చనిపోయిన రోహిత్ అమాయక దళిత విద్యార్ధి అంటూ, అగ్ర వర్ణాల వారి దురహంకారానికి, ఎబివిపి, బిజెపి నాయకుల కుట్రలకు, విసి అన్యాయానికి బలైపోయాడని మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. చర్చా గోస్టులు జరిగాయి. బిజెపి కేంద్రమంత్రులను, యునివర్సిటీ వైస్ చాన్సలర్ పై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలంటూ దళిత నాయకులమంటూ చెప్పుకునే కొందరు చీడపురుగులు, శవాలపై పేలాలు ఏరుకునే కొందరు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు.
దళితుడిదైనా, మరే కులం వారిదైనా ప్రాణం ప్రాణమే, దళితుడి ప్రాణానికే తప్ప మరే ఇతర కులం వారి ప్రాణాలకు విలువ లేదా? ఒక విద్యార్ధి కానీ, మరెవరైనా కానీ ఏ కారణం చేతనైనా మరణించినప్పుడు మీడియాలో అతని కులానికి అతిగా ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాలను రెచ్చగొట్టే విధంగా వార్తలు ప్రసారం చేయటం, ప్రచురించటం ఏ రకమైన న్యాయం?
కొన్ని నిజాలు:
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ దళితుడు అనే విషయం పచ్చి అబద్ధం, అతని తండ్రి వడ్డెర (బిసి) కులానికి చెందిన వాడు. అతను ఆత్మహత్య చేసుకోవటానికి ప్రధాన కారణం తన తల్లి తండ్రులకు తెలియకుండా కొందరు అంబేద్కరీయుల అతివాద భావజాలానికి ఆకర్షితుడై అనవసర గొడవల్లో తలదూర్చి తదనంతర పరిణామాల్లో యునివర్సిటీ నుండి, హాస్టల్ నుండి సస్పెండ్ అయ్యి, తన చదువు పాడుచేసుకుని తల్లితండ్రుల అశలు తీర్చలేకపోతున్నాననే మానసిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషయం మరణానికి ముందు అతను రాసుకున్న లెటర్ చదివిన ఏ మానసిక విశ్లేషకుడికైనా ఇట్టే అర్ధం అవుతుంది.
నిజా నిజాలు ఇలా ఉంటే అతని ఆత్మహత్య వెనుక గల కారణాలు అంటూ వందలాది అబద్ధాలు ప్రచారమయ్యాయి.
* అతను అమయాకుడు, యూనివర్సిటీ విద్యార్ధుల మధ్య జరిగిన గొడవల్లో అతనికి ఏమి సంబంధం లేదని చెప్పటం ఇంకో పచ్చి అబద్ధం. నిన్న లీకైన ఒక వీడియోలో అతని నిజ స్వరూపం బయటపడింది. అతని తీవ్రవాద, మత విద్వేష భావాలు బయటపడ్డాయి. కాషాయం రంగు కనపడితే తాను సహించలేనన్నాడు, తాను హిందువులకు, ఆరెసెస్స్ వారికి వ్యతిరేకినని కాషాయ రంగు కనపడితే చించివేస్తానని బహిరంగంగా చెప్పాడు
* దేశద్రోహి యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా యునివర్సిటీ ఆవరణలో నిరసన చేపట్టిన బృందానికి అతనే నాయకుడని నిజ నిర్ధారణలో తేలింది. దేశ ద్రోహులకు మద్దతిస్తూ, భారత న్యాయ వ్యవస్థను కించపరచటం, భారత దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించటం దేశద్రోహం కిందకు వస్తుందనే విషయం వీళ్ళకు తెలియదా?
* విశ్వవిద్యాలయాల్లో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేసినందుకు, దేశద్రోహులకు మద్దతిచ్చే విధంగా ప్రసంగాలు చేసినందుకు అడ్డుచెప్పినందుకు ఎబివిపి విద్యార్ధి సుశీల్ ను రోహిత్ బృందం చావ బాదటం నిజం కాదా?
* యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఈ ఘర్షణలో గాయపడిన విద్యార్ధి పిర్యాదుపై యూనివర్సిటీ అధికారులు ఏ చర్యలు తీసుకొని పక్షంలో ఆ విద్యార్ధి తల్లి కోర్టును ఆశ్రయించినప్పుడే యూనివర్సిటీ అధికారులు మేల్కొని విచారణ సంఘం ఏర్పాటుచేసి నిందితులను గుర్తించటం వాస్తవం కాదా?
* నిందితులుగా నిర్ధారణ అయిన వారిపై కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవటమే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చేసిన నేరమా?
* ఒక భాదితుడికి న్యాయం చేయమని, యూనివర్సిటీలో సంఘ, దేశ విద్రోహ చర్యలను అరికట్టేవిధంగా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని, కేంద్రమంత్రులు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కు లెటర్ వ్రాయటం తప్పా? ఎవడో సంఘ, దేశ విద్రోహ శక్తి ఆత్మహత్య చేసుకుంటే దానికి వీరందరూ భాద్యులు అవుతారా, ఇదేమి న్యాయం?
* ప్రభుత్వాల చేతకాని తనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఎందరో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తమ చావుకు ప్రభుత్వం, పాలకులే కారణమంటూ లెటర్స్ రాసి మరణిస్తున్నారు, మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటున్నారా! కేసులు పెడుతున్నారా? మీడియా వారి దృష్టికి ఈ విషయాలు రావటంలేదా! లేక ఆ వార్తలు కవర్ చేసినా తమ చానల్స్ రేటింగ్ పెరగదనే నిర్లక్ష్యమా? పేద రైతులంటే రాజకీయ నాయకులకు, మీడియాకు చిన్న చూపా?
* ప్రభుత్వ ఉపకార వేతనాలతో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తూ అవే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చేయటం, హింసను ప్రేరేపించటం చట్టబద్దమేనా?
* కోటి ఆశలతో ఉన్నత ఆశయాలతో విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెడుతున్న విద్యార్ధులను తీవ్రవాదం వైపు రెచ్చగొట్టి వారి విద్యార్ధి జీవితాన్ని, భవిష్యత్తును బలిగొంటున్న కుల, మత సంఘాలకు, ఆ సంఘాల నాయకులకు ఏ శిక్ష విధించాలి?
* భావ ప్రకటన స్వేఛ్చ అంటే ఇతర కులాల వారిని, మతాల వారిని విమర్శించటం, వారి ఆస్థులను ధ్వంసం చేయటమేనా?
* ఈ దేశంలో హిందువులకు, దళితేతరులకు హక్కులు, భావ ప్రకటన స్వేఛ్చ ఉండదా?
* ఈ దేశంలో హిందువులపై, భారత దేశ సార్వభౌమాధికారంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా చట్టాలు, కోర్టులు పట్టించుకోవా? కనీసం రాజకీయనాయకులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఖండించలేరా?
* అసత్యాలు ప్రచారం చేస్తూ, కొన్ని వర్గాలను రెచ్చగొడుతూ వారిని కొందరు వ్యక్తులపై, కొన్ని వర్గాలపై దాడులు చేసే విధంగా పురికొల్పుతున్న మీడియా, రాజకీయనాయకులపై ఏరకమైన చర్యలు తీసుకోవాలో, ఏవిధమైన శిక్షలు వేయాలో కోర్టులే స్పందించి నిర్ణయం తీసుకొవాలి!!