అసలే వేల కోట్ల నష్టాల్లో ఉన్న RTC యాజమాన్యం అప్పులతో జీతాలు ఇస్తూ ఏదో రకంగా సంస్థను నడుపుకొస్తుంది. ఐనా కూడా వేతనాల విషయంలో మంకు పట్టు పట్టి తమ పట్టుదలే నెగ్గాలని పంతం పడుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత ముఖ్యం కానీ, ప్రస్థుతం RTC కార్మికుల వాలకం చూస్తుంటే 'కూర్చున్న కొమ్మనే నరుక్కున్న' చందంగా ఉంది.
ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక కార్మికులతో బస్సులు నడపాలని ప్రయత్నం చేస్తుంటే, వారిపై దాడి చేయటం, బస్సులను ద్వ్హంసం చేయటం, డిపో ఆస్థులకు నష్టం కలిగించటం వంటి చర్యలకు RTC కార్మికులే పాల్పడటం చూస్తుంటే వీరి చేష్టలు 'తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే' వెధవలను గుర్తుకు తెస్తున్నాయి.
లక్ష మంది కార్మికుల మూలంగా 9 కోట్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా వై.సి.పి, అభివృద్ధి నిరోధక వామపక్ష పార్టీలు RTC కార్మికుల సమ్మెకు మద్దతు పలుకుతూ, వారి చర్యలకు వంతపాడటం చూస్తుంటే వీరికి కుళ్ళు రాజకీయాలే తప్ప ప్రజాసమస్యలు ముఖ్యం కాదని అర్ధం అవుతుంది. అప్పుల్లో ఉన్న సంస్థలో ఉద్యోగులకు జీతాలు వాళ్ళు కోరుకున్న విధంగా పెంచితే రేపు బస్సు చార్జీలు పెరిగి ఆ భారం మోయవలసింది ప్రజలేకదా!
'ఉద్యోగుల జీతాలు పెంచాలి, చార్జీలు పెంచకూడదు' ఇదేమి వితండ వాదం? బాధిత ప్రజలు ముందుగా సమ్మెకు మద్దతిస్తున్న వీళ్ళను ప్రశ్నించాలి. ప్రతిపక్షాల వారు RTC కార్మికుల సమ్మె మూలంగా ప్రయాణీకుల అవసరాలను ఆసరాగా తీసుకుని రెట్టింపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణీకుల జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లకు కొమ్ముకాస్తూ వారి ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారా? వీళ్ళకే కనుక నిజంగా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటె ముందుగా RTC కార్మికుల సమ్మె విరమించమని విజ్ఞప్తి చేయాలి, అలాగే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సుల ఆపరేటర్ల ముందు ధర్నా చేయాలి
ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల వాళ్ళు 'ప్రజల పక్షమా' లేక 'ప్రజా వ్యతిరేకపక్షమా' అనేది ముందుగా తేల్చుకోవాలి!