ఆకలేసి చిన్న దొంగతనం చేసిన సామాన్యుడిని జైల్లోవేసి మక్కేలిరగదీసే పోలీసులు సైతం రౌడీలు, ఘరానా రాజకీయ నాయకులను చూసి భయపదతారు. ఇటువంటి పరిస్థితి కేవలం మన భారత దేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలోనే ఉంది.
గతంలో దేశం కోసం, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులు అరెస్ట్ అయ్యి జైళ్లకు వెళ్ళేవారు. వారికి ఎటువంటి సౌకర్యాలు కాని, బెయిల్ కాని లభించేవి కావు. కానీ ఇప్పుడు మోసగాళ్ళు, రౌడీలు, ఖూని కోరులు, హంతకులకు హాస్పటళ్ళలో, జైళ్లలో రాజభోగాలు లభిస్తున్నాయి, వెంటనే బెయిల్ పైన బయటికు వచ్చి దర్జాగా దందాలు కొనసాగిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఒక దాడి కేసులో అరెస్ట్ అయిన రౌడి షీటర్ భూమా నాగిరెడ్డి, హత్య కేసులో అరెస్ట్ అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇదే విధంగా నటించారు. ఇకనైనా మన దేశంలో కొన్ని చట్టాలను మార్చి ఇటువంటి వారికి దొంగ కారణాలతో హాస్పటల్లో ఉంచి దొంగ వైద్యం చేయించటం, జైళ్లలో రాజభోగాలు కల్పించటం అరికట్టాలి. ఈ విషయంలో కోర్టులు, న్యాయమూర్తులు కూడా అలోచించి కఠిన నిర్ణయాలు తీసుకొవాలి.