బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు కానీ వైకాపా తరుపున కానీ, జగన్ కానీ తమ స్పందన తెలియచేయలేదు. పైగా వైకాపా ఎంపిలు ఈ మధ్య సందు దొరికినప్పుడల్లా భాజపాను, మోడిని, వెంకయ్య నాయుడును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదే సమయంలో విభజనల హామీలు సాధించుకోలేకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అసమర్ధతే అంటూ అసంబద్ధ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీ పొత్తుకు బీటలు వారి బిజెపి, తెరాస పార్టీల పొత్తుకు బీజం పడిందంటున్నారు. బిజెపి పార్టీ వెలమ నాయకుడు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే జగన్ తొత్తు, బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి ఈ ప్రయత్నంలో సఫలీకృతం అయినట్లే కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
వచ్చే ఎన్నికల్లో భాజాపాకు 225 అసెంబ్లీ స్థానాల్లో 65 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో 8 స్థానాలు ఇస్తానని జగన్ ఈ మధ్య డిల్లీ వెళ్ళినప్పుడు భాజపా నాయకులకు బేరం పెట్టాడట. చిన్నమ్మ పురందేశ్వరికి నరసరావుపేట, కావూరికి ఏలూరు, కన్నా లక్ష్మినారాయణకు గుంటూరు, దాసరి నారాయణరావుకు నర్సాపురం, ముద్రగడ పద్మనాభానికి కాకినాడ పార్లమెంటు స్థానాలు జగన్ ఆఫర్ చేశాడట.
ఈ ప్రతిపాదన తెగ నచ్చేసిన చిన్నమ్మ ఆ మరుసటి రోజు నుండే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడుపై పై తన మాటల దాడి మొదలెట్టి ఇప్పటినుండే జగన్ ఋణం తీర్చుకోటానికి తహ తహలాడుతుందట. తనకు అవకాశం వస్తే ఏ పార్టీలో నైనా చేరటానికి కానీ, ఏ పార్టీ కైనా చెయ్యివ్వటానికి బిడియ పడని చిన్నమ్మ కొత్త పాత్రలో జీవించటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందట. త్వరలోనే కావూరి, కన్నా, దాసరి నారాయణరావు మొదలైన వారు కూడా ముద్రగడ పద్మనాభంతో జత కలిసి తెదేపా కు వ్యతిరేకంగా రంగంలోకి దిగవచ్చని అంచనా వేస్తున్నారు.