వ్యభిచారం కంటే నీచమైన స్థితికి దిగజార్చారు. బహిరంగంగా ఏ పార్టీతో, ఎవరు పొత్తు పెట్టుకున్నా తప్పులేదు కానీ ఈ రకమైన లోపాయకారీ ఒప్పందాలు, చీకటి పొత్తులు రాజకీయ విలువలను భ్రష్టు పట్టిస్తున్నాయి.