షరా మామూలుగానే దీక్షను వాయిదా వేసుకున్నారు, గతంలో కూడా జగన్ ఇదే విధంగా ఎన్నో సార్లు తను ప్రకటించిన కార్యక్రమాల తేదీలు వాయిదా వేసుకోవటం లేదా రద్దు చేసుకున్న విషయం ప్రజలందరికి తెలిసిందే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం ఆ తరువాత పునరాలోచించుకోవటం తమ నేతకు కొత్తేమీ కాదని వైకాపా వర్గాలు అంటున్నాయి.
నిజంగా జగన్ నిరవధిక దీక్షను చేయాలనుకుంటే జనాన్ని తరలించటానికి వీలుగా తనకు బలమైన రాయలసీమ లోని కడప జిల్లా ఇడుపులపాయలో చేస్తే బాగుండేది, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా గుంటూరు పట్టణాన్ని ఎంచుకుంటే ఎలాగు అనుమతి రాదనీ, ఆ వంకతో దీక్షను వాయిదా వేసుకోవచ్చని జగన్ అండ్ కో పన్నాగమని అంటున్నారు. జగన్ కొలెస్టరాల్ లెవెల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయని, అందువలన ప్రస్తుతం దీక్ష అవసరం లేదని డాక్టర్లు సలహా ఇచ్చారని కొందరు గిట్టనివారు కామెంట్లు చేస్తున్నారు.
గతంలో ఎన్నో సంఘటనలు పరిశీలిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రభుత్వం లేదా పోలీసులు అనుమతి నిరాకరిస్తే వెనక్కు తగ్గకుండా దీక్షకు సిద్ధపడి అరెస్టయిన సందర్భాలే ఎక్కువ. దమ్మున్న ఏ నాయకుడైనా పార్టీ క్యాడర్లో విశ్వాసాన్ని నింపాలంటే ఇటువంటి చర్యలు తప్పనిసరి, కానీ జగన్ ఏ మాత్రం అందుకు సిద్ధపడకపోవడం వైకాపా శ్రేణులను, రాజకీయ వర్గాలను కూడా విస్మయానికి గురి చేసిందని అంటున్నారు. జగన్ ఈ రకంగా తోకముడవటానికి కారణాలు తెలియక వైకాపా సీనియర్ నాయకులు సైతం తలలుపట్టుకుంటున్నారు.