తెరాస మంత్రుల, నాయకుల దూకుడు చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీ, వేడిగా ఉండి ఎన్నో సంచలనాలు జరుగబోతున్నాయి అని అందరూ ఊహించారు. కానీ కెసిఆర్ బృందం ఈ విషయంపై అనూహ్యంగా తోక ముడిచారు, రేవంత్ రెడ్డి వెంట్రుక పీకే సాహసం కూడా చేయలేక పోయారు. దీనికి తెర వెనుక కారణాలు సవా లక్ష ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రేవంత్ రెడ్డి పై చర్యకు సిఫార్సు చేసి ఒకవేళ అతను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నారాయణఖేడ్ ఉపఎన్నికతో పాటు కోడంగల్ ఉపఎన్నిక కూడా అనివార్యం అయిన పక్షంలో అక్కడ తెరాస విజయావకాశాలు ఎలా ఉండవచ్చో సర్వే చేయించిన కెసిఆర్ కు దిమ్మతిరిగే రిపోర్ట్ వచ్చిందట. గతంలో వచ్చిన మెజారిటీ కంటే రెండింతలు మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలుస్తాడని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయట. రేవంత్ పై చర్యలకు ఉపక్రమిస్తే కొరివితో తల గోక్కున్నట్లే అని భావించిన తెరాస ప్రభుత్వం ఈ విషయంలో తోక ముడిచి గమ్మున ఉండిపోయిందట. రెండో కారణం... ఇప్పటికే "ఫోన్ టాపింగ్" వ్యహారంలో పీకల్లోతు ఇరుకున్న తెరాస ప్రభుత్వం రేవంత్ విషయంలో అతిగా ప్రవర్తించి విషయం పెద్దది చేసుకుంటే చివరకు ఆ వ్యహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమకే చుట్టుకుంటుందనే భయంతో ఆ వ్యహారాన్ని అంతటితో ముగించిందని అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో గెలిచింది తెదేపా, రేవంత్ రెడ్డి.. ఓడింది మాత్రం తెరాస ప్రభుత్వం, కెసిఆర్.
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి. రైతుల రుణ మాఫీ పై సరైన సమాధానం చెప్పలేక ప్రతిపక్షాలను సభ నుండి బహిష్కరించి కెసిఆర్ భజనతో తెరాస మంత్రులు, శాసనసభ్యులు పునీతులౌతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో "ఓటుకు నోటు" విషయాన్ని నానా యాగీ చేసిన తెరాస ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంపై శాసనసభలో చర్చించి అందులో ప్రమేయం ఉన్న తెదేపా శాసనసభ్యుడు "రేవంత్ రెడ్డి", "సంద్ర వెంకట వీరయ్య, చంద్రబాబు నాయుడు పై చర్యలకు తీర్మానం చేస్తామని అంతేకాకుండా "రేవంత్ రెడ్డి" ని అసెంబ్లీ లోకి కూడా అడుగు పెట్టనీయమని, అతని శాసనసభ్యత్వం రద్దుకు సిఫార్సు చేస్తామని ఉత్తర కుమార ప్రఘల్బాలెన్నో పలికారు.
తెరాస మంత్రుల, నాయకుల దూకుడు చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాలు వాడీ, వేడిగా ఉండి ఎన్నో సంచలనాలు జరుగబోతున్నాయి అని అందరూ ఊహించారు. కానీ కెసిఆర్ బృందం ఈ విషయంపై అనూహ్యంగా తోక ముడిచారు, రేవంత్ రెడ్డి వెంట్రుక పీకే సాహసం కూడా చేయలేక పోయారు. దీనికి తెర వెనుక కారణాలు సవా లక్ష ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. రేవంత్ రెడ్డి పై చర్యకు సిఫార్సు చేసి ఒకవేళ అతను తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నారాయణఖేడ్ ఉపఎన్నికతో పాటు కోడంగల్ ఉపఎన్నిక కూడా అనివార్యం అయిన పక్షంలో అక్కడ తెరాస విజయావకాశాలు ఎలా ఉండవచ్చో సర్వే చేయించిన కెసిఆర్ కు దిమ్మతిరిగే రిపోర్ట్ వచ్చిందట. గతంలో వచ్చిన మెజారిటీ కంటే రెండింతలు మెజారిటీతో రేవంత్ రెడ్డి గెలుస్తాడని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయట. రేవంత్ పై చర్యలకు ఉపక్రమిస్తే కొరివితో తల గోక్కున్నట్లే అని భావించిన తెరాస ప్రభుత్వం ఈ విషయంలో తోక ముడిచి గమ్మున ఉండిపోయిందట. రెండో కారణం... ఇప్పటికే "ఫోన్ టాపింగ్" వ్యహారంలో పీకల్లోతు ఇరుకున్న తెరాస ప్రభుత్వం రేవంత్ విషయంలో అతిగా ప్రవర్తించి విషయం పెద్దది చేసుకుంటే చివరకు ఆ వ్యహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమకే చుట్టుకుంటుందనే భయంతో ఆ వ్యహారాన్ని అంతటితో ముగించిందని అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో గెలిచింది తెదేపా, రేవంత్ రెడ్డి.. ఓడింది మాత్రం తెరాస ప్రభుత్వం, కెసిఆర్.
2 Comments
sravanprasad
10/7/2015 07:26:42 am
Super.... excellent
Reply
Praveen
10/8/2015 02:57:31 am
Okatini pattukoni adukovali ani chusaru but devudu revath reddy gariki manchi chesadu ikada party kadhu imp the leder
Reply
Leave a Reply. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|