ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా గత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన చిదంబరం మనిషి నరసింహన్ ను యెంత త్వరగా ఇంటికి పంపిస్తే అంత మంచిది. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందటం స్వతహాగా తమిళులకు రుచించే అంశం కాదు, అందువలనే రాష్ట్ర విభజన అంశం నుండి, రాజధాని ఎంపిక వరకు అన్ని విషయాల్లోనూ తమిళులు తల దూర్చి ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేయాలనే చూశారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నరసింహన్ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్ హోదాలో నరసింహన్ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ఒకే పర్యటనలో రెండుసార్లు (సాయంత్రం, ఉదయం), ఒక్కోసారి మూడుసార్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు.
ఇలా తన అధికారాన్ని తన స్వంత ఆసక్తులు, ప్రయోజానాల కోసం ఉపయోగించుకోవటం ఒక రాష్ట్ర ప్రధమ పౌరుడిగా నరసింహన్ కు భావ్యమేనా?
గత కొద్ది కాలంగా గవర్నర్ పనితీరుపై కేంద్రంలోనూ చర్చ సాగుతోంది, దీనికి కొనసాగింపుగానే త్వరలోనే ఆయన రాజీనామా కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
గవర్నర్ వ్యవహార శైలిపై, ఆయన పక్షపాత వైఖరిపై ధైర్యంగా వార్తలు రాస్తున్న 'ఆంధ్ర జ్యోతి' పై తెలంగాణా మీడియా నిప్పులు చెరగటం వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ నరసింహం హస్తం ఉంది. ధైర్యం ఉంటె ఆంధ్ర జ్యోతి వార్తలకు సమాధానం చెప్పాలి కాని ఇలా 'ఆంధ్ర జ్యోతి' రాధా కృష్ణ ప్రాంతీయత పై అసమానతలు రెచ్చగొట్టటం ఎంతవరకు సమంజసం?