కాపుల రిజర్వేషన్ ఉద్యమాన్ని రెచ్చగొట్టి, వారి ఆందోళనలు హింసాత్మక చర్యలకు ప్రేరేపించటం ద్వారా ఆ ఉద్యమాన్ని నడుపుతున్న వారిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు ఉపక్రమించినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు శాసన సభ్యులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ సామాజిక వర్గ ప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెచ్చి కనీసం కొంతమంటి శాసనసభ్యులనైనా తన పార్టీలోకి తెచ్చుకోవాలనేది జగన్ రెడ్డి పన్నాగం పన్నాడని, ఆ పధకానికి దాసరి నారాయణరావు, బిజెపి లోని కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు వంటి కాపు నాయకుల సహకారాన్ని కూడా తీసుకున్నాడని, ఈ విషయంలో బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు మధ్యవర్తులుగా వ్యవహరించారని, కొంతమంది ఇతర కాంగ్రెస్స్ పార్టీ నాయకులూ కూడా ఈ విషయంలో జగన్ కు తమ లోపాయకారీ మద్దతు తెలియచేసి ప్రోత్సహించారని, దీని పర్యవసానమే జగన్ అత్యుత్సాహంతో తనకు 21 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటించారని ఇంటలిజెన్స్ వర్గాలకు ఉప్పందిందట.
వైకాపా అసంతృప్త ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోటానికి అప్పటివరకు పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యి తమ పార్టీ వారితో టచ్ లో ఉన్న వైకాపా ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలపై కూడా "ఆపరేషన్ ఆకర్ష్" ఉపయోగించమని తన పార్టీ మంత్రులకు సలహా ఇచ్చాడట. దీని ఫలితమే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.. శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యే సమయానికి కనీసం 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపా లో చేరవచ్చని అంటున్నారు.
జగన్ తొందరపాటు తనం ఎప్పుడూ అతనికి చేటు తెచ్చి పెడుతూనే ఉంటుంది. స్వంత పార్టీ శాసనసభ్యులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అహంకార వైఖరితో, మొండి తనంతో వ్యహరిస్తూ జ్యోతిష్యులను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవిపైనే కలలు కంటున్న జగన్ వ్యవహార శైలి చూసి ఇప్పటి వరకూ జగన్ కు అత్యంత విధేయులుగా ఉన్న నాయకులు సైతం ఇంకా జగన్నే అంటిపెట్టుకుని ఉంటె జగన్ జైలు కెళ్లటం తమ పుట్టి మునగటం ఖాయం అనే నిర్ణయానికి వచ్చేశారట. రాబోయే కాలంలో రోజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని వంటి పది మంది ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారందరూ తమ దారి తాము వెదుక్కునే అవకాశం ఉందని వైకాపా వర్గాల వారు గుస గుసలాడుకుంటున్నారు.
పాపం జగన్! తాను ప్రయోగిద్దామనుకున్న "ఆపరేషన్ ఆకర్ష్" అస్త్రం వికటించి "ఆపరేషన్ వికర్ష్" లాగా మారి తనకే ఎదురు తగిలింది. ఎత్తులు వెయ్యటమే తప్ప పై ఎత్తులు ప్రయోగించటం చేతకాని జగన్ తన స్వంత నిర్ణయాలతో, ఒంటెత్తు పోకడలతో రాజకీయాల్లో తన అపరిపక్వతను చాటుకుంటున్నాడని ఆ పార్టీలో సీనియర్ నాయకులే జగన్ పట్ల తమ అసహనాన్ని చాటుగా వ్యక్తం చేస్తున్నారట.
ఐనా! రోజా రెడ్డి లాంటి ఐరన్ లెగ్ జగన్ పక్కనున్నంత కాలం తమ పార్టీకి ఎలాంటి ధోకా ఉండదని తెలుగు తమ్ముళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు... కాంగ్రెస్ పార్టీలో తన పాదం మోపిన వెంటనే రాజశేఖర రెడ్డిని పావురాల గుట్టకు బలి చేసిన రోజా రెడ్డి జగన్ ను కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక గుట్టకు పంపటం ఖాయమని ఆనం వివేకా వంటి ఆశావాదులు అంటున్నారు...