నాగార్జున కాని, ఆయన కుటుంబంలో వారు కాని, వాళ్ళ ఇంట్లో కాని, అన్నపూర్ణ స్టూడియో కాని 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం ముందు కాని, ఆ తరువాత కాని ఏనాడైనా చీపురు పట్టి శుభ్రం చేసారా? ఇంట్లో ఇద్దరు పనిమనుషులు లేనిదే వీళ్ళకి రోజు గడవదు కాని మీడియా కవరేజ్ ఉందంటే మాత్రం కెమెరా ముందు ఓవర్ ఏక్షన్ చెస్తారు.
గురుకుల్ ట్రస్ట్ భూమిలోని తుమ్మిడి కుంట చెరువు శిఖంలో కొంత భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుని కన్వెన్షన్ సెంటర్ నిర్మించుకున్న కబ్జాకోరు నాగార్జున ఆ తరువాత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి కుల్చివేతలకు ఉపక్రమించటంతో, కోర్టుకు వెళ్ళినా ప్రయోజనం లేకపోవటంతొ ఆ భాగాన్ని కూలగొట్టాడు. దొరికితే దొంగ లేకపోతే దొరలాగా ప్రవర్తించే నాగార్జున 'స్వచ్చ భారత్' గురించి ప్రజలకు తెలియ చేస్తాడా?
పబ్లిసిటీ కోసం నిజ జీవితంలో కూడా నటించే ఇటువంటి వాళ్లకు మీడియా అనవసరంగా అతిగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎవడింట్లో చెత్త, వాడు ఊడ్చుకోనేవాళ్ళకి కాకుండా, కనీసం వారానికి ఒకసారైనా పరిసర ప్రాంతాలు, పబ్లిక్ ప్లేసెస్ శుభ్రం చేసే వారికి మాత్రమే మీడియాలో ప్రచారం కల్పిస్తే ప్రజల్లో స్పూర్తి కలుగుతుంది.
ఈ విషయంలో వర్ధమాన సినీనటుడు రామ్ కొంత నయం, ఈయన గత గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేశారు. పాఠశాలకు వెళ్లే రహదారిలోని చెత్తాచెదారాన్ని తొలగించారు.
నోట్: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నాగార్జున ప్రారంభించాడని చెబుతున్న వెబ్ సైట్లు www.nagforswachhbharat.com, www.nagforswachbharat.com గూగుల్ సెర్చ్ లో యెంత వెదికినా కన్పించటం లెదు.