షరా మాములుగానే ఎవరో రాచ్చిన కొన్ని డైలాగులు వల్లెవేశాడు ... కానీ ఈసారి తన మాటల్లో మరీ ఎక్కువ నాటకీయత, ఆవేశం కనిపించలేదు అది ఒక శుభపరిణామం . పవన్ ప్రసంగం ఈసారి మరీ చప్పగా ఉప్పు, కారం లేని ఆవకాయ పచ్చడిలా ఉంది. గతంలో ప్రజలకు తను చేసిన వాగ్దానాలను ప్రస్తావించకుండా సమకాలీన విషయాలను మాత్రమె ప్రస్తావించాడు.
గతంలో ఆంధ్ర రాజధానికి రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములు సేకరించరాదని, భూసేకరణ చట్టానికి తానూ వ్యతిరేకమని, అవసరమైతే ఈ విషయంలో ఆమరణ దీక్ష చేపట్టటానికి కూడా వెనుకాడనని సినిమా దైలాగులెన్నో చెప్పి ఆ తరువాత ఆ విషయమే మర్చిపోయాడు. ఇప్పుడు అక్కడ రాజధాని భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తికావచ్చింది.
యాదాద్రిలో విజయనగరానికి చెందిన వ్యక్తిని చీఫ్ ఆర్కిటెక్ట్గా నియమించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగుజాతి ఐక్యతకి అడుగు వేశారా అని ఈరోజు పత్రికలు చూస్తుంటే అనిపించిందని, ఇది చాలా మంచి పరిణామం అని ఆయన కెసిఆర్ ను ప్రశంసించారు. తెలంగాణా ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా, ఇదేమైనా గొప్ప విషయమా? ఇదే కెసిఆర్ ఆంధ్రాలో పుట్టి దశాబ్దాల తరబడి తెలంగాణలో పనిచేస్తున్న 1000 మంది విద్యుత్ బోర్డు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా విధులనుండి తొలగించటం పవన్ కళ్యాన్ దృష్టికి రాలేదా? కెసిఆర్ భజన వెనుక హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు, ఫార్మ్ హౌస్ కాపాడుకోవటమే అసలు ఉద్దేశమా?
ఆర్టికల్ 8 గురించి పవన్ కళ్యాన్ కు ఏమి తెలుసు? రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఈ సెక్షన్ ను విభజన బిల్లులో చేర్చినప్పుడు బిజెపి, కెసిఆర్ తో సహా తెలంగాణా నాయకులు కూడా అప్పుడు తమ వ్యతిరేకతను ఏమాత్రం తెలియచేయలేదు.. ఇప్పుడు ఆ సెక్షన్ అమలులో ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్ధం కావటంలేదు. పవన్ కళ్యాణ్ ఆ సెక్షన్ తనకు ఆమోద యోగ్యం కాదని తెలియ చేశాడు... పవన్ కు కాని, కెసిఆర్ కు కాని, తెలంగాణా నాయకులకు కానీ ఆమోదయోగ్యం అయ్యే విధంగా చట్టాలను మార్చటానికి వీలుకాదని ఆయన తెలుసుకొవాలి.
సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్న కెసిఆర్ ను ఈ విషయమై ఆయన ప్రశ్నించలేదు. ఆంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు దిల్లీలో ఉంది తమ వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర ప్రాంత సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదని, ఇలాగైతే తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. మరి జనసేన పార్టీ అధ్యక్షులుగా గత ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతిచ్చి ఎన్నికల్లో గెలిచిన తరువాత మోడీ, వెంకయ్య నాయుడుతో అంట కాగిన మీరేమి చేస్తున్నారు! ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా పై మీరు డిల్లీలో నిరాహారదీక్షలు, ధర్నాలు చెయ్యొచ్చుకదా?
పవన్ కళ్యాణ్ గారూ గత ఎన్నికల ముందు మీరు జనసేన అనే తొక్కలో పార్టీ పెట్టి పొట్లూరి ప్రసాద్ అనే బకరాను 50 కోట్ల రూపాయలకు నాకేశారు. ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం లో మీ పలుకుబడి ఉపయోగించుకుని మీ వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు వద్ద పైరవీ చేసి పసుపులేటి హరిప్రసాద్ కు టిటిడి బోర్డు సభ్యుడు, సోము వీర్రాజుకు యంయల్సి పదవి ఇప్పించుకున్నారు. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఆ తరువాత సంపాదిన్చుకుంటున్నారు, కానీ మీరు మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయకుండా పనులు చక్కబెట్టుకుంటున్నారు, డబ్బు సంపాదిన్చుకుంటున్నారు. ఎంతైనా మీరు గోప్పోరండి.
ఎంతైనా మీరు చాలా తెలివికల వారు.. కర్ర విరగ కుండా పాము చావకుండా స్టేట్మెంట్ ఇచ్చారు... మీ అభిమానులు, ప్రజలే వెర్రిపప్పలు... వెంగళాయిలు.