తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాలో వర్షాలు కురవక పోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాలో నదుల్లో, కాలవల్లో చుక్క నీరు లేకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాలో పరిశ్రమలు మూతబడటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాలో నిరుద్యోగుల సంఖ్య పెరగటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాలో జరిగిన ఎన్ కౌంటర్ కు కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాకు ప్రపంచ బ్యాంకు రేటింగ్ రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాకు పరిశ్రమలు రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణాకు చైనా, అమెరికా నుండి పెట్టుబడులు రాకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
తెలంగాణలో ప్రతి సమస్యకు కారణం: చంద్రబాబు నాయుడు
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పడిపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
హైదరాబాదులో మెట్రో రైల్ పనులు ఆలస్యం కావటానికి కారణం: చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ మురికి నగరంగా మారటానికి కారణం: చంద్రబాబు నాయుడు
గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు జరపలేకపోవటానికి కారణం: చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడును బూచిగా చూపించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కెసిఆర్, తెరాస నాయకులు.. ప్రజలు ఇంకా వీళ్ళు చెప్పేవన్నీ నమ్ముతున్నారని, నమ్మేస్తారని పిచ్చి భ్రమల్లో బ్రతికేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 17 నెలలు దాటింది. ప్రజలను బంగారు తెలంగాణా భ్రమల్లో ఉంచి కెసిఆర్ కుటుంబం తెలంగాణా సంపదను దోచేస్తూ, తన అస్మదీయులకు కూడా దోచిపెడుతూ ఈ రాష్ట్రాన్ని స్మశాన తెలంగాణాగా మార్చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో తెరాస నాయకులు 'తెలంగాణా రాబందుల సమితి''లా అందినకాడికి మేసేస్తున్నారు. పక్వానికి వచ్చినప్పుడే పండు పగులుతుంది, సమయం వచ్చినప్పుడే కెసిఆర్ బండారం బయటపడి తెలంగాణా ప్రజలు తగిన తీర్పు చెబుతారు.
ఒక్కటి మాత్రం నిజం.. "దుబాయ్ శేఖర్" అనబడే కెసిఆర్ ను గల్లీ లీడర్ స్థాయినుండి పెంచి పెద్ద చేసి మంత్రిని చేసి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి తుగ్లక్ ముఖ్యమంత్రి స్థాయికి చేర్చిన పాపం మాత్రం చంద్రబాబు నాయుడిదే...