విజయనగరంలో జిల్లాలో పార్టీ భాధ్యుడు గత ఎన్నికల్లో ఎంతో డబ్బు ఖర్చుచేసి ఓడిపోయిన కోలగట్ల వీరభద్ర స్వామి పార్టీ ఖర్చుల భారం భరించలేనని.. కావాలంటే ఇంకెవరికైనా భాద్యతలు అప్పగించుకోవచ్చని నిక్కచ్చిగా అధిష్టానికి చెప్పేశాడు. సుజయ కృష్ణ రంగారావు ఎప్పటిలానే గెలిచిన దగ్గర నుండి తన స్వంత పనులు చూసుకుంటున్నాడు తప్ప పార్టీ గురించి పట్టించుకోవటం లేదు... మిగిలిన ఇద్దరు శాసనసభ్యులు పార్టీని నడపగలిగిన సామర్ధ్యం లేనివారే!
శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితి కొంతలో కొంత నయం.. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉండి.. తన నిర్ణయాల మూలంగా జగన్ కు అనుచితమైన లబ్ధి చేకూర్చాడనే ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్న ధర్మాన ప్రసాదరావు జగన్ ను వదలి వెళ్ళలేని పరిస్థితి.. మంత్రిగా ఉన్నప్పుడు వెనకేసుకున్న అక్రమాస్థులు దండిగా ఉన్నందువలన ఈయనకు పార్టీని పోషించటం పెద్ద కష్టంగా కనిపించటం లేదు... ఒకవేళ తన రాజకీయ ప్రత్యర్ధులు కింజరాపు కుటుంబాన్ని ఎదుర్కోవటానికి బిజెపి లోకి వెళ్దామన్నా అక్కడ ప్రవేశం లేదని ముందుగానే తెలిసిపోవటంతో ప్రస్తుతం ఇష్టమున్నా లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్వశక్తులు ఒగ్గి పార్టీ కోసం పనిచేస్తున్నాడు... ఇతర శాసనసభ్యులు కంబాల జోగులు, కళావతి తెదేపా వారితో టచ్ లో ఉన్నట్టు సమాచారం.
తూర్పు గోదావరి జిల్లలో పార్టీ భాధ్యుడు జ్యోతుల నెహ్రు ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు... పార్టీని ఆర్ధికంగా పోషించే స్థోమత కలిగిన వారు పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.. వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ వారితో టచ్ లో ఉన్నాడు... గత ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు వెదజల్లిన బొడ్డు భాస్కర రామారావు, చలమలశెట్టి సునీల్ తమ వ్యాపారాల్లో మునిగి పార్టీని పూర్తిగా పట్టించుకోవటం మానివేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల ఫలితాలతో ఖంగుతిన్న పార్టీ నాయకులు ఇంకా ఆ షాక్ నుండి కోలుకుంటున్నట్లు కనిపించటం లెదు. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుండి పోటీచేసి ఓడిపోయిన పార్ట్ టైం రాజకీయ నాయకుడు తోట చంద్రశేఖర్ అడ్రస్ ఎక్కడో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేక పొయారు. ఈ జిల్లాలో పార్టీ భాద్యుడు ఆళ్ళ నాని మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నా, అతనికి మిగిలిన వారి నుండి పెద్దగా సహకారం అందటంలేదు. ఈ జిల్లాలో ఇప్పుడిప్పుడే పార్టీ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కన్పించటం లేదు.
కృష్ణా జిల్లాలో పార్టీకి ఇద్దరు భాద్యులున్నారు.. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, మచిలీపట్టణం పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పార్ధసారధి.. వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారే విడి విడిగా చేసుకుంటున్నారు.. వీరిని సమన్యయం చేయటం జగన్ వల్ల కూడా కాలేదు.. గత ఎన్నికల్లో ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి విపరీతంగా డబ్బులు ఖర్చుచేసి గెలిచిన కొడాలి నాని ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది... పార్టీ ఖర్చులు భరించటం కోసమే గతంలో మంత్రిగా చేసి అవినీతితో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న పార్ధసారధికి పార్టీ భాద్యతలు అప్పచెప్పారు. గెలిచిన వెంటనే తెదేపా లో చేరదామనుకున్న కొడాలి నానికి, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా అభ్యంతరం చెప్పటంతో చచ్చినట్లు అదే పార్టీలో కొనసాగుతున్నాడు.. తిరువూరు, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వారితో టచ్ లో ఉన్నారు... విజయవాడ పార్లమెంట్ నుండి పోటి చేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్ తన మాజీ స్నేహితుడు చంద్రబాబు నాయుడి పంచన చేరాడని తెలుస్తుంది. కింది స్థాయి కార్యకర్తలు తెలుగుదేశం, బిజెపి పార్టీల్లోకి సర్దుకుంటున్నారు..
గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయిన బాలసౌరి, అయోధ్య రామిరెడ్డి తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు.. మంగళగిరి, మాచెర్ల శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి ద్వయం మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యహరిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాలలో తప్ప మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జిల్లా పార్టీ బాధ్యుడు మర్రి రాజశేఖర్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ధాటికి పూర్తిగా వెనుకబడ్డాడు...
ప్రకాశం జిల్లాలో పార్టీ భాద్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి పార్టీ భారాన్ని మోస్తున్నారు. ఇద్దరు ఆర్ధికంగా బలవంతులే కావటంతో పార్టీ కార్యకలాపాలు చురుగ్గానే కొనసాగుతున్నా, మిగిలిన శాసనసభ్యుల సహకారం, ప్రజా స్పందన కరువైంది. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించటం లేదు. ఒకరిద్దరు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోటానికి సిద్ధంగా ఉన్నాకాని ఆ పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ అందలేదని తెలిసింది.
కోస్తా జిల్లాల్లో వైకాపా ఎక్కువ స్థానాలు గెల్చుకున్న నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుంది.. గతఎన్నికల్లో పార్టీలో అన్నీ తానై వ్యహరించిన కాంట్రాక్టర్ కం పోలిటిషియన్ మేకపాటి రాజమోహనరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ జిల్లాకు చెందిన భాజపా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు దగ్గరయ్యారు. నెల్లూరు పట్టణ మేయర్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చేసుకున్నాడు. ఈ జిల్లలో శాసనసభ్యులు శ్రీధరరెడ్డి, గోవర్ధనరెడ్డి మాత్రమే పార్టీ కార్యకలాపాల్లో చురుగా వ్యవహరిస్తున్నారు.. ఈ జిల్లాలో కనీసం ముగ్గురు శాసనసభ్యులు మంచి ముహూర్తం చూసుకుని తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు...
చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ అంశంలో తానిచ్చిన హామీ అమలుచేయలేడని, ఆ పరిణామం తమకు లాభిస్తుందని ఆశించి భంగపడిన జగన్ ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళిపోయాడు.. ఏతా.. వాతా... చూస్తే జగన్ జైల్లోకి వెళ్ళటమే తరువాయి కోస్తా జిల్లాల్లో సగం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించి భారీగా ఖర్చు చేసి చేతులుకాల్చుకున్న వాళ్ళు పార్టీకి దూరంగా ఉండటంతో జగన్ కార్యక్రమాలకు గతంలోలాగా జనాన్ని తరలించే ఏర్పాట్లు జరగటం లేదు.. పనీపాట లేకుండా జగన్ చేసే ధర్నాలకు ప్రజా స్పందన కరువైంది. జగన్ కు ఇక 'ముందున్నది ముసళ్ళ పండుగే!'.