రామోజీ రావు ఆస్థుల్లొ సింహ భాగం తెలంగాణా ప్రాంతంలో ఉండటంతో ఆయన ఆస్థులు కాపాడుకోవటం కెసిఆర్ కు లొంగిపోయి నెలవారీ కప్పం కడుతున్నాడు, అందుకే కెసిఆర్ కూడా రామోజీ విషయంలో గతంలో తను చెప్పిన మాట మార్చి ఆయనకు అనుకూలంగా ఉంటున్నాడు.
ఈ టీవీ వీక్షకులు, ఈనాడు చదువరుల్లో, మార్గదర్శి చందాదారుల్లో ఎక్కువమంది ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం వారే ఉన్నారు, వీరికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంపై పన్నులు (సర్వీస్ టాక్స్, వాట్, ఆదాయం పన్ను) మాత్రం తెలంగాణా ప్రభుత్వానికే కడుతున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజల ద్వారా వచ్చే డబ్బుకు పన్నులు తెలంగాణలో కడుతూ కెసిఆర్ పట్ల, తెలంగాణా పట్ల తన స్వామి భక్తి చాటుకుంటున్నాడు. తమ సంస్థలకు ఆంధ్ర ప్రాంతంలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని పన్నులను ఆంధ్ర ప్రాంతంలోనే కట్టవచ్చు కదా!
ఆస్థులు పోగేసుకోవటం వాటిని కాపాడుకోవటం కోసం అధికారంలో ఉన్నవారితొ చెలిమి చేయటం, అవసరమైతే జగన్ లాంటి వాడితో స్నేహానికైనా వెనుకాడక పోవటం ఈయన నైజం... చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత జగన్ కు లాభిస్తుందని ఈయన అంచనాకు వచ్చాడట.
విచిత్రమేమిటంటే రామోజీ రావుకు తన పుట్టిన ఊరన్నా ఏమాత్రం మమకారం లేదు. తన పుట్టిన ఊరు పెదపారుపూడి పంచాయితీలో పాడుపడి నివాస యోగ్యంగా లేని తన పెంకుటింటిని కాని, దొడ్డిని కాని సెంటు భూమి కూడా గ్రామ ప్రయోజనాలకోసం విరాళం ఇవ్వలేదు, గ్రామములో ఏ ప్రభుత్వ పధకానికి కనీసం రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. ఈ విషయం ఆ ఉరిలో వారిని ఎవరిని అడిగినా చెబుతారు.
సినిమా పరిశ్రమ ఆంధ్ర ప్రాంతానికి తరలిపోకుండా అడ్డుపడుతున్న వారిలో రామోజీ రావే ముఖ్యుడు.. ఒకవేళ సినిమా పరిశ్రమ ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయిన పక్షంలో నష్టపొయెవారిలొ ఈయనే ప్రధముడు. హైదరాబాద్ లో తన ఆస్థులు కాపాడుకొనే క్రమం లో భాగంగా గతంలో సమైక్యాంధ్రకు మద్దతిచ్చిన రామోజీ రావు ఇప్పుడు పక్కా 'తెలంగాణా వాడి' లా మారి పోయాడు.
రామోజీ రావు, నువ్వు ఎక్కడ వ్యాపారం చేసుకుంటుంటే అక్కడే పన్నులు కట్టు, ఒక రాష్ట్రంలో వ్యాపారం చేసుకుంటూ ఇంకో రాష్ట్రంలో పన్నులు కట్టటం ఏ రకమైన నీతి? నిజంగా నువ్వు ఆంధ్రా బిడ్డవైతే ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి నువ్వు ఏమి చేస్తున్నావో, భవిష్యత్తులో ఏమి చేయబోతున్నావో ఆంధ్ర ప్రజలకు చెబితే నీ మీద నమ్మకం ఉంటుంది.