రాజశేఖర రెడ్డి టైములో బాగా కుమ్మేసిన జెపికి ప్రస్తుతం సరైన బేరాలు లేని సమయంలో 'జగన్' తో మంచి డీల్ కుదిరిందంటున్నారు.. అందుకే ఈ మధ్య మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమై చంద్రబాబు నాయుడు పై, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పై, ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని 'అమరావతి' నిర్మాణం పై... 'జగన్' రాసిన స్క్రిప్ట్ చదివి, జగన్ సూచించిన పద్ధతిలో అర్ధం పర్ధం లేని, చవుకబారు విమర్శలు చేస్తున్నాడు.
రాజధాని నిర్మాణంపై ఆయన చేస్తున్న విమర్శలు చూస్తే వీడెంత పనికిమాలిన మేదావో.. చదువు రాని నాలాంటి సామాన్యుడికి కూడా సులువుగా అర్ధమైపోతుంది. రాజధాని నిర్మాణం పేరుతో 'అమరావతిని' మరో హైదరాబాద్ చేస్తారా అంటూ విరుచుకు పడ్డాడు... ఏం! హైదరాబాద్ వంటి గొప్ప రాజధాని నగరం ఆంధ్ర ప్రదేశ్ కు అవసరం లేదని వీడి భావనా!! హైదరాబాద్ తలదన్నే విధంగా 'అమరావతి' నిర్మాణం జరుగుతున్నందుకు వీడికి ఎందుకంత కడుపు మంట! ఆంధ్రులంటే ఎందుకంత చులకన? హైదరాబాద్ లో, బెంగుళూరులో ఆస్థులు ఏర్పాటు చేసుకున్న ఈ కృష్ణా జిల్లా అపర మేధావికి విజయవాడ ప్రాంతంలో ఆస్థులు లేనంత మాత్రాన ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? 'తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే' ఇలాంటి వెధవలను ఏ పేరుతొ పిలవాలి.
అధికార కేంద్రీకరణ అంతా ఒకే ప్రాంతంలో జరిగితే అసమానతలు తలెత్తి ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయని శలవిచ్చారు ఈ అపర మేధావి.. పచ్చటి సీమాంధ్ర లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టటం వీడి లక్ష్యమా? ఎక్కడైనా సరే అధికార కేంద్రీకరణ జరిగినప్పుడే పరిపాలన సులభతరం అవుతుంది, ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అసెంబ్లీ అమరావతిలో, సేక్రటేరియేట్ ఇడుపులపాయలో, మంత్రుల కార్యాలయాలు శ్రీకాకుళంలో, మంత్రుల, ఎమ్మెల్యేల నివాసాలు కర్నూలులో, అధికారుల నివాసాలు రాజమండ్రిలో, హై కోర్ట్ అనంతపురంలో ఉండాలని ఈ అపర మేధావి అభిప్రాయమా?
ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక వికేంద్రీకరణ వీడి కంటికి కనిపించటం లేదా! విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా రూపు దిద్దుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట, సత్యవీడు.. అనంతపురం జిల్లా హిందూపురం లో వేల కోట్ల విలువైన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వేల కోట్ల విలువైన పరిశ్రమలు వస్తున్నాయి.. ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరంలో భారీ పరిశ్రమలు, విశాఖపట్నంలో ఐటి సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రాజమండ్రి, కాకినాడలో చమురు, వ్యసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన ఐ ఐ టి, ఐ ఐ యమ్, యన్ ఐ టి, యన్ ఐ డి, పెట్రో యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం వీడి దృష్టికి రాలేదా!
అభివృద్ధి నిరోధకులతో చేతులు కలిపిన జెపి ప్యాకేజీలకు అమ్ముడు పోయి కేవలం అసూయ, అసహనంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాడు. హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై కపట ప్రేమ కురిపించే ఈ అపర దృతరాష్ట్రుడు జయప్రకాశ్ నారాయణ్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆంధ్ర ప్రభుత్వం పై, చంద్రబాబు నాయుడు పై చవుకబారు విమర్శలు మానుకోకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే తగిన గుణపాటం చెప్పటం ఖాయం!
నోట్: మేధావిలా చెప్పుకునే జయప్రకాశ్ నారాయణ్ మాట్లాడే భాష అంత సంస్కార హీనంగా ఉంటే.. నాబోటి సామాన్యుడి భాష ఇంతకంటే సొంపుగా ఎలా ఉంటుంది!