తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గంలోని 12 మంది మంత్రులలో ముగ్గురు వెలమ (మొత్తం కెసిఆర్ కుటుంబం లోనివారే) నలుగురు రెడ్డి వర్గానికి చెందిన వారు.. తెలంగాణా జనాభాలో కేవలం 15% ఉన్న ఈ రెండు కులాల వారు 60% పదవులు దక్కించుకున్నారు. ప్రధాన శాఖలు తన కుటుంబం వద్ద ఉంచుకొని, కొన్ని ముఖ్యమైన శాఖలు రెడ్డి వర్గానికిచ్చి మిగిలిన ఇదు అప్రధాన శాఖలు ముస్లిం, మున్నూరు కాపు, మాదిగ, ముదిరాజ్, గౌడ వర్గాలకు కేటాయించి తెలంగాణలో బలమైన మాల, యాదవ, విశ్వ బ్రాహ్మణ, బ్రాహ్మణ, పద్మసాలి కులాల వారికి మొండి చెయ్యి చూపాడు. వీరికి కనీసం ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు, ఈ వర్గాలవారు తెలంగాణా రాష్ట్ర జనాభాలో వెలమల కంటే ఇదు రెట్లు ఎక్కువగా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో 20 మంది మంత్రులుకు గాను కమ్మ, రెడ్డి కులాలవారు ఏడుగురు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న కమ్మ, కాపు, రెడ్డి కులాలవారికి దామాషా పధ్ధతి ప్రకారం 50 శాతం పదవులే దక్కాయి.
మంత్రివర్గంలో రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా మిగిలిన విషయాల్లో రెడ్డి వర్గం వారి ఆర్ధిక మూలాలపైన దెబ్బకొట్టే ప్రయత్నం కెసిఆర్ మొదలు పెట్టాడు... ఇందులో భాగంగా రెడ్డి కులం వారికి చెందిన 147 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు రద్దు చేసాడు.. ప్రతిపక్షానికి చెందిన ఆ వర్గం శాసనసభ్యులపైన అదిరించో.. బెదిరించో తన వైపుకు తిప్పుకొనే వ్యూహం ప్రయోగించి పెద్దగా సఫలం కాలేక పోయాడు.. కేవలం తీగల కృష్ణ రెడ్డి, ధర్మారెడ్డి లను మాత్రమె తన వైపు తిప్పుకోగలిగాడు. కెసిఆర్ చేష్టలు గతంలో గడీల్లో దొరలు సాగించిన నిరంకుశ, దుర్మార్ఘపు పోకడలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో జనాభాలో వెలమల కంటే మూడు రెట్లు అధిక జనాభా కలిగిన రెడ్డి వర్గం వారు కెసిఆర్ పోకడలతో విసుగెత్తిపొతున్నారు. పార్టీలకు అతీతంగా కెసిఆర్ ను ఎదుర్కోవటానికి సిద్ధమౌతున్నారు, ఆ ప్రయత్నంలో భాగంగా కెసిఆర్ ను గట్టిగా ఎదుర్కొంటున్న రేవంత రెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ మద్దతును తెలియచేయటానికి సిద్ధంగా ఉన్నారు. తమ వర్గానికి చెందిన కొందరు నాయకులు అధికారం అనుభవించటం కోసం తెరాస పార్టీలో ఉన్నాకాని, తమ వర్గం ప్రజలు మాత్రం చంద్రశేఖరావు పోకడలకు వ్యతిరేకంగా ఇక్యమౌతున్నారని.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుండే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని మరల తెలంగాణా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా తెరాస పార్టీలో అన్యాయం జరిగిన మున్నూరు కాపు, యాదవ, మాల మొదలైన వర్గాలను కూడా దగ్గరకు చేర్చుకొనే యత్నం చేస్తున్నారు. గతంలో రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ కులాలవారికి మంత్రి వర్గంలో మంచి ప్రాధాన్యత లభించింది. ఈ కులాలవారికి కెసిఆర్ పైన లోలోపల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది.
కొత్త రాష్ట్రంలో కెసిఆర్ పైన అసంతృప్తి ఉన్న వర్గాలవారు ఇంతవరకు బహిరంగా బయటపడటంలేదు. ఇప్పటికే, రైతుల్లో, విద్యార్ధుల్లో అసంతృప్తి మొదలైంది.. ఒక ఉద్యోగస్తులు తప్ప మరే వర్గం వారు ఈ ప్రభుత్వం పైన సంతృప్తిగా లేరు. కెసిఆర్ ను విమర్శిస్తే, తెలంగాణా ప్రజలను అవమానించినట్లే అని.. వారు తెలంగాణా ద్రోహులు అనే ప్రచారంతో కెసిఆర్ తన వ్యతిరేకుల నోళ్ళు మూయిస్తున్నాడు.. ఈ ప్రచారం ఇంకొంత కాలం కొనసాగవచ్చు... ఇప్పటికిప్పుడు తెరాస ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేకపోయినా, ఇంకో ఐదారు నెలలు గడిస్తే కాని కెసిఆర్ కు స్వపక్షంలో, విపక్షంలో అసంతృప్తుల సెగ తగలవచ్చు. కెసిఆర్ దొరహంకార పోకడలు ఇదే విధంగా కొనసాగితే మారుతున్న కుల సమీకరణాలు కెసిఆర్ నాయకత్వానికి పెను సవాలుగా మారవచ్చు.