ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుండి కూడా మహా మహులు అతిధులుగా విచ్చేస్తున్నారు, కొత్తగా ఏర్పడ బోతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించబోతుంది. ఇటువంటి అద్భుత కార్యక్రమానికి విచ్చేసినందుకు అతిధులకు గౌరవం లభిస్తుందే తప్ప వారివలన అమరావతికి గౌరవం రాదు. ఎంతో మంది విశిష్ట అతిదిలు విచ్చేస్తున్న ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి 42 కేసుల్లో A1 ముద్దాయి, ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే పేరొందిన ఆర్ధిక నేరస్థుడు జగన్ కూడా అతిధిగా హాజరైతే ఆ వేదిక గౌరవం తగ్గటమే కాకుండా, జగన్ లాంటి 420 గాళ్ళతో వేదిక పంచుకున్నందుకు అతిధులు కూడా చిన్నబుచ్చుకోవచ్చు. కారణం ఏదైనా జగన్ లాంటి దిష్టి పిడత గాళ్ళ నీచ దృష్టి 'అమరావతి' పై పడనందుకు మనం సంతోషించాలి. జగన్ తో పాటు మరి కొంత మంది దిష్టి పిడతగాళ్ళు రఘువీరారెడ్డి, రాఘవులు, జయప్రకాశ్ నారాయణ్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉంటే వాళ్ళు నిజంగా 'అమరావతికి' ఎంతో మేలుచేసిన వారౌతారు.
ఎవడి చూపు సోకితే పచ్చటి చెట్లు మోడువారి పోతాయో, ఎవడిని చూస్తే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయో, ఎవడి మాట వింటే ఏడ్చే పిల్లలు కూడా చటుక్కున ఏడుపు మానివేస్తారో వాడే జగన్! కొంతమంది ఏడుపుగొట్టు, కుళ్లు మోతు వెధవలు ఎదుటివాడు,పచ్చగా ఉన్నా, బాగుపడి పోయినా, మంచి పేరు తెచ్చుకున్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. వీళ్ళు మంచి మాట్లాడలేరు, మంచి వినలేరు, మంచి చూడలేరు.. ఇటువంటి కోవలోకి మొదటగా వచ్చే వ్యక్తి జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగు వాడు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న 'ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి' శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమానికి ఒక భాద్యతగల ప్రతిపక్ష నాయకుడిగానే కాక, ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా కూడా హాజరు కాలేనని చెప్పటం, తనకు ఆహ్వానం కూడా పంపవద్దని చెప్పటం వెనుక తనకు అంత అర్హతలేదని భావించాడని ఆంద్ర ప్రజలు అనుకోవచ్చా!
ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుండి కూడా మహా మహులు అతిధులుగా విచ్చేస్తున్నారు, కొత్తగా ఏర్పడ బోతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించబోతుంది. ఇటువంటి అద్భుత కార్యక్రమానికి విచ్చేసినందుకు అతిధులకు గౌరవం లభిస్తుందే తప్ప వారివలన అమరావతికి గౌరవం రాదు. ఎంతో మంది విశిష్ట అతిదిలు విచ్చేస్తున్న ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి 42 కేసుల్లో A1 ముద్దాయి, ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే పేరొందిన ఆర్ధిక నేరస్థుడు జగన్ కూడా అతిధిగా హాజరైతే ఆ వేదిక గౌరవం తగ్గటమే కాకుండా, జగన్ లాంటి 420 గాళ్ళతో వేదిక పంచుకున్నందుకు అతిధులు కూడా చిన్నబుచ్చుకోవచ్చు. కారణం ఏదైనా జగన్ లాంటి దిష్టి పిడత గాళ్ళ నీచ దృష్టి 'అమరావతి' పై పడనందుకు మనం సంతోషించాలి. జగన్ తో పాటు మరి కొంత మంది దిష్టి పిడతగాళ్ళు రఘువీరారెడ్డి, రాఘవులు, జయప్రకాశ్ నారాయణ్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉంటే వాళ్ళు నిజంగా 'అమరావతికి' ఎంతో మేలుచేసిన వారౌతారు.
0 Comments
Leave a Reply. |
Authorకబుర్లు... కాలక్షేపం, సూటిగా... సుత్తి లేకుండా! Archives
February 2018
CATAGORIES
All
|