రైల్వే బడ్జెట్ లో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్ధిక బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు పూర్తి అన్యాయమే జరిగింది. అప్పటి వరకు కొంచెం సంయమనం పాటించిన తెలుగుదేశం శ్రేణులు, చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఓర్పు నశించి బిజెపి వాగ్దాన భంగంపై విరుచుకు పడ్డారు. చాలా లేటుగా నైనా కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ఘాటుగా స్పందించారు. అశోక గజపతి రాజు లాంటి వారైతే మంత్రి పదవికి రాజీనామాకు కూడా సిద్ధపడ్డారని వినికిడి.
ఇప్పటికి కేంద్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి న్యాయం జరగని పక్షంలో తెదేపా, భాజపా ల మధ్య అంతరం మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కుటిల రాజకీయాలకు మారుపేరైన భాజపా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా బద్ధ శత్రువులైన తెరాస, వైకాపా లను చేరదీసే తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో బిజెపి, మోడీ పట్ల కెసిఆర్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది, మోడీ ప్రభుత్వాన్ని పొగడటంలో, ఆయనకు దగ్గరవటంలో ఎంతో చొరవ చూపిస్తున్నాడు. దీనికి తగ్గట్టే తెలంగాణాకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే కెసిఆర్ కుటుంబానికి కూడా కొన్ని తాయిలాలు అందుతాయని తెలియవస్తుంది.
"రోమ్ నగరం తగలబడి పోతుంటే ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి " లా ఉంది జగన్ వ్యవహారం. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా, రాజధానికి భూములిచ్చిన రైతుల దగ్గరకు వెళ్లి వారిని రెచ్చ గొట్టే నీచ రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా చక్కదిద్దుకుని, తన కేసుల నుండి బయట పడే మార్గం కోసం భాజపా విషయంలో మౌనమే తన భాషగా ఎంచుకుని మోడీ దృష్టిలో 'రాముడు మంచి బాలుడు' లా ప్రవర్తిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ కి తోడ్పాటు అందించకుండా ఈ విషయంలో తన స్వప్రయోజనాలకోసం జగన్ మౌనం వహించి కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతు తెలియచేస్తున్నాడు. మౌనంగా ఉండేందుకు జగన్ కు నజరానాలు ఇచ్చేందుకు కొందరు బిజెపి బ్రోకర్ బాబులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని తెలుస్తుంది. తన మౌనం జగన్ కు ప్రయోజనం చేకూర్చినా కానీ, ఆంధ్ర ప్రజల దృష్టిలో మాత్రం అతన్ని దోషిగా నిలబెడుతుంది.
ఈ మార్పులన్నీ సమీప భవిష్యత్తులో భాజపా తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్, జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నాలని అర్ధం అవుతుంది. ఈ ప్రయత్నాలు మోడికి, భాజపా కు లాభం చేకూర్చకపోగా, పూర్తిగా వికటించవచ్చు. మజ్లిస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కెసిఆర్ ను, క్రిస్టియన్ జగన్ తో పొత్తును సంఘ్ పరివార్, ఆరెస్సెస్ ఒప్పుకోకపోవచ్చు. ఇప్పటికే దిల్లీలో ఒంటెద్దు పోకడలతో దెబ్బ తిన్న మోడీ మరో సారి ఆ ప్రయోగాలకు సాహసిస్తాడా?