తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు డెల్టా ప్రాంతాల్లోని కాపు సామాజిక వర్గం వారితో పోల్చుకుంటే రాయలసీమ ప్రాంత కాపు/ బలిజ వర్గం వారు అన్నిరంగాల్లో. మరియు ఆర్ధికంగా వెనుకబడే ఉన్నారని చెప్పవచ్చు.
ఆంధ్ర ప్రాంతంలో కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలు ఆర్ధికంగా బలమైన వర్గాలుగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ అగ్ర వర్ణాల వారితోపాటుగా వెనుకబడిన వర్గాలైన గౌడ, యాదవ, కొప్పుల వెలమ సామాజిక వర్గాల వారు కూడా రాజకీయ రంగంలో ముందంజలో ఉన్నారు.
కానీ నెల్లూరు, రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ జిల్లాల్లో రెడ్డి, బలిజ/కాపు, కమ్మ, గౌడ, యాదవ సామాజిక వర్గాలవారు అధికంగా ఉన్నా కానీ కేవలం రెడ్డి సామాజిక వర్గం వారే రాజకీయ, వ్యాపార రంగాల్లో అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కమ్మవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో కొంతవరకు ఆ కులం వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట పడింది.
బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లో ఆ వర్గం వారిని అన్నిరంగాల్లో అణగదొక్కింది కేవలం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ముఖ్య నాయకులే..
రాయలసీమ జిల్లాల్లో రాజశేఖర రెడ్డి, జగన్ బలిజ సామజిక వర్గాన్ని అణగదొక్కటానికి ప్రయత్నిన్చారనటానికి, తెలుగుదేశం పార్టీ ఆ సామాజికవర్గం వారికి ఏ విధంగా మేలు చేకూర్చినది తెలియచేయటానికి కొన్ని ఉదాహరణలు.
కడప జిల్లా, 'రాజంపేట' పార్లమెంట్ నియోజకవర్గం నుండి 1967 మొదలుకొని 2014 వరకు బలిజ/ కాపు సామాజికవర్గం వారే ఎం.పిలు గా ఎన్నికవుతూ వస్తున్నారు, ఆ ప్రాంతంలో బలంగా ఉన్న బలిజ సామాజికవర్గం వారినే అన్ని పార్టీలు తమ అభ్యర్ధిగా నిలబెట్టేవారు. గతంలో ఈ పార్లమెంటు స్థానం నుండి బలిజ వర్గానికి చెందిన పాలకొండ రాయుడు, రాయచోటి రామయ్య తెలుగుదేశం పార్టీ నుండి ఎంపిలు గా ఎన్నికయ్యారు. కానీ మొదటి సారి ఇందుకు భిన్నంగా జగన్ తన సామాజిక వర్గానికి చెందిన మిదున్ రెడ్డికి సీటిచ్చి గెలిపించుకుని రాయలసీమ ప్రాంతం లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక నియోకవర్గాన్ని ఆ కులం వారి వారికి దూరం చేశాడు. బిజెపి పార్టీ కూడా గత పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి ఈ సీటు లాక్కుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరిని నిలబెట్టి పెద్ద తప్పు చేసింది. వైకాపా, బిజెపి పార్టీలు రెండూ ఈ నియోజకవర్గంలో బలిజ/ కాపు సామాజిక వర్గం వారికి అన్యాయం చేశాయి.
అలాగే కడప జిల్లాలో బలిజ జనాభా అధికంగా ఉన్న కడప, రాజంపేట, రాయచోటి, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ, రాజశేఖర రెడ్డి కానీ ఏనాడూ ఆ వర్గం వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ రాజంపేట నుండి పసుపులేటి బ్రహ్మయ్యను గెలిపించి మంత్రిని కూడా చేసింది. అలాగే కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన సి.రామచంద్రయ్యను రెండు సార్లు రాజ్యసభకు పంపించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే.. రామచంద్రయ్యకు, బలిజ సామాజిక వర్గం వారికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత కల్పించటం జీర్ణించుకోలేని రెడ్డి వర్గం నాయకులు ఆ తరువాత పార్టీని విడిచిపెట్టి రాజశేఖర రెడ్డి పంచన చేరటం అందరికీ తెలిసిన విషయమే! రెడ్డి సామాజిక వర్గం వారు.. తమకు పార్టీ కన్నా తమ కుల ప్రయోజనాలే ముఖ్యం అని నిరూపించుకున్నారు.
చిత్తూరు జిల్లాలో అనాదిగా కమ్మవారే ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని మొట్టమొదటి సారిగా ఆ కులం వారికి కాకుండా బలిజలకు ( డి.కె ఆదికేశవులు నాయుడు) కేటాయించింది తెలుగుదేశం పార్టీనే.. ఆ తరువాత రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేసి ఆ స్థానం ఎస్.సి లకు రిజర్వ్ చేయించారు. ఒకే జిల్లాలో ఈ విధంగా రెండు స్థానాలు ఎస్.సి లకు రిజర్వ్ చేయించటం పెద్ద రాజకీయ కుట్రే..
రెడ్డి సామాజికవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి మొదటిసారిగా బలిజలకు (కత్తుల శ్యామల) కేటాయించి గెలిపించింది, ఆ తరువాత నుండి కూడా అదే వర్గం వారికి ప్రాధాన్యత ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి, బలిజ సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణ గెలుస్తాడనే అక్కసుతో అతనిపై దాడి చేసింది వైకాపా అభ్యర్ధి కరుణాకరరెడ్డి అనే విషయం ఆ జిల్లాలో బలిజ సామాజికవర్గం వారు అంత త్వరగా మరువలేరు అనే విషయం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి.
ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం కేవలం రాయలసీమ, నెల్లూరు జిల్లాలకే పరిమితమైన రెడ్డి వర్గం, ముఖ్యంగా జగన్ రెడ్డి తాము ఇక అధికారంలోకి రావటం కల్ల అని గ్రహించి కోస్తా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కాపు సామాజిక వర్గంలో కొందరిని ప్రోత్సహించి ఆ ప్రాంతంలో వారితో ఆందోళనలు చేయించి, కులాల కుంపట్లు రాజేసి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసిపి నుండి కనీసం ఒక్క సీటు కూడా బలిజలకు కేటాయించని జగన్ రెడ్డి ఇప్పుడు కాపులను రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. కమ్మ, కాపు కులాల వారు కలసి ఉండటం, ముఖ్యంగా కాపులు రాజకీయంగా ఎదగటం, కోస్తా జిల్లాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేని జగన్ చిల్లర రాజకీయాలను, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు.
గతంలో ఇరువురు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలకు (రంగా.. నెహ్రు) కులం రంగు పులిమి, కోస్తా జిల్లాలలో రావణ కాష్టం రగిలించి ప్రయోజనం పొందిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి అప్పుడు అనుసరించిన వ్యుహాన్నే అమలు చేయాలని చూస్తున్న జగన్ రెడ్డి కాపు వర్గంలో కొందరు నిత్య అసమ్మతి వాదులను ప్రోత్సహిస్తున్నాడు. గతంలో కమ్మ, కాపు గొడవల వలన రెండు కులాల వారు నష్ట పోయారు కానీ... అంతిమంగా లబ్ది పొంది మాత్రం రెడ్డి సామాజిక వర్గం వారే! ఇప్పుడు కూడా కాపులు జగన్ రెడ్డి వలలో పడితే చివరకు అదే జరుగుతుంది అనే విషయం మరువద్దు.
చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కాపులకు ఎన్నడూ దక్కని ముఖ్య శాఖలను, ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించాడు, అంతే కాకుండా కాపులకు 100 కోట్ల రూపాయలతో ఒక కమిషన్ ఎర్పాటు చేయటమే కాకుండా, కాపులను బిసి లలో చేర్చటానికి ఒక కమిషన్ కూడా నియమించారు. కాపులకు తమ అభివృద్ధి కావాలో లేక అధికార దాహంతో గుంట నక్కలా కాచుకుని కూర్చున్న జగన్ కావాలో తేల్చుకోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ కుట్రతో కులం రంగు పడిన యన్.టి రామారావు, చిరంజీవి కారణంగా ఆ రెండు కులాల వారు ఇతర కులాల వారికి దూరమై ఎంతో నష్టపోయారు. ఇప్పటికైనా కాపులు నిజా,నిజాలు గ్రహించి తమ కుల ప్రయోజనాలు కాపాడుకుంటూ ఇతర కులాలవారితో సామరస్యంగా ఉంటారో.. లేక జగన్ రెడ్డి లాంటి సాడిస్ట్ వెధవల కుట్రలు, కుతంత్రాల వలలో చిక్కుకుని మరోసారి నష్టపోతారో ఆలోచించుకోవాలి...