వైఎస్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్ లు, పారిశ్రామిక వేత్తలు, న్యాయవాదులు ఇలా అందరూ కెవిపి అనుమతితోనే ముఖ్యమంత్రిని కలిసేవారని, ఏ డీలైనా కెవిపి కనుసన్నుల్లోనే జరిగేవనేది అందరి నోట వినబడే మాట! అదే విషయం వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు తన వాంగ్మూలాన్ని సీబీఐ విచారణలో చెప్పాడు.
వై.యస్.ఆర్ అవినీతిలో, అక్రమాల్లో కొంత వాటా కె.వి.పి రామచంద్ర రావుదే అనే విషయం అందరికి తెలిసిన బహిరంగ సత్యమే! వై.యస్.ఆర్ కు 'వసూళ్ళ బ్రోకర్' కె.వి.పి రామచంద్ర రావు, ఆ వసూళ్ళలో కొంత భాగం అధిష్టానంలో భాగమైన 'వీరప్ప మొయిలి', దిగ్విజయ్ సింగ్' 'గులాం నబి ఆజాద్', సోనియా గాంధీ' లకు అందజేసే నమ్మకమైన భాద్యతను కూడా ఈయన నిర్వర్తించాడు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 'రాజ్య సభ' సీటు కట్టబెట్టింది.
వై.యస్.ఆర్ లంచాలు, వసూళ్ళ భాగోతం లెక్కలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి కె.వి.పి రామచంద్ర రావు ఒక్కడే, ప్రస్తుతం వై.యస్.ఆర్ బ్రతికి లేడు కనుక అతని అవినీతి భాగోతం వివరాలు కె.వి.పి రామచంద్ర రావును సిబిఐ విచారణ చేస్తే బయట పడేవి కాని, కె.వి.పి రామచంద్ర రావు తన దగ్గర ఉన్న వై.యస్.ఆర్ అవినీతి సోమ్ముల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తుల వాటాల చిట్టా వివరాలతో గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని 'బ్లాక్ మెయిల్' చేసి, తద్వారా సిబిఐ విచారణ నుండి తప్పించుకుని దర్జాగా తిరిగాడు.
వై.యస్ అవినీతి సొమ్ము అనుభవిస్తున్న వారిలో 'గజ దొంగ' జగన్ ఐతే, 'దర్జా దొంగ' కె.వి.పి రామచంద్ర రావు, ఈ పాపంలో 'జగన్' వాటా యెంత, కె.వి.పి రామచంద్ర రావు, ఆయన బంధువుల వాటా యెంత అనే విషయం సిబిఐ సమూలంగా దర్యాప్తు చేసి తన నిజాయితీని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వైయస్ మరణంలో ప్రజా రక్షణ సలహా సంఘం ( పి. పి. ఏ.) ఛైర్మన్గా పనిచేసిన కె. వి. పి. రామచంద్రరావు పాత్ర మీద కూడా విచారణ జరిపించాలి.
ఇప్పటికే జగన్, వైఎస్ కేబినేట్ లో కొందరు మంత్రులు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు జైలు శిక్ష అనుభవించి, బెయిలుపై బయట ఉన్నారు. మరికొందరు జైలుకు వెళ్లడానికి రెడీగా ఉన్నారు.
కె.వి.పి రామచంద్ర రావు వియ్యంకుడు ఆయన అండతో, దోచిన డబ్బుతో, అతి కొద్ది కాలంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగిన రఘురామ కృష్ణంరాజు మాజీ CBCID జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ లిస్టు లీకేజీ వ్యవహారంలో కేసు బుక్ అయినా కాంగ్రెస్ పార్టీ, కె.వి.పి చలవతో బయటపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని వాడుకున్న ఈ ఇద్దరు దొంగలు భవిష్యత్తులో రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని గ్రహించి ముందుగా ఒక పధకం ప్రకారం రఘురామ కృష్ణంరాజు జగన్ పంచన YSRCP పార్టీలో చేరాడు. కానీ మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం ఈ సారి కేంద్రంలో తెలుగుదేశం, బిజెపి అలయన్సు కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే అంచనాతో మళ్లీ బిజెపి పార్టీలోకి జంప్ చేశాడు.
CBCID, CBI కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కనుక బిజెపి పార్టీలో ఉంటే భవిష్యత్తులో తను, తన వియ్యంకుడు కేసుల గొడవలనుండి బయట పడవచ్చుననే భారీ ప్రణాళికలో భాగంగా తెలుగుదేశం పార్టీకి, బిజెపి పార్టీకి భారీగా విరాళం ఇచ్చి బిజెపి నుండి గాని, టిడిపి నుండి గాని నర్సాపురం పార్లమెంట్ నుండి యంపి గా లోక్ సభకు పోటి చేద్దామనుకున్నాడు కానీ, అదృష్టం కలిసిరాలేదు.
టైటానియం కుంభకోణం ముడుపుల కేసులో కేవీపీ అరెస్టుకు గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడ్డుచక్రం వేసి అడ్డగోలు వాదనలు చేసి, ఒక పధ్ధతి ప్రకారం తాత్కాలికంగా ఒడ్డున పడవేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ కేవీపీపై అభియోగాలు నమోదు చేసి ఇంటర్పోల్ ద్వారా ఆయన ప్రొవిజనల్ అరెస్టుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెడ్ నోటీసులో సాంకేతిక అంశాలను ఎత్తిచూపుతూ అరెస్ట్లో జాప్యం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కానీ అభియోగాలు నిరుపితమైతే మాత్రం 20 సంవత్సరాలు మాత్రం శిక్ష ఖాయం.
వై.యస్.ఆర్ అవినీతి, అక్రమాలు వెలికి తీయటంలో, అందులో జగన్ పాత్రపై ఆధారాలు సేకరించటంలో సమర్ధవంతంగా పని చేస్తున్న సిబిఐ, కె.వి.పి రామచంద్ర రావు విషయంలో తన విచారణ మరింత వేగవంతం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవాలి. వెంకయ్య నాయుడు కాని, నరేంద్ర మోడీ కాని ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా సిబిఐ విచారణ వెంటనే తిరిగి ప్రారంభించి, వేగంగా తీర్పు వచ్చేలా చేసి నేరస్థులకు వెంటనే శిక్షలు పడేలా చూసి తమ నిజాయితిని నిలబెట్టుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు.