ఆ తరువాతే మొదలైంది అసలు కథ... మహారోత తరుపున ఆయన కూతురు యంపి 'తైతక్క' రంగంలోకి దిగి ఆ పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు స్థాపించాలంటే కావలసిన అనుమతులు, భూముల సమీకరణ, పన్ను మినహాయింపు వంటి అంశాలు తాను చూసుకుంటానని, అందుకు ప్రతిఫలంగా తమకు ఆ కంపెనీలో వాటాలు లేదా కొంత మొత్తం ముడుపులు ముట్టచెప్పాలని షరతులు పెట్టిందట. గతంలో మహామేతకు, జలగన్నకు సలహాదారుగా వ్యవహరించిన బ్రోకర్ రెడ్డే ఈవిడకు కూడా ఇటువంటి విషయాల్లో సలహాదారుగా ఉన్నాడట. గతంలో 'మహామెత' విషయంలో 'జలగన్న' విషయంలో దెబ్బలుతిని, తల బొప్పికట్టి "సొమ్మూ పోయే శని పట్టే" అన్న చందంగా ఇప్పటికి కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతున్న పారిశ్రామికవేత్తల విషయం గుర్తుకు తెచ్చుకున్న ఆ పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తు భూతద్దంలో కనపడి హైదరాబాద్ లో పరిశ్రమ స్థాపించాలనే కోరికను విరమించుకుని తిరుగు టపాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సందర్శించుకుని ఆయన సామర్ధ్యం, కృషిపై నమ్మకంతో ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయానికి వస్తున్నారట.
ఈ పరిణామాల ప్రభావమే హైదరాబాద్ కు నిలిచి పోయిన పరిశ్రమలు అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద మహారోత కూతురు 'తైతక్క' తన అత్యాశతో హైదరాబాద్ కు వచ్చిన పారిశ్రామికవేత్తలను హడలుకొట్టి వారిని పలాయనం చిత్తగించె విధంగా ప్రవర్తించి హైదరాబాద్ కు పరిశ్రమలు రాకుండా పరోక్షంగా కారణమైందని తద్వారా తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఆదాయానికి, నిరుద్యోగ యువతకు యెంతో నష్టం కలిగించిందని తెరాస వర్గాలు వాపోతున్నాయి. పరిస్థితులు ఇదే విధంగా ఉంటె తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ యువత తెరాస ప్రభుత్వంపై ఉద్యమించవచ్చని, మరోసారి నక్సలిజం వైపు ఆకర్షితులై తీవ్రవాదం ప్రబలిపోవచ్చని తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.