10,000 కోట్ల రూపాయల కేంద్ర సహాయం కోసం ఎదురు చూసిన ఆంధ్రులకు 1,500 కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అందచేస్తున్నట్లు నెల ఆఖరు రోజున కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలిసింది. ఐనా మన అమాయకత్వం కాని, మార్చి నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు నిజంగా 10,000 కోట్లు ఆర్ధిక సహాయం చేయదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రభుత్వ అధికారులకు తెలియచేయకుండా కేవలం సుజనా చౌదరి చెవిలో చెబుతుందా?
ఏదేమైనా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మరోసారి ఆంధ్ర ప్రజల చెవిలో కాలిఫ్లవర్ పువ్వులు పెట్టారు. మార్చి నెలలోనే ఆంధ్రులను ఏప్రిల్ ఫూల్స్ చేశారు. అబద్ధాలు చెప్పటంలో భాజపా వారితో తెదేపా కేంద్ర మంత్రి కూడా పోటీపడి ఆంధ్ర ప్రజలను పిచ్చి పువ్వులను చేయాలని చూస్తే ప్రజలకు ఆయన మీద కూడా నమ్మకం పోతుంది.