హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుత మార్కెట్ విలువ 909 కోట్ల రూపాయలు, ఇందులో భువనేశ్వరికి 22.98% వాటాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ వాటాల విలువే సుమారుగా 209 కోట్ల రూపాయలు ఉంటుంది, హెరిటేజ్ ఫుడ్స్ లో లోకేష్ వాటాల విలువ (10.2%) 93 కోట్లు, బ్రాహ్మణి వాటాల విలువ (0.44%) 4 కోట్లు ఉంటుంది. లోకేష్ లెక్కల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్ లో వీరి కుటుంబం మొత్తం వాటాల విలువ 306 కోట్ల రూపాయలుగా తేలుతుంది.
ఒక్క హెరిటేజ్ ఫుడ్స్ వాటాలు మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు కుటుంబానికి హైదరాబాద్, చిత్తూరు జిల్లా, బెంగుళూరు మొదలైన చోట్ల ఉన్న మొత్తం ఆస్థుల విలువ లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం కేవలం 46.58 కోట్ల రూపాయలు మాత్రమె ఉంది. ఇదేమి లెక్కబ్బా!
విచారించదగిన విషయమేమిటంటే ప్రస్తుతం చంద్రబాబునాయుడు తన ఆస్థి మొత్తం వెచ్చించినా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగరంలో కనీసం 100 గజాల స్థలం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. లోకేష్ చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. రాజశేఖరరెడ్డి, జగన్ మాదిరిగానే చంద్రబాబు నాయుడు కంటే లోకేషే గోప్పోడిలా కనిపిస్తున్నాడు, ఆస్థుల విషయంలో తన తండ్రినే మించి పోయాడు.