ఏదైనా చిన్న సంస్థానానికి అధిపతి కావాలనే కోరిక చిన్నగా రాజుగారి మదిలోకి ప్రవేశించింది.. అనుకోకుండా అదేసమయంలో భారత రాజ్యానికి ఎన్నికలు వచ్చాయి.. అప్పటికప్పుడు బిజెపిలో చేరిపోయి ఆరెస్సెస్ పలుకుబడితో, పైరవీలు చేసి, భారీగా పార్టీ ఫండ్ వెదజల్లి "నర్సాపురం" సంస్థానానికి యంపి టికెట్ తెచ్చుకుని, ఎన్నికల్లో గెలిచి నర్సాపురం సంస్తానాధీసుడైపోయాడు.
రాజుగారికి గతంలో ఉన్న అపారమైన సంపదతో పాటు కొత్తగా అధికార పదవి కూడా సొంతమైంది, కేంద్రంలో అధికార పార్టీ యంపి గా తన పరిచయాల పరిధి విస్తృతం చేసుకున్నాడు.. రాష్ట్రంలో ఆరెస్సెస్ కు, బిజెపి కార్యక్రమాలకు ముఖ్య దాతగా మారి తన పలుకుబడిని మరింతగా పెంచుకున్నాడు.
ఇంతలోనే రాజుగారికి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది.. ఈ రాజుగారికి కృష్ణా నది తీరం వెంబడి ఎకరాలకొద్దీ భూమి, అందులో నదీ గర్భంలో ఎటువంటి అనుమతులు లేని, అక్రమంగా నిర్మాణం చేసిన రిసార్ట్ ఉంది. ఏదో రకంగా ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని, అధికారులను డబ్బుతో లొంగదీసుకుని ఆ నిర్మాణాలకు ఎటువంటి ధోకా లేకుండా చూసినా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అదే ప్రాంతంలో ఏర్పాటు కానుండటంతో ల్యాండ్ పూలింగ్ లో భాగంగా రాజుగారి భూములతో పాటు, రాజుగారి భవనాలకు కూడా పెద్ద చిక్కే వచ్చి పడింది. అక్కడ నిర్మితమైన అక్రమమైన కట్టడాలను గుర్తించిన ప్రభుత్వం, రాజుగారి రిసార్ట్ తో పాటుగా మరికొన్ని కట్టడాలను కూడా అక్రమ కట్టడాలుగా నిర్ణయించి పత్రికా ప్రకటన కూడా చేసింది.
ఎలాగైనా తన భూములకు, అందులోని కట్టడాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకున్న రాజుగారు.. తమ పార్టీలో కీలక స్థానంలో, అందులోనూ సాక్షాత్తు కేంద్ర "పట్టణాభివృద్ధి శాఖ" మంత్రిగా ఉన్న "నాయుడు" గారిని కలిశారు.. తన గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఆ సమస్యకు స్వచ్చ భారత్ ప్రచార కర్త, కేంద్ర మంత్రిగారు ఒక గొప్ప పరిష్కారం సూచించారు.. అదేమిటంటే ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొంత ఫండ్, తన భూమిలో కొంత స్థలం ఇచ్చి, దానిలో భవన నిర్మాణ భాద్యత రాజుగారు తీసుకోవాలని షరతు పెట్టారు. నాయుడు గారి అభయంతో వందల కోట్ల స్థల వివాదం పదుల కోట్ల పరిహారంతో పరిష్కారం కావటంతో రాజుగారు ఉపిరి పీల్చుకున్నారు...
ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కేమిటంటే పట్టణాలను అందంగా తీర్చిదిద్ది, ఆక్రమణలను అరికట్టవలసిన "పట్టణాభివృద్ధి" శాఖామాత్యుల వారే బిజెపి పార్టీ ఆఫీసుకు జనవరి 25వ తేదిన శంకుస్థాపన చేశారు. మరిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ.. గోకరాజు గంగరాజు స్థలం, అందులోని నిర్మాణాలు, మునిసిపల్ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేని, వివాదాస్పద భూమిలో అక్రమంగా నిర్మితమౌతున్న బిజెపి రాష్ట్ర భవనం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రజలకు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!
"రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా!" అంటూ బెజవాడ ప్రజానీకంతో పాటుగా బిజెపి శ్రేణులు కూడా ఈ విషయంలో "రాజు", "నాయుడు" అసంబద్ధ చర్యల పట్ల అసంతృప్తితో ఉన్నారు. మరిప్పుడు జనశక్తి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ అన్యాయంపై ఏరకంగా స్పందిస్తాడో అని సగటు మానవుడు ఎదురుచూస్తున్నాడు.
తాము అధికారంలో ఉన్నందువలన తామేమి చేసినా చెల్లుతుందని, తమను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదని బిజెపి వారు, సదరు మంత్రి వర్యులు భావిస్తే, భవిష్యత్తులో వారి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది... Beware of Andhra voters.