గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస పార్టీలో చేరి మరల 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చి ఆ ఎన్నికల్లో తెరాస పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకటస్వామి కొడుకులు మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్, మాజీ మంత్రి వినోద్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ సోదరులు తెలంగాణా రాష్ట్రంలో పేరొందిన పారిశ్రామికవేత్తలు, V6 వార్తా ఛానల్ ఈ సోదరులకు సంభందించినదే.
తెలంగాణా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల్లో, నిరుద్యోగుల్లో అశాంతి వంటి సంఘటనలు తక్కువ చేసి చూపిస్తూ, తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా బాకాలు ఊదుతూ తెలంగాణా చానల్స్ అన్ని ప్రస్తుతం కెసిఆర్ భజన చేస్తున్నాయి, కెసిఆర్ పోకడలను వ్యతిరేకించే ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి చానళ్లను తెలంగాణలో బాన్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా ఉన్న V6 చానల్ ను కూడా తన వైపు తిప్పుకోగలిగితే తమకు తిరుగుండదని తలచిన కెసిఆర్ అందుకు ముహూర్తం పెట్టి "ఒక దెబ్బకు రెండు పిట్టలు" అనే చందంగా మాల సామాజిక వర్గంలో పట్టున్న కాకా కుటుంబాన్ని బుట్టలో వేసుకుని రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కులం ఓట్లతో లబ్ది పొందే కార్యక్రమంలో భాగంగానే ట్యాంక్ బండ్ పై కాకా విగ్రాహాన్ని ఏర్పాటు చేశారని తెరాస, కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ పధకం ఫలించినట్లే కనిపిస్తుంది V6 చానల్ లో గత కొన్ని నెలలుగా కెసిఆర్, తెరాస భజన కార్యక్రమాలు, వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈ పరిణామాలు తెరాస ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలకు తీవ్ర నిరాశను కలిగించాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ పెద్దలెవరు హాజరు కాలేదు.
తెలంగాణా ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహానికి ట్యాంక్ బ్యాండ్ పై స్థానం కల్పించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రమే కాకా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటుగా, యమ్మార్పిఎస్ వర్గాల వారు, తెలంగాణా ప్రజలు, మేధావులు కూడా అంటున్నారు. ఎంతైనా కెసిఆర్... కేసీయారే! తనకు లాభం లేకుండా ఏపనీ చేయడు అంటున్నారు తెలంగాణా ప్రజలు.