దళితులు, మైనారిటీల విషయంలో మాత్రమె ఏ చిన్న గొడవ జరిగినా దానిలో తల దూర్చి.. తమ లాభ నష్టాలను, రాజకీయ లబ్దిని బేరీజు వేసుకుని ఎక్కడ అవకాశం జారిపోతుందో, ఎక్కడ ఇతరులకంటే వెనుకబడిపోతామో అన్న ఆత్రంతో ఒకరిని మించి మరొకరు, ఒక పార్టీని మించి మరొక పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతూ పైశాచికానందం పొందుతున్నారు. రాబందులు శవాల కోసం ఎదురు చూసినట్లు ఈ రాజకీయ నాయకులు కుల ఘర్షణలు, మత ఘర్షణలు ఎక్కడ జరుగుతాయా వాలిపోదాం అని యెదురు చూస్తుంటారు.
కామాంధుల కామాగ్నికి బలైపోతున్న కన్నెపిల్లల గురించి వీళ్ళు ఎప్పుడైనా కన్నీరు పెట్టారా?
పట్టెడన్నం పెట్టే రైతు ఆకలి దప్పులతో, అప్పుల భారంతో అసువులు బాసినప్పుడు ఈ రాజకీయనాయకులెవరైనా కనీసం రెండు చుక్కల కన్నీళ్లు కార్చారా?
అన్ని అర్హతలు, ప్రతిభ ఉన్నా కానీ రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి నిరాశ నిసృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం చెబుతున్న సో కాల్డ్ ఉన్నత వర్గాల పేద నిరుద్యోగుల దీన గాధలు వీళ్ళ దృష్టికి రాలేదా?
అర్ధాకలితో మగ్గుతూ, రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ పోట్టపోసుకుంటున్న గూడు లేని నిరుపేదల పక్షాన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మన ప్రజా ప్రతినిధులు ఏనాడైనా పోరాడారా?
ప్రకృతి విపత్తుల బారినపడి ప్రజలు అల్లాడుతున్నాప్పుడు వీళ్ళు ఏనాడైనా స్పందిచారా! గుక్కెడు నీళ్ళు కానీ, పట్టెడన్నం కానీ దానం చేశారా?
తీవ్రవాద, నరహంతకుల మృత్యు క్రీడలో అమాయక ప్రజలు, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు స్పందించని ఈ లుచ్చా వెధవలు ఆ నరహంతకులకు కోర్టులు ఉరిశిక్ష విధించినప్పుడు మాత్రం అమానుషం అని ఖండిస్తూ రోడ్డెక్కుతున్నారు, మీడియా చర్చల్లో పాల్గొంటూ కోర్టు తీర్పులను, న్యాయ వ్యవస్థను తప్పుబడుతున్నారు. అసలు ముందుగా తీవ్రవాదానికి మద్దతు పలుకుతున్న ఇటువంటి దేశద్రోహులని నడి రోడ్డుపై బహిరంగంగా ఉరి తీయాలి.
నక్సల్స్ చేతిలో మరణించిన అమాయక దళిత, గిరిజనుల, పోలీసుల హత్యలను ఖండించని పౌర సంఘాలవారు ఎదురు కాల్పుల్లో నక్సల్స్ మరణించినప్పుడు మాత్రం నానా యాగీ చెస్తారు,
దళితులకో, మైనారిటి వర్గాలకో దెబ్బ తగిలినప్పుడే ఈ నాయకులకు నెప్పి పుడుతుందా?
ఇప్పటికైనా ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి తప్పును తప్పుగా ఖండించకుండా తమ స్వలాభం కోసం అక్రమార్కులకు, నేరస్తులకు వత్తాసు పలుకుతూ కేవలం కొన్ని వర్గాలకే కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే కనుక ఆ వర్గాలన్నీ ఏకమయ్యే రోజు వస్తుంది.
హిందువులైనా... ఇతర మతస్థులైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయ నాయకులను, పార్టీలను, కుల పరంగా రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులను, పార్టీలను తరిమి కొట్టండి. మనం ఏ మతం వారమైనా, ఏ కులం వారమైనా మనందరం భారతీయలుగానే బ్రతుకుదాం.....