ఆ తరువాత ప్రకాశం జిల్లా చీమకుర్తి ఇంజనీరింగ్ కాలేజిలో జరిగిన సంఘటనలో ఒక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంటూ రాసుకున్న డైరీలో ఆ కళాశాల నిర్వాహకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి, అతని కొడుకు శివప్రసాద రెడ్డి, కళాశాల అధ్యాపకుడు మాలకొండారెడ్డి తన ఆత్మహత్యకు కారణమని తెలియచేసింది. అవే కారణాలతో పోలీసులు బూచేపల్లి సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డి లను అరెస్ట్ చేసారు.
బివియస్సార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య విషయంలో ఏమాత్రం స్పందించని వైకాపా వైఖరిపై, అధ్యక్షుడు జగన్ రెడ్డి వైఖరిపై ప్రజల్లో, అన్ని వర్గాల్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. వైకాపాలో కమ్మ, కాపు, బిసి వర్గం నాయకులు ఈ విషయంపై జగన్ రెడ్డిని కలిసి ఇప్పుడు పార్టీ తరపున అధ్యక్షుడు సరైన రీతిలో స్పందించని పక్షంలో ప్రజలకు, మిగిలిన వర్గాలవారికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాబట్టి ఈ విషయంలో కూడా బివియస్సార్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అనుమతి రద్దు చేయాలని, బూచేపల్లి సుబ్బారెడ్డి కొడుకు శివప్రసాద రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ పరంగా ఆందోళనలు నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారట. ఆ సలహాకు చిర్రెత్తుకొచ్చిన జగన్ రెడ్డి, ఈ విషయంలో మీరేమి నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి, నాకు నావర్గం ప్రయోజనాలు కూడా ముఖ్యమే అంటూ విరుచుకుపద్దాడట.
అనుకోని పరిణామంతో బిత్తరపోయిన ఆ నాయకులు ఆ తర్వాత తేరుకుని "ఐనా మన పిచ్చికాని మా సారింతే! మారరంతే!!" అని నిట్టూర్పులు విడిచారట. That is Jagan..